ఆసియా కప్లో పాకిస్థాన్పై ఘన విజయాన్ని అందుకున్న టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన మాటలతో అభిమానులను కట్టిపడేశాడు. దుబాయ్ వేదికగా ఆడిన మ్యాచ్లో అద్భుత విజయానంతరం ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం క్రికెట్కే పరిమితం కాలేదు. ఈ సారి సూర్య తన గెలుపు సంతోషాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అంకితం చేయడం విశేషంగా మారింది.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన సూర్య, “ఇది మా కోసం మరో గేమ్ మాత్రమే. కానీ ఈ ప్రత్యేక సందర్భంలో పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాల పక్కన నిలబడ్డామని చెప్పాలనుకుంటున్నాను. మా ఆర్మీ బలగాలు చూపిన ధైర్యసాహసాలకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. మైదానంలో మా గెలుపుతో, వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఆశిస్తున్నాం” అని చెప్పి అందరినీ కదిలించాడు.
చివరి వరకు నిలబడి జట్టును గెలిపించడం తనకు ప్రత్యేక అనుభూతి అని తెలిపారు. ప్రతి మ్యాచ్ కోసం ఒకే విధమైన సన్నద్ధతతో ముందుకెళ్లడమే తమ తత్వమని చెప్పారు. స్పిన్నర్లు మధ్య ఓవర్లలో మ్యాచ్ను కట్టిపడేయడం ఎప్పటినుంచో తనకు ఇష్టమని తెలిపారు. భారత్ గెలుపుతో ఉత్సాహంగా ఉన్నా, సూర్య మాటల్లో ఒక గంభీరత స్పష్టంగా కనిపించింది.
దేశం ఎదుర్కొంటున్న పరిస్థితులను గుర్తు చేస్తూ, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చేలా వ్యాఖ్యలు చేశారు. క్రీడ ద్వారా దేశానికి గౌరవం తీసుకురావడమే కాకుండా, సైన్యం ధైర్యాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్తామన్న సంకేతాన్ని ఇచ్చారు. మొత్తంగా చూస్తే, ఈ మ్యాచ్ విజయం కేవలం ఒక విజయమే కాదు. అది ఒక భావోద్వేగ అంకితం కూడా అని టీమిండియా క్లియర్ మెసేజ్ ఇచ్చింది.
This post was last modified on September 15, 2025 11:23 am
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…
టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…
మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…
అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…