Trends

అమెరికా వీసా హడావిడి.. టికెట్ ధరలతో బిగ్ షాక్

అమెరికాలో హెచ్‌1బీ వీసా (H1B Visa) రుసుముల పెంపు నిర్ణయం టెక్ ప్రొఫెషనల్స్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఈ నెల 21లోగా ఉద్యోగులు అమెరికాలో ఉండాలని టెక్ కంపెనీలు స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో, చివరి నిమిషం వరకు భారత్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు విమానాశ్రయాలపైకి పరుగులు తీశారు. ఈ హడావుడి కారణంగా అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.

దిల్లీ నుంచి న్యూయార్క్ నాన్‌స్టాప్ ఫ్లైట్ ఎకానమీ టికెట్ సాధారణంగా రూ.37 వేల వద్ద ఉండగా, ఇప్పుడు అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెలెస్ చేరేందుకు దుబాయ్ మీదుగా వెళ్లే టికెట్ ధర రూ.1.32 లక్షలకు చేరింది. డాలస్ రూట్ కూడా రూ.80 వేల నుంచి రూ.90 వేల మధ్యకు పెరిగింది. అయినా సరే, గడువులోగా అమెరికా చేరుకోవాలనే తాపత్రయంతో ఇంజినీర్లు అధిక ధరలు కడుతున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరే దృశ్యాలు కనిపించాయి. వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువులు, బరువైన లగేజీలతో క్యూలలో నిలిచిన ప్రయాణికులు, సిబ్బందిని వేడుకున్నవారు. ఇప్పటికే విమానంలో ఎక్కినవారు కొత్త సమాచారం తెలిసి దిగిపోవడం, ట్రాన్సిట్ పాయింట్లలో మార్పులు చేసుకోవడం వంటి ఘటనలతో గందరగోళం మరింత పెరిగింది.

దసరా, దీపావళి పండగలకు స్వస్థలాలకు వచ్చినవారిలో చాలామంది తిరిగి అమెరికాకు వెళ్లేందుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వచ్చినవారు కూడా ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ నిర్ణయం కారణంగా అనూహ్యంగా మారిన పరిస్థితులు ఈ కుటుంబాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

This post was last modified on September 21, 2025 12:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ టీమ్… గ్రౌండ్ రియాలిటీ తాలూకా

మాములుగా ఒక సినిమా రిలీజయ్యాక దాని ఫలితంతో సంబంధం లేకుండా సక్సెస్ మీట్ల పేరుతో బాణా సంచా కాల్చడం, మీడియా…

7 hours ago

అమిత్ షాతో మంత్రి లోకేష్ భేటీ, కారణం ఏంటి?

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్‌.. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో…

7 hours ago

జగన్ ‘అరటి’ విమర్శల్లో నిజమెంత?

ఏపీలో అరటి పండ్ల ధర ఎంత..? ఎందుకీ రాద్దాంతం..? అరటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు…

7 hours ago

‘కోనసీమ పచ్చదనం’.. జనసేన పార్టీ ఫస్ట్ రియాక్షన్

ఉప ముఖ్యమంత్రి మాటలను వక్రీకరించ వద్దంటూ జనసేన ఓ పార్టీ ప్రకటన విడుదల చేసింది. కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్…

7 hours ago

పీఎంవో పేరు-భ‌వ‌నం కూడా మార్పు.. అవేంటంటే!

దేశంలో పురాత‌న, బ్రిటీష్ కాలం నాటి పేర్ల‌ను, ఊర్ల‌ను కూడా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీయే ప్ర‌భుత్వం…

8 hours ago

‘రాజధాని రైతులను ఒప్పించాలి కానీ నొప్పించకూడదు’

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి మ‌హాన‌గ‌రంగా నిర్మించాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఆదిశ‌గా వ‌డి వ‌డిగా అడుగులు వేస్తున్నారు.…

9 hours ago