Trends

అమెరికా వీసా హడావిడి.. టికెట్ ధరలతో బిగ్ షాక్

అమెరికాలో హెచ్‌1బీ వీసా (H1B Visa) రుసుముల పెంపు నిర్ణయం టెక్ ప్రొఫెషనల్స్‌ను గందరగోళంలోకి నెట్టింది. ఈ నెల 21లోగా ఉద్యోగులు అమెరికాలో ఉండాలని టెక్ కంపెనీలు స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో, చివరి నిమిషం వరకు భారత్‌లో ఉన్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు విమానాశ్రయాలపైకి పరుగులు తీశారు. ఈ హడావుడి కారణంగా అమెరికాకు వెళ్లే విమాన టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటాయి.

దిల్లీ నుంచి న్యూయార్క్ నాన్‌స్టాప్ ఫ్లైట్ ఎకానమీ టికెట్ సాధారణంగా రూ.37 వేల వద్ద ఉండగా, ఇప్పుడు అది రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు పెరిగింది. హైదరాబాద్ నుంచి లాస్ ఏంజెలెస్ చేరేందుకు దుబాయ్ మీదుగా వెళ్లే టికెట్ ధర రూ.1.32 లక్షలకు చేరింది. డాలస్ రూట్ కూడా రూ.80 వేల నుంచి రూ.90 వేల మధ్యకు పెరిగింది. అయినా సరే, గడువులోగా అమెరికా చేరుకోవాలనే తాపత్రయంతో ఇంజినీర్లు అధిక ధరలు కడుతున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కుటుంబ సభ్యులతో కలిసి బయలుదేరే దృశ్యాలు కనిపించాయి. వీడ్కోలు చెప్పేందుకు వచ్చిన బంధువులు, బరువైన లగేజీలతో క్యూలలో నిలిచిన ప్రయాణికులు, సిబ్బందిని వేడుకున్నవారు. ఇప్పటికే విమానంలో ఎక్కినవారు కొత్త సమాచారం తెలిసి దిగిపోవడం, ట్రాన్సిట్ పాయింట్లలో మార్పులు చేసుకోవడం వంటి ఘటనలతో గందరగోళం మరింత పెరిగింది.

దసరా, దీపావళి పండగలకు స్వస్థలాలకు వచ్చినవారిలో చాలామంది తిరిగి అమెరికాకు వెళ్లేందుకు తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం వచ్చినవారు కూడా ప్రణాళికలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ట్రంప్ నిర్ణయం కారణంగా అనూహ్యంగా మారిన పరిస్థితులు ఈ కుటుంబాలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.

This post was last modified on September 21, 2025 12:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మీ వాళ్లకు చెప్పండి… ఏపీ సీఎంకి తెలంగాణ మంత్రి లేఖ

తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…

50 minutes ago

మోదీ స్కిన్ టోన్… అక్కడ తెలుపు.. ఇక్కడ నలుపా?

ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్‌పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…

53 minutes ago

టీవీ సౌండ్ హఠాత్తుగా ఆగిపోయిందే

మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…

1 hour ago

ఎన్టీఆర్ నీల్… ఇంకో ఏడాది ఆలస్యంగా

అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…

2 hours ago

కొత్త ‘మహావతారం’పై విమర్శలేల?

గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…

3 hours ago

అన్నీ కారుణ్యాలే అయితే ప్రతిభావంతులు ఏం చెయ్యాలి?

రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…

4 hours ago