విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతం ఒకటి మానుకోట జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వైద్యం కోసం వచ్చిన వ్యక్తి సొమ్మసిల్లి పడిపోతే.. చనిపోయినట్లుగా భావించి మార్చురీలో పడేసిన దారుణ వైనం షాక్ కు గురి చేస్తోంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలానికి చెందిన రాజు అనే వ్యక్తి మోకాళ్లు.. నడుం నొప్పులతో బాధ పడుతూ వారం క్రితం వైద్యం కోసం మానుకోట జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. అయితే.. అతడి వద్ద ఆధార్ కార్డు లేకపోవటంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్చుకునేందుకు అనుమతించలేదు. దీంతో రెండు రోజుల పాటు ఆసుపత్రి క్యాంటీన్ ఆవరణలోనే ఉండిపోయాడు.
ఆసుపత్రి సిబ్బంది తనను కరుణించి.. వైద్యం చేస్తారని భావిస్తూ అక్కడే ఉండిపోయాడు. ఎలాంటి వైద్య సాయం అందకపోవటం.. ఆహారం అందకపోవటంతో నీరసించిపోయాడు. క్యాంటీన్ ఆవరణలోనే స్ర్పహ తప్పిపోయాడు. అచేతన స్థితిలో ఉన్న రాజును చూసి అతడు మరణించినట్లుగా భావించిన ఆసుపత్రి సిబ్బంది అతన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అక్కడ బాక్సులు ఖాళీ లేకపోవటంతో అతడ్ని మార్చురీ ప్రాంగణంలో గేట్ వద్ద ఉంచేశారు. తర్వాతి రోజు మార్చురీ క్లీన్ చేసేందుకు వచ్చిన సిబ్బంది బాధితుడిలో కదలికల్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఉదంతం గురించి సమాచారం అందుకున్న ఆసుపత్రి సిబ్బంది వెంటనే అత్యవసర వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నారు.
This post was last modified on October 31, 2025 12:59 pm
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…
కార్తీ కెరీర్ బెస్ట్ హిట్స్ గా చెప్పుకునే సినిమాల్లో ఖైదీ, నా పేరు శివ తర్వాత సర్దార్ ఉంటుంది. తెలుగులోనూ…