భారత క్రికెట్లో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ స్థానాలు ఎప్పుడూ పెద్ద చర్చలకే దారి తీస్తాయి. తాజాగా ఆసియా కప్ 2025 జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించడం, సంజు శాంసన్ భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ నియామకం జరగడంతో, వికెట్కీపర్గా కీలక పాత్ర పోషించే సంజు స్థానం ఎంతవరకు భద్రంగా ఉంటుందనే చర్చ మొదలైంది.
శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. తొలి సిరీస్లోనే అతను టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు టీ20ల్లో కూడా బాధ్యతలు ఇవ్వడం, బీసీసీఐ భవిష్యత్తు నాయకత్వాన్ని అతడి చుట్టూ నిర్మిస్తోంది అనే సంకేతాలు ఇస్తోంది. క్రికెట్ వర్గాల అంచనా ప్రకారం, రాబోయే వన్డే ప్రపంచకప్ 2027తో పాటు 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు గిల్ను ప్రధాన కెప్టెన్సీ రేసులో ఉంచుతారు. ఇది సహజంగానే సంజు వంటి సీనియర్ ఆటగాడికి ఒత్తిడిని తెస్తుంది.
తుది గమ్యం మాత్రం ఒకటే. సంజు రాబోయే మ్యాచ్ల్లో దూకుడుగా ఆడాలి. అవకాశాన్ని రెండు చేతులా పట్టుకోవాలి. పంత్తో పోటీలోనూ, గిల్ వంటి యువ నాయకుడి ఎదుగుదలలోనూ తన విలువను నిరూపించగలిగితేనే సంజు పేరు టీ20 ప్రపంచకప్ ఫైనల్ జట్టులో నిలుస్తుంది. లేకపోతే, ఈ అవకాశాన్ని కోల్పోతే అతడి భవిష్యత్తు మరోసారి అనిశ్చితంగా మారడం ఖాయం.
This post was last modified on August 20, 2025 4:36 pm
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…