కరోనా ప్రభావం అసలేమాత్రం లేనట్లే ఉంది మన దగ్గర జనాల తీరు. మన దగ్గరే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి. అన్ని వ్యవహారాలూ యధావిధిగా నడిచిపోతున్నాయి. మాస్కులు, శానిటైజర్ల వాడకాన్ని కూడా లైట్ తీసుకునే పరిస్థితి వచ్చేసింది. జనాలు ఎక్కడ చూసినా గుంపులు గుంపులుగా కనిపిస్తున్నారు.
మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఒకేచోట వందలు, వేలమంది గుమికూడిన దృశ్యాలు ఎన్నో చూశాం. సభలు, సమావేశాలు అన్నీ మామూలుగానే నిర్వహించేస్తున్నారు. అసలు కరోనా ఉనికే లేనట్లుగా ఉంది. ఐతే మునుపటితో పోలిస్తే కరోనా ప్రభావం తగ్గి ఉండొచ్చు కానీ.. దాని ప్రభావాన్ని పూర్తిగా కొట్టి పారేయొద్దని, సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇలాగే లైట్ తీసుకున్న అమెరికా ఇప్పుడు మళ్లీ భయం గుప్పెట్లోకి వెళ్తోంది.
ఒక్క రోజులో అమెరికాలో కరోనా వల్ల 3157 మంది చనిపోయారంటే నమ్మశక్యంగా అనిపించదు. ఇది గతానికి సంబంధించిన విషయం కాదు. తాజా అప్డేటే. కరోనా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉన్న రోజుల్లో కూడా 24 గంటల్లో ఇన్ని మరణాలు నమోదు కాలేదు. ఏప్రిల్ 24న ఆ దేశంలో 2603 మరణాలు నమోదయ్యాయి. అది అప్పటికి ప్రపంచ రికార్డు. ఇప్పుడు అంతకంటే 550+ మరణాలు అధికంగా చోటు చేసుకున్నాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అమెరికాలో 24 గంటల వ్యవధిలో లక్ష మందికి పైగా కరోనాతో ఆసుపత్రుల్లో చేరడం గమనార్హం. గత నెల ఎన్నికల తాలూకు ప్రభావాన్నే అమెరికన్లు ఇప్పుడు చూస్తున్నారని, పరిస్థితి విషమిస్తోందని అక్కడి నిపుణులు అంటున్నారు. రాబోయే 3 నెలలు కఠిన పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
రష్యాలో సైతం ఒకేసారి రోజువారీ కేసులు పది రెట్లు పెరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇండియాలో కూడా కొంత విరామం తర్వాత కేసుల సంఖ్య పెరుగుతోందని.. ఇప్పుడు జాగ్రత్త వహించకపోతే మళ్లీ కరోనా తీవ్ర రూపం దాల్చడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
దర్శకుడు సురేందర్ రెడ్డి పిచ్చ వెయిటింగ్ లో ఉన్నారు. కారణం పవన్ కళ్యాణ్ అంగీకారం వస్తే సినిమా మొదలుపెట్టాలి. ఈ…
ఏపీలో ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు)గా ఉన్న వైసీపీ రెండేళ్ల కాలంలో ఏం చేసింది? ఏం సాధించింది? అనేది ఆసక్తికరం. శుక్రవారం(జూన్…
దర్శకులందు అనిల్ రావిపూడి వేరయాని ఊరికే అనలేదు. షూటింగ్ మొదలుపెట్టడానికి ముందే తనదైన ప్రమోషన్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్…
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…