భారత క్రికెట్లో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ స్థానాలు ఎప్పుడూ పెద్ద చర్చలకే దారి తీస్తాయి. తాజాగా ఆసియా కప్ 2025 జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించడం, సంజు శాంసన్ భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ నియామకం జరగడంతో, వికెట్కీపర్గా కీలక పాత్ర పోషించే సంజు స్థానం ఎంతవరకు భద్రంగా ఉంటుందనే చర్చ మొదలైంది.
శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. తొలి సిరీస్లోనే అతను టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు టీ20ల్లో కూడా బాధ్యతలు ఇవ్వడం, బీసీసీఐ భవిష్యత్తు నాయకత్వాన్ని అతడి చుట్టూ నిర్మిస్తోంది అనే సంకేతాలు ఇస్తోంది. క్రికెట్ వర్గాల అంచనా ప్రకారం, రాబోయే వన్డే ప్రపంచకప్ 2027తో పాటు 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు గిల్ను ప్రధాన కెప్టెన్సీ రేసులో ఉంచుతారు. ఇది సహజంగానే సంజు వంటి సీనియర్ ఆటగాడికి ఒత్తిడిని తెస్తుంది.
తుది గమ్యం మాత్రం ఒకటే. సంజు రాబోయే మ్యాచ్ల్లో దూకుడుగా ఆడాలి. అవకాశాన్ని రెండు చేతులా పట్టుకోవాలి. పంత్తో పోటీలోనూ, గిల్ వంటి యువ నాయకుడి ఎదుగుదలలోనూ తన విలువను నిరూపించగలిగితేనే సంజు పేరు టీ20 ప్రపంచకప్ ఫైనల్ జట్టులో నిలుస్తుంది. లేకపోతే, ఈ అవకాశాన్ని కోల్పోతే అతడి భవిష్యత్తు మరోసారి అనిశ్చితంగా మారడం ఖాయం.
This post was last modified on August 20, 2025 4:36 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…