ఆకాశం వైపు చూస్తే క్షణాల్లో మెరిపించి మాయం అయ్యే తోకచుక్కలు ఆసక్తి రేపుతాయి. తాజాగా ‘3ఐ/అట్లాస్’ అనే కొత్త తోకచుక్క ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. గంటకు 2.21 లక్షల కిలోమీటర్ల వేగంతో ఇది మన సౌరవ్యవస్థ వైపు దూసుకొస్తోంది. కానీ ఆందోళన అవసరం లేదని నాసా చెబుతోంది.
ఈ తోకచుక్క మన సౌరవ్యవస్థకు బయటి నుంచి వచ్చింది. అందుకే దీని పేరులోని ‘ఐ’ అంటే ఇంటర్స్టెల్లార్ అని, అంటే “నక్షత్రాల మధ్య నుంచి వచ్చిన అతిథి” అని అర్థం. దీన్ని మొదటగా చిలీలోని ఒక అబ్జర్వేటరీ 2025 జూలై 1న గుర్తించింది. గతంలో 2017లో ‘ఔమువామువా’, 2019లో ‘బోరిసోవ్’ అనే వస్తువులు కూడా ఇలాగే బయట నుంచి మన సిస్టమ్లోకి వచ్చాయి. ఇప్పుడు ‘3ఐ/అట్లాస్’ మూడో అతిథి.
నాసా ప్రకారం, ఈ తోకచుక్క అక్టోబర్ 30 నాటికి సూర్యుడికి దగ్గరగా వస్తుంది. అప్పటికి ఇది సూర్యుడి నుంచి సుమారు 21 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ భూమి నుంచి మాత్రం ఇది దాదాపు 27 కోట్ల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి మనకు ఎలాంటి ముప్పు ఉండదని నాసా శాస్త్రవేత్తలు ధృవీకరించారు.
ఇప్పుడు హబుల్, జేమ్స్ వెబ్ వంటి పెద్ద టెలిస్కోపులు దీని కదలికను గమనిస్తున్నాయి. సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ దీని తోక కాంతి మరింత అందంగా, ప్రకాశవంతంగా మారుతుందని చెబుతున్నారు. 2026 మార్చి నాటికి ఇది బృహస్పతి గ్రహాన్ని దాటి, తిరిగి మన సౌరవ్యవస్థ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇది కొద్ది నెలల అతిథి మాత్రమే.
ఇలా చూడగానే ఇది ఒక తోకచుక్కే అయినా, దీని వల్ల శాస్త్రవేత్తలకు పెద్ద అవకాశాలు దొరుకుతున్నాయి. బయట గెలాక్సీల నుంచి వచ్చే వస్తువులను అధ్యయనం చేయడం ద్వారా విశ్వ రహస్యాలు మరింత స్పష్టమవుతాయి. కాబట్టి ‘3ఐ/అట్లాస్’ భయానికి కాదు, ఆశ్చర్యానికి కారణం. భూమికి ఎలాంటి ముప్పు లేకపోయినా, ఇది అంతరిక్ష అభిమానులకు ఒక సూపర్ విజువల్ షోగా మారబోతోందని నాసా చెబుతోంది.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…