భారత క్రికెట్లో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ స్థానాలు ఎప్పుడూ పెద్ద చర్చలకే దారి తీస్తాయి. తాజాగా ఆసియా కప్ 2025 జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించడం, సంజు శాంసన్ భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ నియామకం జరగడంతో, వికెట్కీపర్గా కీలక పాత్ర పోషించే సంజు స్థానం ఎంతవరకు భద్రంగా ఉంటుందనే చర్చ మొదలైంది.
శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. తొలి సిరీస్లోనే అతను టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు టీ20ల్లో కూడా బాధ్యతలు ఇవ్వడం, బీసీసీఐ భవిష్యత్తు నాయకత్వాన్ని అతడి చుట్టూ నిర్మిస్తోంది అనే సంకేతాలు ఇస్తోంది. క్రికెట్ వర్గాల అంచనా ప్రకారం, రాబోయే వన్డే ప్రపంచకప్ 2027తో పాటు 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు గిల్ను ప్రధాన కెప్టెన్సీ రేసులో ఉంచుతారు. ఇది సహజంగానే సంజు వంటి సీనియర్ ఆటగాడికి ఒత్తిడిని తెస్తుంది.
తుది గమ్యం మాత్రం ఒకటే. సంజు రాబోయే మ్యాచ్ల్లో దూకుడుగా ఆడాలి. అవకాశాన్ని రెండు చేతులా పట్టుకోవాలి. పంత్తో పోటీలోనూ, గిల్ వంటి యువ నాయకుడి ఎదుగుదలలోనూ తన విలువను నిరూపించగలిగితేనే సంజు పేరు టీ20 ప్రపంచకప్ ఫైనల్ జట్టులో నిలుస్తుంది. లేకపోతే, ఈ అవకాశాన్ని కోల్పోతే అతడి భవిష్యత్తు మరోసారి అనిశ్చితంగా మారడం ఖాయం.
This post was last modified on August 20, 2025 4:36 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…