Trends

సహచరుల అరెస్టుతో పానిక్‌… ఢిల్లీకి చేరి దారుణానికి ఒడిగట్టిన ఉగ్రవాది

ఢిల్లీని రక్తమోడించిన ఎర్రకోట పేలుడు కేసులో ఒళ్లు గగుర్పొడిచే నిజం బయటపడింది. 13 మంది ప్రాణాలు తీసిన ఆ బాంబును ఉగ్రవాది ఉమర్ మహమ్మద్ ఎక్కడో తయారు చేసుకుని రాలేదు. నడిరోడ్డు పక్కన, పబ్లిక్ పార్కింగ్‌లోనే కూర్చుని దర్జాగా బాంబును రెడీ చేశాడని తెలుస్తోంది. ఎర్రకోట దగ్గరున్న సునేహ్రి మసీదు పార్కింగ్‌లో దాదాపు మూడు గంటల పాటు కారులోనే ఉండి, అందరి కళ్లుగప్పి ఈ మరణ మృదంగాన్ని సిద్ధం చేశాడని దర్యాప్తులో తేలింది.

అసలు పేలుడుకు ముందు ఉమర్ ఆ మూడు గంటలు ఏం చేశాడన్నదే పోలీసులకు ఇన్నాళ్లు మిస్టరీగా ఉంది. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం.. మధ్యాహ్నం 3:19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చిన ఉమర్, సాయంత్రం 6:28 గంటల వరకు కారు దిగలేదు. ఆ మూడు గంటల పాటూ అతను తన హ్యాండ్లర్లతో టచ్‌లోనే ఉన్నాడు. టార్గెట్ ఏంటి? ఎక్కడ పేల్చాలి? అనే విషయాలపై కారులో నుంచే చర్చిస్తూ, అక్కడికక్కడే పేలుడు పదార్థాలను అమర్చాడని అధికారులు నిర్ధారించారు.

నిజానికి ఉగ్రవాదుల అసలు ప్లాన్ వేరే ఉంది. ఎర్రకోట పార్కింగ్‌లోనే బాంబు పేల్చాలని ముందుగా స్కెచ్ వేశారు. దానికి తగ్గట్టే ఉమర్ మయూర్ విహార్, కన్నాట్ ప్లేస్ మీదుగా పాత ఢిల్లీ చేరుకున్నాడు. కానీ, ఆ రోజు సోమవారం కావడంతో ఎర్రకోట సందర్శకులకు సెలవు. దీంతో పార్కింగ్ ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. జనం లేని చోట పేల్చి లాభం లేదని గ్రహించిన ఉమర్, తన హ్యాండ్లర్ల సూచనతో ప్లాన్ మార్చాడు. జనం రద్దీగా ఉండే నేతాజీ సుభాష్ మార్గ్ వైపు కారును పోనిచ్చి, అక్కడ విధ్వంసం సృష్టించాడు.

ఇంత అర్జెంట్‌గా, పబ్లిక్ ప్లేస్‌లో రిస్క్ తీసుకుని మరీ బాంబు ఎందుకు తయారు చేశాడనే దానికి బలమైన కారణమే ఉంది. ఫరీదాబాద్‌లో 2,900 కిలోల పేలుడు పదార్థాలతో తన సహచరులు (డాక్టర్లు) ముజమ్మిల్, షాహీన్‌లు పట్టుబడ్డారు. వాళ్లు దొరికిపోవడంతో, పోలీసులు తనదాకా రావడం ఖాయమని ఉమర్ భయపడ్డాడు. పానిక్ అయిపోయాడు. అందుకే దొరికిపోయే లోపే ఏదో ఒక ఘోరం చేయాలనే కసితో, కంగారుగా ఢిల్లీకి వచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.

పార్కింగ్‌లో బాంబు పని పూర్తి కాగానే, 6:28కి బయటకు వచ్చిన ఉమర్.. సరిగ్గా 24 నిమిషాల్లోనే (6:52 గంటలకు) పేలుడు జరిపాడు. క్షణాల్లో ఆ ప్రాంతం మరణహోమంగా మారిపోయింది. ఉమర్ పానిక్ రియాక్షన్ వెనుక ఇంత కథ నడిచిందని తెలిసి దర్యాప్తు అధికారులే షాక్ అవుతున్నారు. డాక్టర్ చదువు చదివి, ప్రాణాలు తీసే టెర్రరిస్ట్‌గా మారిన ఉమర్ చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Satya

Recent Posts

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

43 minutes ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

1 hour ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

2 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

2 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

3 hours ago

ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వబోం: కోమటిరెడ్డి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…

3 hours ago