ఆసియా కప్లో భారత్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ హీట్ పెంచేలా ఉంది. గ్రూప్ స్టేజ్, సూపర్ 4లో ఇప్పటికే రెండుసార్లు తలపడినా పాక్ నెగ్గలేదు. ఇక మూడోసారి టైటిల్ పోరులో పాక్ రివేంజ్ కోసం ఢీ కొట్టబోతోంది. సెమీ ఫైనల్ తరహా మ్యాచ్లో పాకిస్థాన్ బంగ్లాదేశ్పై 11 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్కు చేరింది. 135 పరుగుల లక్ష్యాన్ని రక్షించడంలో షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ చెరో మూడు వికెట్లు తీయడం కీలకమైంది.
ఈ విజయానంతరం హారిస్ రౌఫ్ అభిమానులను కలుసుకోవడానికి స్టాండ్స్కి వెళ్లాడు. అక్కడ ఓ అభిమాని రెండు చేతలతో దడం పెట్టి, కన్నీళ్లు పెట్టుకుని అతనికి ఒక విజ్ఞప్తి చేశాడు. “భారత్పై ప్రతీకారం తీర్చుకోవాలి. ఇండియాను వదలొద్దు. దేవుని పేరుతో చెబుతున్నా.. ఈ ఫైనల్ గెలవాలి” అని ఆ ఫ్యాన్ అన్నాడు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హారిస్ రౌఫ్ ఆ అభిమానికి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి వెళ్ళిపోయాడు.
అయితే హారిస్ రౌఫ్ పేరు ఈ టోర్నీలో వివాదాలకీ కారణమైంది. సూపర్ 4లో భారత్తో జరిగిన మ్యాచ్లో అభిమానులపై అసభ్య సంకేతాలు చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. భారత అభిమానులు “కోహ్లీ, కోహ్లీ” అంటూ నినాదాలు చేసినప్పుడు విమానం కూల్చేసినట్లు చూపిస్తూ సంకేతం చేశాడు. ఇది 2022లో కోహ్లీ వేసిన రెండు సిక్స్లను గుర్తుచేసి ఎగతాళి చేసినట్టే అని విమర్శలు వచ్చాయి.
అంతేకాకుండా, అదే మ్యాచ్లో హారిస్ రౌఫ్ భారత ఓపెనర్లు శుభ్మన్ గిల్, అభిషేక్ శర్మలపై దుర్భాషలాడినట్టు వీడియోలు బయటపడ్డాయి. అయితే ఇద్దరూ బ్యాట్తో సమాధానం చెప్పి రన్స్ సాధించారు. ఇదే సమయంలో పాక్ బ్యాటర్ సహిబ్జాదా తన హాఫ్ సెంచరీ అనంతరం బ్యాట్ను మెషీన్ గన్లా పట్టుకుని గన్ ఫైరింగ్ తరహాలో చేయడం మరో పెద్ద వివాదానికి దారి తీసింది.
ఇక ఫైనల్ వేదికగా దుబాయ్ సిద్ధమవుతోంది. అభిమానుల్లోనూ, ఆటగాళ్లలోనూ ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. పాక్ ఫ్యాన్స్ ప్రతీకారం మాటలు చెబుతుండగా, భారత జట్టు మాత్రం హ్యాట్రిక్పై దృష్టి పెట్టింది. మైదానంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది సెప్టెంబర్ 28న తేలనుంది. ఒకవైపు అభిమానుల భావోద్వేగం, మరోవైపు ఆటగాళ్ల ప్రదర్శన.. ఈ ఫైనల్ ఆసియా కప్ చరిత్రలో గుర్తుండిపోయేలా ఉండనుందని అనిపిస్తుంది.
This post was last modified on September 26, 2025 4:54 pm
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…
వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…
తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…
టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…
బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…