బిగ్ బాస్ షో చూపిస్తూ సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు గుంటూరు వైద్యులు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రియాల్టీ షో చూపిస్తూ.. అతడిని మాట్లాడిస్తూ సర్జరీని పూర్తి చేశారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన 33 ఏళ్ల ప్రసాద్ కు బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2016లో హైదరాబాద్ లో సర్జరీ చేసి కణితిని తొలగించారు. ఆ తర్వాత పలుమార్లు రేడియేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తరచూ ఫిట్స్ రావటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడ్ని గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఈ సందర్భంగా చేసిన టెస్టుల్లో మెదడులో మళ్లీ కణితి పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో మరోసారి సర్జరీ చేసేందుక సిద్ధమయ్యారు. త్రీడీ మ్యాప్ తో కణితి ఎక్కడ ఉందో గుర్తించి.. సరిగ్గా అక్కడే బ్రెయిన్ ఓపెన్ చేశారు.
ఈ సర్జరీలో సంక్లిష్టత ఏమిటంటే.. ఆపరేషన్ చేసే సమయంలో రోగిని స్పృహలో ఉంచే సర్జరీ చేయాలి. ఎందుకంటే.. మెదడులోని సంభాషణలకు సంబంధించిన ప్రాంతంలో సర్జరీ జరుగుతుండటంతో.. అతడికి బిగ్ బాస్ షోతో పాటు.. అవతార్ సినిమా చూపిస్తూ.. తరచూ మాట్లాడిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ సర్జరీ సక్సెస్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. తాజాగా ఇతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రోగి ఆసక్తి మేరకు బిగ్ బాస్ షో చూపించినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on November 21, 2020 10:59 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…