బిగ్ బాస్ షో చూపిస్తూ సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు గుంటూరు వైద్యులు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రియాల్టీ షో చూపిస్తూ.. అతడిని మాట్లాడిస్తూ సర్జరీని పూర్తి చేశారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన 33 ఏళ్ల ప్రసాద్ కు బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2016లో హైదరాబాద్ లో సర్జరీ చేసి కణితిని తొలగించారు. ఆ తర్వాత పలుమార్లు రేడియేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తరచూ ఫిట్స్ రావటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడ్ని గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఈ సందర్భంగా చేసిన టెస్టుల్లో మెదడులో మళ్లీ కణితి పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో మరోసారి సర్జరీ చేసేందుక సిద్ధమయ్యారు. త్రీడీ మ్యాప్ తో కణితి ఎక్కడ ఉందో గుర్తించి.. సరిగ్గా అక్కడే బ్రెయిన్ ఓపెన్ చేశారు.
ఈ సర్జరీలో సంక్లిష్టత ఏమిటంటే.. ఆపరేషన్ చేసే సమయంలో రోగిని స్పృహలో ఉంచే సర్జరీ చేయాలి. ఎందుకంటే.. మెదడులోని సంభాషణలకు సంబంధించిన ప్రాంతంలో సర్జరీ జరుగుతుండటంతో.. అతడికి బిగ్ బాస్ షోతో పాటు.. అవతార్ సినిమా చూపిస్తూ.. తరచూ మాట్లాడిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ సర్జరీ సక్సెస్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. తాజాగా ఇతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రోగి ఆసక్తి మేరకు బిగ్ బాస్ షో చూపించినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on November 21, 2020 10:59 am
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…