బిగ్ బాస్ షో చూపిస్తూ సంక్లిష్టమైన బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు గుంటూరు వైద్యులు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ రియాల్టీ షో చూపిస్తూ.. అతడిని మాట్లాడిస్తూ సర్జరీని పూర్తి చేశారు. ఎందుకిలా? అంటే.. దానికి కారణం లేకపోలేదు.
గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలానికి చెందిన 33 ఏళ్ల ప్రసాద్ కు బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 2016లో హైదరాబాద్ లో సర్జరీ చేసి కణితిని తొలగించారు. ఆ తర్వాత పలుమార్లు రేడియేషన్ ఇచ్చారు. అయినప్పటికీ కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తరచూ ఫిట్స్ రావటంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అతడ్ని గుంటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. ఈ సందర్భంగా చేసిన టెస్టుల్లో మెదడులో మళ్లీ కణితి పెరిగినట్లుగా గుర్తించారు. దీంతో మరోసారి సర్జరీ చేసేందుక సిద్ధమయ్యారు. త్రీడీ మ్యాప్ తో కణితి ఎక్కడ ఉందో గుర్తించి.. సరిగ్గా అక్కడే బ్రెయిన్ ఓపెన్ చేశారు.
ఈ సర్జరీలో సంక్లిష్టత ఏమిటంటే.. ఆపరేషన్ చేసే సమయంలో రోగిని స్పృహలో ఉంచే సర్జరీ చేయాలి. ఎందుకంటే.. మెదడులోని సంభాషణలకు సంబంధించిన ప్రాంతంలో సర్జరీ జరుగుతుండటంతో.. అతడికి బిగ్ బాస్ షోతో పాటు.. అవతార్ సినిమా చూపిస్తూ.. తరచూ మాట్లాడిస్తూ ఆపరేషన్ పూర్తి చేశారు. ఈ సర్జరీ సక్సెస్ అయినట్లుగా వైద్యులు వెల్లడించారు. తాజాగా ఇతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. రోగి ఆసక్తి మేరకు బిగ్ బాస్ షో చూపించినట్లుగా తెలుస్తోంది.
This post was last modified on November 21, 2020 10:59 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…