అమెరికాలో హెచ్1బీ వీసా (H1B Visa) రుసుముల పెంపు నిర్ణయం టెక్ ప్రొఫెషనల్స్ను గందరగోళంలోకి నెట్టింది. ఈ నెల 21లోగా ఉద్యోగులు అమెరికాలో ఉండాలని టెక్ కంపెనీలు స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో, చివరి నిమిషం వరకు భారత్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు విమానాశ్రయాలపైకి పరుగులు తీశారు. ఈ హడావుడి కారణంగా అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.
దిల్లీ నుంచి న్యూయార్క్ నాన్స్టాప్ ఫ్లైట్ ఎకానమీ టికెట్ సాధారణంగా రూ.37 వేల వద్ద ఉండగా, ఇప్పుడు అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెలెస్ చేరేందుకు దుబాయ్ మీదుగా వెళ్లే టికెట్ ధర రూ.1.32 లక్షలకు చేరింది. డాలస్ రూట్ కూడా రూ.80 వేల నుంచి రూ.90 వేల మధ్యకు పెరిగింది. అయినా సరే, గడువులోగా అమెరికా చేరుకోవాలనే తాపత్రయంతో ఇంజినీర్లు అధిక ధరలు కడుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరే దృశ్యాలు కనిపించాయి. వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువులు, బరువైన లగేజీలతో క్యూలలో నిలిచిన ప్రయాణికులు, సిబ్బందిని వేడుకున్నవారు. ఇప్పటికే విమానంలో ఎక్కినవారు కొత్త సమాచారం తెలిసి దిగిపోవడం, ట్రాన్సిట్ పాయింట్లలో మార్పులు చేసుకోవడం వంటి ఘటనలతో గందరగోళం మరింత పెరిగింది.
దసరా, దీపావళి పండగలకు స్వస్థలాలకు వచ్చినవారిలో చాలామంది తిరిగి అమెరికాకు వెళ్లేందుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వచ్చినవారు కూడా ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ నిర్ణయం కారణంగా అనూహ్యంగా మారిన పరిస్థితులు ఈ కుటుంబాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.
This post was last modified on September 21, 2025 12:07 pm
జనసేనాని పవన్ కళ్యాణ్ మీద గత రెండు మూడు రోజులుగా వైసీపీ మద్దతుదారులు. అనుకూల మీడియా పెడుతున్న సోషల్ మీడియా…
మేం ఫేమస్ చిత్రంతో టాలీవుడ్లోకి దూసుకొచ్చాడు యువ నటుడు సుమంత్ ప్రభాస్. షార్ట్ ఫిలిమ్స్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ…
ఇప్పుడు టాలీవుడ్లో ఏ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పరిస్థితీ అంత బాగా లేదు. సక్సెస్ రేట్ అంతకంతకూ పడిపోతోంది. జనాలు థియేటర్లకు…
సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయస్ అయ్యర్ ఎందుకు లేడు? భారత టీ20 జట్టు విషయంలో చాలా రోజులుగా అభిమానులను…
తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…
తమిళనాట రాజకీయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కగజం…