భారత క్రికెట్లో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ స్థానాలు ఎప్పుడూ పెద్ద చర్చలకే దారి తీస్తాయి. తాజాగా ఆసియా కప్ 2025 జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించడం, సంజు శాంసన్ భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ నియామకం జరగడంతో, వికెట్కీపర్గా కీలక పాత్ర పోషించే సంజు స్థానం ఎంతవరకు భద్రంగా ఉంటుందనే చర్చ మొదలైంది.
శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. తొలి సిరీస్లోనే అతను టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. ఇప్పుడు టీ20ల్లో కూడా బాధ్యతలు ఇవ్వడం, బీసీసీఐ భవిష్యత్తు నాయకత్వాన్ని అతడి చుట్టూ నిర్మిస్తోంది అనే సంకేతాలు ఇస్తోంది. క్రికెట్ వర్గాల అంచనా ప్రకారం, రాబోయే వన్డే ప్రపంచకప్ 2027తో పాటు 2028 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్ వరకు గిల్ను ప్రధాన కెప్టెన్సీ రేసులో ఉంచుతారు. ఇది సహజంగానే సంజు వంటి సీనియర్ ఆటగాడికి ఒత్తిడిని తెస్తుంది.
తుది గమ్యం మాత్రం ఒకటే. సంజు రాబోయే మ్యాచ్ల్లో దూకుడుగా ఆడాలి. అవకాశాన్ని రెండు చేతులా పట్టుకోవాలి. పంత్తో పోటీలోనూ, గిల్ వంటి యువ నాయకుడి ఎదుగుదలలోనూ తన విలువను నిరూపించగలిగితేనే సంజు పేరు టీ20 ప్రపంచకప్ ఫైనల్ జట్టులో నిలుస్తుంది. లేకపోతే, ఈ అవకాశాన్ని కోల్పోతే అతడి భవిష్యత్తు మరోసారి అనిశ్చితంగా మారడం ఖాయం.
This post was last modified on August 20, 2025 4:36 pm
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ విజయం తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనదైన స్టైల్లో స్పందించారు. 2027 వరల్డ్…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
తాను చేసింది మహా పాపమే అంటూ.. పరకామణి చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు రవికుమార్ తెలిపారు. ఈ వ్యవహారంలో…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…