బిగ్ బాస్ షో చూపిస్తూ సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు గుంటూరు వైద్యులు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రియాల్టీ షో చూపిస్తూ.. అతడిని మాట్లాడిస్తూ సర్జరీని పూర్తి చేశారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన 33 ఏళ్ల ప్రసాద్ కు బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2016లో హైదరాబాద్ లో సర్జరీ చేసి కణితిని తొలగించారు. ఆ తర్వాత పలుమార్లు రేడియేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తరచూ ఫిట్స్ రావటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడ్ని గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఈ సందర్భంగా చేసిన టెస్టుల్లో మెదడులో మళ్లీ కణితి పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో మరోసారి సర్జరీ చేసేందుక సిద్ధమయ్యారు. త్రీడీ మ్యాప్ తో కణితి ఎక్కడ ఉందో గుర్తించి.. సరిగ్గా అక్కడే బ్రెయిన్ ఓపెన్ చేశారు.
ఈ సర్జరీలో సంక్లిష్టత ఏమిటంటే.. ఆపరేషన్ చేసే సమయంలో రోగిని స్పృహలో ఉంచే సర్జరీ చేయాలి. ఎందుకంటే.. మెదడులోని సంభాషణలకు సంబంధించిన ప్రాంతంలో సర్జరీ జరుగుతుండటంతో.. అతడికి బిగ్ బాస్ షోతో పాటు.. అవతార్ సినిమా చూపిస్తూ.. తరచూ మాట్లాడిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ సర్జరీ సక్సెస్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. తాజాగా ఇతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రోగి ఆసక్తి మేరకు బిగ్ బాస్ షో చూపించినట్లుగా తెలుస్తోంది.
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…
కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ప్రాంగణంలోనే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…