Trends

ఇండియన్ యూట్యూబర్ తో ఎలాన్ మస్క్ – నిజామా? AI నా?

సోషల్ మీడియాలో ఇప్పుడు ఒకటే రచ్చ. జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ తన ‘WTF’ పాడ్‌కాస్ట్ కోసం వదిలిన ఒక చిన్న టీజర్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఎందుకంటే అందులో ఆయన పక్కన కూర్చుంది ఎవరో కాదు, ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్! వీళ్లిద్దరూ కలిసి ఉన్న వీడియో బయటకు రాగానే నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఒక ఇండియన్ యూట్యూబర్ షోకి మస్క్ రావడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియో నిజమా లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన మాయా? అనే అనుమానాలు ఇప్పుడు అందరినీ తొలుస్తున్నాయి.

నిఖిల్ కామత్ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ 39 సెకన్ల వీడియో చాలా వెరైటీగా ఉంది. ఇది పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఇందులో నిఖిల్, మస్క్ ఒకరినొకరు చూసుకుని పగలబడి నవ్వుకుంటున్నారు. మధ్యలో కాఫీ తాగుతున్నారు. నిఖిల్ చేతిలో ఉన్న కప్పుపై ‘SpaceX’ లోగో కూడా కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే, వీడియో మొత్తం ఒక్క డైలాగ్ కూడా లేదు. కేవలం కాగితాల శబ్దం, నవ్వులు మాత్రమే వినిపిస్తున్నాయి. “దీనికి క్యాప్షన్ ఇవ్వండి” అని నిఖిల్ పెట్టిన చిన్న పోస్ట్ ఇప్పుడు పెద్ద డిబేట్‌కి దారితీసింది.

ఈ వీడియో చూసిన జనాలు పిచ్చెక్కిపోతున్నారు. “ఇది నిజంగా ఎలాన్ మస్కేనా? లేక ఏఐతో మార్ఫింగ్ చేశారా?” అని కామెంట్స్ బాక్స్‌ని నింపేస్తున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఈ వీడియో నిజమా కాదా అని నెటిజన్లు మస్క్ సొంత ఏఐ అయిన ‘గ్రోక్’ (Grok)ని అడిగారు. దానికి అది ఇచ్చిన సమాధానం కన్ఫ్యూజన్‌ని ఇంకా పెంచింది. “ఈ వీడియోలో ఫేస్ మార్ఫింగ్ జరిగినట్లు అనిపిస్తోంది, ఇది ఏఐ జెనరేటెడ్ వీడియోలా ఉంది” అని గ్రోక్ చెప్పింది. కానీ అదే సమయంలో, ఇది నిజంగానే రాబోయే ఎపిసోడ్ టీజర్ కావొచ్చని, ప్రమోషన్ కోసం ఇలా ఎడిట్ చేసి ఉండొచ్చని కూడా హింట్ ఇచ్చింది. దీంతో సస్పెన్స్ హై లెవెల్ కి చేరింది.

నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌కి ఒక బ్రాండ్ ఉంది. గతంలో బిల్ గేట్స్, కిరణ్ మజుందార్ షా, రణబీర్ కపూర్, ఏకంగా ప్రధాని మోదీనే ఇంటర్వ్యూ చేసిన రికార్డ్ ఆయనది. 2025లో ఇదే బిగ్గెస్ట్ కొలాబరేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. మరి ఇది నిజమో, గ్రాఫిక్స్ మాయాజాలమో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

This post was last modified on November 29, 2025 7:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

భోజనంలో పురుగులు… వందేభారత్ రామానుజం ఏం చేశాడు?

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…

1 hour ago

చిరు బాబీ మిస్… వెంకీ అనిల్ ఫిక్స్

వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…

2 hours ago

వెయ్యి కోట్ల విధ్వంసం వారం రోజుల్లోనే

అంచనాలకు మించి దురంధర్ ది రివెంజ్ అరాచకం చేస్తోంది. సరిగ్గా వారం రోజులు కావడం ఆలస్యం వెయ్యి కోట్ల క్లబ్బులోకి…

3 hours ago

మంగళగిరిని లోకేశ్ వీడాల్సిందేనా…?

లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఖరారైన నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయా పరిణామాలపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ఈ…

4 hours ago

ప్రభాస్ ప్రేమిస్తే ఇంతే

నేటి తరం కుర్ర హీరోల్లో సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సోదరులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే వీరిద్దరి…

5 hours ago

ఘోర బస్సు ప్రమాదం 10 మంది సజీవదహనం

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మార్కాపురం జిల్లాలోని రాయవరం సమీపంలో పలకల క్వారీల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు…

7 hours ago