అమెరికాలో హెచ్1బీ వీసా (H1B Visa) రుసుముల పెంపు నిర్ణయం టెక్ ప్రొఫెషనల్స్ను గందరగోళంలోకి నెట్టింది. ఈ నెల 21లోగా ఉద్యోగులు అమెరికాలో ఉండాలని టెక్ కంపెనీలు స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో, చివరి నిమిషం వరకు భారత్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు విమానాశ్రయాలపైకి పరుగులు తీశారు. ఈ హడావుడి కారణంగా అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.
దిల్లీ నుంచి న్యూయార్క్ నాన్స్టాప్ ఫ్లైట్ ఎకానమీ టికెట్ సాధారణంగా రూ.37 వేల వద్ద ఉండగా, ఇప్పుడు అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెలెస్ చేరేందుకు దుబాయ్ మీదుగా వెళ్లే టికెట్ ధర రూ.1.32 లక్షలకు చేరింది. డాలస్ రూట్ కూడా రూ.80 వేల నుంచి రూ.90 వేల మధ్యకు పెరిగింది. అయినా సరే, గడువులోగా అమెరికా చేరుకోవాలనే తాపత్రయంతో ఇంజినీర్లు అధిక ధరలు కడుతున్నారు.
శంషాబాద్ విమానాశ్రయంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరే దృశ్యాలు కనిపించాయి. వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువులు, బరువైన లగేజీలతో క్యూలలో నిలిచిన ప్రయాణికులు, సిబ్బందిని వేడుకున్నవారు. ఇప్పటికే విమానంలో ఎక్కినవారు కొత్త సమాచారం తెలిసి దిగిపోవడం, ట్రాన్సిట్ పాయింట్లలో మార్పులు చేసుకోవడం వంటి ఘటనలతో గందరగోళం మరింత పెరిగింది.
దసరా, దీపావళి పండగలకు స్వస్థలాలకు వచ్చినవారిలో చాలామంది తిరిగి అమెరికాకు వెళ్లేందుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వచ్చినవారు కూడా ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ నిర్ణయం కారణంగా అనూహ్యంగా మారిన పరిస్థితులు ఈ కుటుంబాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.
This post was last modified on September 21, 2025 12:07 pm
రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…