Trends

అమెరికా వీసా హడావిడి.. టికెట్ ధరలతో బిగ్ షాక్

అమెరికాలో హెచ్‌1బీ వీసా (H1B Visa) రుసుముల పెంపు నిర్ణయం టెక్ ప్రొఫెషనల్స్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఈ నెల 21లోగా ఉద్యోగులు అమెరికాలో ఉండాలని టెక్ కంపెనీలు స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో, చివరి నిమిషం వరకు భారత్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు విమానాశ్రయాలపైకి పరుగులు తీశారు. ఈ హడావుడి కారణంగా అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.

దిల్లీ నుంచి న్యూయార్క్ నాన్‌స్టాప్ ఫ్లైట్ ఎకానమీ టికెట్ సాధారణంగా రూ.37 వేల వద్ద ఉండగా, ఇప్పుడు అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెలెస్ చేరేందుకు దుబాయ్ మీదుగా వెళ్లే టికెట్ ధర రూ.1.32 లక్షలకు చేరింది. డాలస్ రూట్ కూడా రూ.80 వేల నుంచి రూ.90 వేల మధ్యకు పెరిగింది. అయినా సరే, గడువులోగా అమెరికా చేరుకోవాలనే తాపత్రయంతో ఇంజినీర్లు అధిక ధరలు కడుతున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరే దృశ్యాలు కనిపించాయి. వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువులు, బరువైన లగేజీలతో క్యూలలో నిలిచిన ప్రయాణికులు, సిబ్బందిని వేడుకున్నవారు. ఇప్పటికే విమానంలో ఎక్కినవారు కొత్త సమాచారం తెలిసి దిగిపోవడం, ట్రాన్సిట్ పాయింట్లలో మార్పులు చేసుకోవడం వంటి ఘటనలతో గందరగోళం మరింత పెరిగింది.

దసరా, దీపావళి పండగలకు స్వస్థలాలకు వచ్చినవారిలో చాలామంది తిరిగి అమెరికాకు వెళ్లేందుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వచ్చినవారు కూడా ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ నిర్ణయం కారణంగా అనూహ్యంగా మారిన పరిస్థితులు ఈ కుటుంబాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

Satya

Recent Posts

ఒక నయనతార.. ఒక త్రిష.. ఒక నివేథా

కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…

55 minutes ago

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

2 hours ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

3 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

3 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

4 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

4 hours ago