Trends

సహచరుల అరెస్టుతో పానిక్‌… ఢిల్లీకి చేరి దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాది

ఢిల్లీని రక్తమోడించిన ఎర్రకోట పేలుడు కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజం బయటపడింది. 13 మంది ప్రాణాలు తీసిన ఆ బాంబును ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఎక్కడో తయారు చేసుకుని రాలేదు. నడిరోడ్డు పక్కన, పబ్లిక్ పార్కింగ్‌లోనే కూర్చుని దర్జాగా బాంబును రెడీ చేశాడని తెలుస్తోంది. ఎర్రకోట దగ్గరున్న సునేహ్రి మసీదు పార్కింగ్‌లో దాదాపు మూడు గంటల పాటు కారులోనే ఉండి, అందరి కళ్లుగప్పి ఈ మరణ మృదంగాన్ని సిద్ధం చేశాడని దర్యాప్తులో తేలింది.

అసలు పేలుడుకు ముందు ఉమర్ ఆ మూడు గంటలు ఏం చేశాడన్నదే పోలీసులకు ఇన్నాళ్లు మిస్టరీగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చిన ఉమర్, సాయంత్రం 6:28 గంటల వరకు కారు దిగలేదు. ఆ మూడు గంటల పాటూ అతను తన హ్యాండ్లర్లతో టచ్‌లోనే ఉన్నాడు. టార్గెట్ ఏంటి? ఎక్కడ పేల్చాలి? అనే విషయాలపై కారులో నుంచే చర్చిస్తూ, అక్కడికక్కడే పేలుడు పదార్థాలను అమర్చాడని అధికారులు నిర్ధారించారు.

నిజానికి ఉగ్రవాదుల అసలు ప్లాన్ వేరే ఉంది. ఎర్రకోట పార్కింగ్‌లోనే బాంబు పేల్చాలని ముందుగా స్కెచ్ వేశారు. దానికి తగ్గట్టే ఉమర్ మయూర్ విహార్, కన్నాట్ ప్లేస్ మీదుగా పాత ఢిల్లీ చేరుకున్నాడు. కానీ, ఆ రోజు సోమవారం కావడంతో ఎర్రకోట సందర్శకులకు సెలవు. దీంతో పార్కింగ్ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. జనం లేని చోట పేల్చి లాభం లేదని గ్రహించిన ఉమర్, తన హ్యాండ్లర్ల సూచనతో ప్లాన్ మార్చాడు. జనం రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్ వైపు కారును పోనిచ్చి, అక్కడ విధ్వంసం సృష్టించాడు.

ఇంత అర్జెంట్‌గా, పబ్లిక్ ప్లేస్‌లో రిస్క్ తీసుకుని మరీ బాంబు ఎందుకు తయారు చేశాడనే దానికి బలమైన కారణమే ఉంది. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలతో తన సహచరులు (డాక్టర్లు) ముజమ్మిల్, షాహీన్‌లు పట్టుబడ్డారు. వాళ్లు దొరికిపోవడంతో, పోలీసులు తనదాకా రావడం ఖాయమని ఉమర్ భయపడ్డాడు. పానిక్ అయిపోయాడు. అందుకే దొరికిపోయే లోపే ఏదో ఒక ఘోరం చేయాలనే కసితో, కంగారుగా ఢిల్లీకి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పార్కింగ్‌లో బాంబు పని పూర్తి కాగానే, 6:28కి బయటకు వచ్చిన ఉమర్.. సరిగ్గా 24 నిమిషాల్లోనే (6:52 గంటలకు) పేలుడు జరిపాడు. క్షణాల్లో ఆ ప్రాంతం మరణహోమంగా మారిపోయింది. ఉమర్ పానిక్ రియాక్షన్ వెనుక ఇంత కథ నడిచిందని తెలిసి దర్యాప్తు అధికారులే షాక్ అవుతున్నారు. డాక్టర్ చదువు చదివి, ప్రాణాలు తీసే టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్ చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

This post was last modified on November 19, 2025 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

2 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

3 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

3 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

4 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

6 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

6 hours ago