Trends

ఇక్కడ బస్సులు.. అక్కడ రైళ్ళు.. గాల్లో ప్రాణాలు!

వరుస ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ఎటునుంచి ఏం ఢీకొంటుందో.. మృత్యువు ఏ వైపు నుంచి దూసుకు వస్తుందో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంటోంది. ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు.. దక్షిణాదిలో రైలు యాక్సిడెంట్లు కలవరపెడుతున్నాయి. ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీర్జాపూర్ లో ఘోర రైలు ప్రమాదం జరిగి ఆరుగురు మహిళలు మృతి చెందారు. నిన్నటి చత్తీస్గడ్ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 11 కు చేరింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బిలాస్పూర్ ప్యాసింజర్ రైలు, గూడ్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మీర్జాపూర్లో కార్తీక పౌర్ణమి వేళ విషాదం చోటు చేసుకుంది. చునార్రైల్వే స్టేషన్లో ఈ ఉదయం రైలు కింద పడి ఆరుగురు భక్తులు మృతి చెందారు. ప్యాసింజర్ రైలులో వచ్చిన భక్తులు స్టేషన్లో పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే ట్రాక్‌పై వేగంగా వస్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొనడంతో అక్కడికక్కడే ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరి కొంత మందికి గాయాలయ్యాయి. మృతదేహాల భాగాలు చెల్లాచెదురుగా పడి అక్కడ భీతావహ వాతావరణం నెలకొంది. నిన్న బిలాస్పూర్ సమీపంలో లోకల్మెనూ రైలు.. గూడ్సు రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నేడు 11కు చేరింది. 

కొద్ది రోజుల కిందట ఇదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు హడలెత్తించాయి. కర్నూలు జిల్లాలో గత నెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బెంగళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు, బైక్ నడుపుతున్న వ్యక్తి సజీవ దహనం అయ్యారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరిగిన బైకును బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని చెబుతున్నారు.

ఈ ఘటన మరువక ముందే గత సోమవారం తాండూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఆర్టీసీ బస్సు చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా 34 మందికి గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనల్లో అమాయకులైన ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలతో ఏ ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో.. అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

This post was last modified on November 5, 2025 3:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన రాజమౌళి తండ్రి

లెజెండ‌రీ రైట‌ర్‌, ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్.. ఒక స్టేజ్ మీద త‌ల‌వంచి క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.…

9 hours ago

ఏఐ లోకి జియో… మరో మ్యాజిక్ చేస్తుందా?

భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…

10 hours ago

నచ్చే పని చేసిన కల్ట్ బ్లాక్ బస్టర్

వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…

11 hours ago

సుహాస్ స్టామినాకిది అగ్ని పరీక్ష

చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…

13 hours ago

ఇలాంటి రాజకీయ నాయకులను ఏమనాలి?

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు మద్దతుగా వ్యవహరిస్తూ…

13 hours ago

రాజు గారు రెచ్చిపోతున్నారు

నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్‌గా ఎదిగాక..…

13 hours ago