Trends

ఐసీసీ నుంచి పాక్‌కు మరో షాక్‌

ఆసియా కప్ 2025లో ఇండియా – పాక్ మ్యాచ్ తర్వాత చోటు చేసుకున్న “నో హ్యాండ్‌షేక్” వివాదం ఊహించని స్థాయికి చేరింది. ఈ అవమానాన్ని తట్టుకోలేని పాక్ క్రికెట్ బోర్డు (PCB) ఇండియన్ జట్టుపైనే కాకుండా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌పై కూడా ఆరోపణలు చేసింది. టాస్ సమయంలో సూర్యకుమార్ యాదవ్‌తో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ చేతులు కలపకూడదని పైక్రాఫ్ట్ ఆదేశించారని పాక్ ఆరోపించింది. అందుకే ఆయన్ని వెంటనే రిఫరీ ప్యానెల్ నుంచి తొలగించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసింది.

అయితే ఈ డిమాండ్‌కు ఐసీసీ తక్షణమే స్పందించి పాక్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. రిఫరీపై ఎలాంటి చర్య తీసుకోలేమని స్పష్టం చేసింది. పైక్రాఫ్ట్‌ను తొలగించే అభ్యర్థనను తిరస్కరించినట్లు ఒక ICC అధికారి మీడియాకు తెలిపాడు. ఈ నిర్ణయం పాక్‌కు మరో అవమానం కావడంతో ఇప్పుడు అక్కడి క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సిన్ నక్వీ, “ఈ రిఫరీ ప్రవర్తన ఆట తీరుకు వ్యతిరేకం. MCC చట్టాలను ఉల్లంఘించాడు” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా, UAEతో జరిగే తమ తదుపరి మ్యాచ్‌ను కూడా బహిష్కరిస్తామని అన్నట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ వివరణ అధికారిక ప్రకటనగా రాలేదని తెలుస్తోంది, పాక్ మీడియా మాత్రమే రిపోర్ట్ చేసిందట.

ప్రస్తుతం పాక్ జట్టు ఆసియా కప్ సూపర్-4కి చేరాలంటే UAEపై తప్పనిసరిగా గెలవాలి. ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచిన పాక్, UAEను ఓడిస్తేనే తదుపరి రౌండ్‌లోకి ప్రవేశిస్తుంది. గెలిస్తే మళ్లీ ఆదివారం ఇండియానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి హ్యాండ్‌షేక్ వివాదం కొనసాగుతున్నా, మైదానంలో పాక్ జట్టుకు గెలుపే ప్రధాన సవాలు. మరోవైపు భారత జట్టు మాత్రం మైదానంలో గెలుపుతో, మైదానం బయట సైలెంట్ కౌంటర్‌లతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ కళ్లన్నీ సెప్టెంబర్ 17న జరిగే పాక్ UAE పోరుపైనే నిలిచాయి. అక్కడి ఫలితమే ఈ ఆసియా కప్‌లో మరో ఇండియా – పాక్ మ్యాచ్ కి ప్రణాలిక సిద్ధం చేయనుంది.

This post was last modified on September 16, 2025 1:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

1 hour ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

1 hour ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

2 hours ago

దురంధర్ హీరోకి విచిత్రమైన పరిస్థితి

బాలీవుడ్ అతి పెద్ద బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రణ్వీర్ సింగ్ విచిత్రమైన పరిస్థితిలో ఉన్నాడు. దురంధర్ 2 తర్వాత…

2 hours ago

తెలుగు రాష్ట్రాలకూ ‘సర్’ వచ్చేస్తున్నారు..

ఇరు తెలుగు రాష్ట్రాలకు 'సర్' వస్తున్నారు.. దేశవ్యాప్తంగా ఓటరు జాబితాలను సమగ్రంగా పరిశీలించేందుకు భారత ఎన్నికల సంఘం ‘స్పెషల్ ఇంటెన్సివ్…

3 hours ago

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

4 hours ago