Trends

సహచరుల అరెస్టుతో పానిక్‌… ఢిల్లీకి చేరి దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాది

ఢిల్లీని రక్తమోడించిన ఎర్రకోట పేలుడు కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజం బయటపడింది. 13 మంది ప్రాణాలు తీసిన ఆ బాంబును ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఎక్కడో తయారు చేసుకుని రాలేదు. నడిరోడ్డు పక్కన, పబ్లిక్ పార్కింగ్‌లోనే కూర్చుని దర్జాగా బాంబును రెడీ చేశాడని తెలుస్తోంది. ఎర్రకోట దగ్గరున్న సునేహ్రి మసీదు పార్కింగ్‌లో దాదాపు మూడు గంటల పాటు కారులోనే ఉండి, అందరి కళ్లుగప్పి ఈ మరణ మృదంగాన్ని సిద్ధం చేశాడని దర్యాప్తులో తేలింది.

అసలు పేలుడుకు ముందు ఉమర్ ఆ మూడు గంటలు ఏం చేశాడన్నదే పోలీసులకు ఇన్నాళ్లు మిస్టరీగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చిన ఉమర్, సాయంత్రం 6:28 గంటల వరకు కారు దిగలేదు. ఆ మూడు గంటల పాటూ అతను తన హ్యాండ్లర్లతో టచ్‌లోనే ఉన్నాడు. టార్గెట్ ఏంటి? ఎక్కడ పేల్చాలి? అనే విషయాలపై కారులో నుంచే చర్చిస్తూ, అక్కడికక్కడే పేలుడు పదార్థాలను అమర్చాడని అధికారులు నిర్ధారించారు.

నిజానికి ఉగ్రవాదుల అసలు ప్లాన్ వేరే ఉంది. ఎర్రకోట పార్కింగ్‌లోనే బాంబు పేల్చాలని ముందుగా స్కెచ్ వేశారు. దానికి తగ్గట్టే ఉమర్ మయూర్ విహార్, కన్నాట్ ప్లేస్ మీదుగా పాత ఢిల్లీ చేరుకున్నాడు. కానీ, ఆ రోజు సోమవారం కావడంతో ఎర్రకోట సందర్శకులకు సెలవు. దీంతో పార్కింగ్ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. జనం లేని చోట పేల్చి లాభం లేదని గ్రహించిన ఉమర్, తన హ్యాండ్లర్ల సూచనతో ప్లాన్ మార్చాడు. జనం రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్ వైపు కారును పోనిచ్చి, అక్కడ విధ్వంసం సృష్టించాడు.

ఇంత అర్జెంట్‌గా, పబ్లిక్ ప్లేస్‌లో రిస్క్ తీసుకుని మరీ బాంబు ఎందుకు తయారు చేశాడనే దానికి బలమైన కారణమే ఉంది. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలతో తన సహచరులు (డాక్టర్లు) ముజమ్మిల్, షాహీన్‌లు పట్టుబడ్డారు. వాళ్లు దొరికిపోవడంతో, పోలీసులు తనదాకా రావడం ఖాయమని ఉమర్ భయపడ్డాడు. పానిక్ అయిపోయాడు. అందుకే దొరికిపోయే లోపే ఏదో ఒక ఘోరం చేయాలనే కసితో, కంగారుగా ఢిల్లీకి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పార్కింగ్‌లో బాంబు పని పూర్తి కాగానే, 6:28కి బయటకు వచ్చిన ఉమర్.. సరిగ్గా 24 నిమిషాల్లోనే (6:52 గంటలకు) పేలుడు జరిపాడు. క్షణాల్లో ఆ ప్రాంతం మరణహోమంగా మారిపోయింది. ఉమర్ పానిక్ రియాక్షన్ వెనుక ఇంత కథ నడిచిందని తెలిసి దర్యాప్తు అధికారులే షాక్ అవుతున్నారు. డాక్టర్ చదువు చదివి, ప్రాణాలు తీసే టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్ చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

This post was last modified on November 19, 2025 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

8 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

9 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

10 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

12 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

12 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

12 hours ago