Trends

జీఎస్టీ ఎఫెక్ట్‌: క‌ర్ణాట‌క‌లో కాఫీ, టీలు బంద్‌!

దేశంలో అత్య‌ధికంగా కాఫీ, టీలు విక్ర‌యించే, వినియోగించే వారి జాబితాలో క‌ర్ణాట‌క తొలిస్థానంలో ఉంది. ఇది జాతీయ గ‌ణాంకాలు చెబుతున్న లెక్క‌. రెండోస్థానంలో రాజ‌స్థాన్ ఉండ‌గా.. మూడో స్థానంలో పంజాబ్‌, నాలుగులో ఏపీ ఉన్నాయి. అయితే.. తాజాగా క‌ర్ణాట‌క‌లోని అన్ని ప్ర‌ముఖ టీ, కాఫీ విక్ర‌యాలు జ‌రిపే.. హోట‌ళ్లు, క్యాంటీన్లు.. వాటి విక్ర‌యాల‌ను నిలిపివేశాయి. ఈ మేర‌కు బోర్డులు కూడా పెట్టాయి. ఇక‌, ఆయా హోట‌ళ్లు, కేఫ్‌ల‌లో బ్లాక్ టీ మాత్రమే విక్ర‌యిస్తున్నారు. అది కూడా నిర‌స‌న‌గా మాత్రమేన‌ని కొంద‌రు వ్యాపారులు తెలిపారు. దీనికి తోడు.. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి న‌గ‌దు లావాదేవీల‌ను కూడా ఆయా హోట‌ళ్లు నిలిపివేశాయి.

దీనికి కార‌ణం.. కాఫీ, టీ విక్ర‌యాల‌పై కేంద్రం జీఎస్టీ బాదేస్తోంది. గ‌త ఏడాది 12 శాతం ఉన్న జీఎస్టీ వ‌సూళ్ల‌ను ఈ ఏడాది 18 శాతానికి పెంచారు. ఇది విక్ర‌యదారుల‌కు, హోట‌ళ్ల య‌జ‌మానుల‌కు తీవ్ర సంక‌టంగా మారింది. మ‌రోవైపు.. న‌గ‌దు లావాదేవీ ల‌కు సంబంధించి ఆదాయ ప‌న్ను అధికారులు, జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు రావ‌డాన్ని విక్ర‌య‌దారులు తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. జీఎస్టీ అధికారులు తమను లక్ష్యంగా చేసుకొని నోటీసులు పంపిస్తున్నాని.. పేర్కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే విక్ర‌యాలు నిలిపివేస్తున్నామ‌ని వ్యాపారులు తెలిపారు.

అధికారుల వాద‌న ఇదీ..

జీఎస్టీ అధికారులు ఈ వివాదంపై స్పందించారు. 2021 నుంచి 2024 ఆర్థిక సంవత్సరాల మధ్య జరిగిన డిజిటల్ లావాదేవీల ఆధారంగానే నోటీసులు ఇస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం జీఎస్టీకి సంబంధించిన వివాదం కాద‌న్నారు. ఆన్‌లైన్ చెల్లింపులు రూ.20 లక్షలు, రూ.40 లక్షలు దాటిన వ్యాపారులకు మాత్ర‌మే నోటీసులు ఇస్తున్నామ‌న్నారు. చాలా మంది జీఎస్టీ ఎగ‌వేస్తున్నార‌ని వారు చెప్పారు. గ‌త నాలుగేళ్లలో కోట్ల‌ రూపాయ‌ల మేర‌కు టీ, కాఫీ విక్ర‌యాల‌పై లావాదేవీలు జ‌రిగాయ‌ని… కానీ.. జీఎస్టీ చెల్లింపులు రాలేద‌ని వారు చెబుతున్నారు. ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్లే స్వేచ్ఛ వ్యాపారుల‌కు ఉంద‌ని పేర్కొన్నారు.

రంగంలోకి సీఎం..

ఈ వివాదం ముదురుతున్న నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య నేరుగా రంగంలోకి దిగారు. కేంద్రంపై జీఎస్టీ విష‌యంలో పోరాడుతున్న నేప‌థ్యంలో ఆయ‌నే నేరుగా జోక్యం చేసుకోవ‌డం.. హుటాహుటిన స్పందించ‌డం గ‌మ‌నార్హం. వ్యాపార వ‌ర్గాల‌తో ఆయ‌న భేటీ అయ్యారు. వారికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. అయితే.. జీఎస్టీ వ‌సూళ్ల విష‌యంలో వాస్త‌వాలు తెలుసుకునేందుకు ఆర్థిక నిపుణుల‌తో ఒక క‌మిటీ నియ‌మించ‌నున్న‌ట్టు చెప్పారు. వ్యాపారాలు స‌జావుగా సాగాల‌ని.. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నామ‌ని ఆయ‌న వివ‌రించారు.

This post was last modified on July 23, 2025 8:55 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

58 minutes ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

1 hour ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

1 hour ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

2 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

2 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

3 hours ago