Trends

పహల్గాం ఉగ్రదాడి… ఇండియన్ కెప్టెన్ క్లీన్ మెసేజ్

ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. దుబాయ్ వేదికగా ఆడిన మ్యాచ్‌లో అద్భుత విజయానంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. ఈ సారి సూర్య తన గెలుపు సంతోషాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేయడం విశేషంగా మారింది.

మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, “ఇది మా కోసం మరో గేమ్ మాత్రమే. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాల పక్కన నిలబడ్డామని చెప్పాలనుకుంటున్నాను. మా ఆర్మీ బలగాలు చూపిన ధైర్యసాహసాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. మైదానంలో మా గెలుపుతో, వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఆశిస్తున్నాం” అని చెప్పి అందరినీ కదిలించాడు.

చివరి వరకు నిలబడి జట్టును గెలిపించడం తనకు ప్రత్యేక అనుభూతి అని తెలిపారు. ప్రతి మ్యాచ్‌ కోసం ఒకే విధమైన సన్నద్ధతతో ముందుకెళ్లడమే తమ తత్వమని చెప్పారు. స్పిన్నర్లు మధ్య ఓవర్లలో మ్యాచ్‌ను కట్టిపడేయడం ఎప్పటినుంచో తనకు ఇష్టమని తెలిపారు. భారత్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్నా, సూర్య మాటల్లో ఒక గంభీరత స్పష్టంగా కనిపించింది. 

దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తు చేస్తూ, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. క్రీడ ద్వారా దేశానికి గౌరవం తీసుకురావడమే కాకుండా, సైన్యం ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్న సంకేతాన్ని ఇచ్చారు. మొత్తంగా చూస్తే, ఈ మ్యాచ్ విజయం కేవలం ఒక విజయమే కాదు. అది ఒక భావోద్వేగ అంకితం కూడా అని టీమిండియా క్లియర్ మెసేజ్ ఇచ్చింది.

Kumar

Recent Posts

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 minutes ago

నాగ‌వంశీ చెప్పింది నిజమే

లెనిన్ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాత‌ల్లో ఒక‌రైన నాగ‌వంశీ. లెనిన్…

6 hours ago

పిల్లలు వద్దనుకుంటే సంపదను వదులుకున్నట్టే: చంద్రబాబు

పిల్లలు సంప‌ద అని సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. తాను చెప్పిన మాటకే క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీనిని…

6 hours ago

విషాదం మిగిల్చిన విహారం… తెలుగువారు మృతి

వియ‌త్నాంలో విహార యాత్ర‌కు వెళ్లిన భార‌తీయుల కుటుంబాల్లో విషాదం నెల‌కొంది. ఊహించ‌ని ప్ర‌మాదంలో చిక్కుకుని 15 మంది భార‌తీయులు మృతి…

6 hours ago

ఎడిట‌ర్‌ను సైకో అన్న నిర్మాత‌

త‌న సినిమాకు ప‌ని చేసిన టెక్నీషియ‌న్‌ను ఒక నిర్మాత సైకోగా అభివ‌ర్ణించ‌డం ఎప్పుడైనా చూశారా? సితార ఎంట‌ర్టైన్మెంట్స్ అధినేత నాగ‌వంశీ…

6 hours ago

టికెట్ రేట్ల విషయంలో ‘లెనిన్’ ఆదర్శం

శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…

8 hours ago