Trends

సొమ్మసిల్లి పడిపోతే మార్చురీలో పడేశారు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..

మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం వైద్యం కోసం మానుకోట జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అయితే.. అతడి వద్ద ఆధార్ కార్డు లేకపోవటంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల పాటు ఆసుపత్రి క్యాంటీన్ ఆవరణలోనే ఉండిపోయాడు.

ఆసుపత్రి సిబ్బంది తనను కరుణించి.. వైద్యం చేస్తారని భావిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఎలాంటి వైద్య సాయం అందకపోవటం.. ఆహారం అందకపోవటంతో నీరసించిపోయాడు. క్యాంటీన్ ఆవరణలోనే స్ర్పహ తప్పిపోయాడు. అచేతన స్థితిలో ఉన్న రాజును చూసి అతడు మరణించినట్లుగా భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవటంతో అతడ్ని మార్చురీ ప్రాంగణంలో గేట్ వద్ద ఉంచేశారు. తర్వాతి రోజు మార్చురీ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది బాధితుడిలో కదలికల్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే అత్యవసర వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు.

This post was last modified on October 31, 2025 12:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

6 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago