Trends

అక్కడ అంత్యక్రియల ఖర్చు రూ.4.15 కోట్లు.. అందుకే చేయకుండా..

చనిపోయిన వారిని భూమిలో పూడ్చడం లేదా దహనం చేయడం ప్రపంచమంతా పాటించే సంప్రదాయం. కానీ ఇండోనేషియాలోని ఒక తెగ మాత్రం ఈ సంప్రదాయాలకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తుంది. ఇండోనేషియాలోని సౌత్ సులవేసి ప్రావిన్స్‌లో ఉన్న తొరాజా జాతి ప్రజలు చనిపోయిన వారిని తమ ఇంట్లోనే ఉంచుతారు, వారి మధ్యే జీవిస్తారు. ఈ విచిత్ర సంస్కృతి బయటివారికి వింతగా అనిపించినా, తమ దృష్టిలో మరణం అనేది ఒక గొప్ప ప్రయాణంలో మరో అడుగు మాత్రమే అని వీరు నమ్ముతారు. అందుకే, ఇక్కడ చనిపోయినవారిని ‘జీవించి ఉన్న మృతదేహాలు’గా పిలుస్తారు.

తొరాజా ప్రజల సంస్కృతిలో అంత్యక్రియల (ఫ్యూనరల్) ఖర్చు చాలా ఎక్కువ. అంత్యక్రియలు పూర్తి చేయడానికి అవసరమైన డబ్బును, ఇతర వనరులను సమకూర్చుకోవడానికి కొందరికి సంవత్సరాలు పడుతుంది. అంతవరకు, చనిపోయినవారి మృతదేహాలను మమ్మీకరణ (Mummified) చేసి, తొంగ్కోనన్ అనే ప్రత్యేక గదులలో ఇంట్లోనే భద్రపరుస్తారు. అంత్యక్రియలకు అయ్యే ఖర్చు దాదాపు $500,000 (సుమారు రూ. 4.15 కోట్లు) వరకు ఉంటుందని ట్రావెల్ బ్లాగర్లు చెబుతున్నారు.

తొరాజా కమ్యూనిటీలో అంత్యక్రియలు అంటే దుఃఖించే సమయం కాదు, అదొక ఉత్సవం. ఈ వేడుక ఐదు రోజుల పాటు జరుగుతుంది. ఈ సందర్భంగా వందలాది మంది అతిథులకు భోజనం పెట్టాలి, పెద్ద సంఖ్యలో గేదెలు, పందులను బలి ఇవ్వాలి. చనిపోయినవారి కోసం కొత్త గుడిసె కట్టి, దాన్ని అంత్యక్రియల్లో తగలబెట్టాలి. మృతదేహాన్ని పూడ్చే ఖర్చు, అంతవరకు మమ్మీని జాగ్రత్తగా చూసుకునే ఖర్చు దీనికి అదనం.

ఈ ఖర్చును తగ్గించుకోవడానికి లేదా మరో కుటుంబ సభ్యుడు చనిపోయే వరకు వేచి చూడటానికి కూడా కొందరు మృతదేహాలను భద్రపరుస్తారు. ఎవరైనా భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే, రెండో భాగస్వామి ‘పుయా’ (మరణానంతర ప్రయాణం) లో జాయిన్ అయ్యే వరకు, చనిపోయినవారి మృతదేహాన్ని భద్రంగా ఉంచుతారు. ఈ తెగ ప్రజలు తమ పూర్వీకుల మృతదేహాలతోనే జీవిస్తారు. చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవడానికి ‘మనెనె’ అనే ప్రత్యేక ఆచారం పాటిస్తారు.

ఇందులో భాగంగా, మృతదేహాలను సమాధుల నుంచి వెలికితీసి, శుభ్రం చేసి, కొత్త దుస్తులు తొడుగుతారు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని కొత్తగా కలిసిన వారికి, చిన్న పిల్లలకు వారిని పరిచయం చేస్తారు. ఈ ప్రక్రియ చాలా సంవత్సరాల వరకు కొనసాగుతుంది. తొరాజా రీజియన్ పచ్చని ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, అక్కడికి వెళ్లే టూరిస్టులు కేవలం ఫోటోల కోసం కాకుండా, ఈ విచిత్రమైన మరణ సంస్కృతిని ప్రత్యక్షంగా చూడటానికి వెళ్తారు.

This post was last modified on October 14, 2025 2:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

24 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

44 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

2 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago