Trends

సిగాచీ విషాదం.. ఇది అన్నింటికంటే ఘోరం

హైదరాబాద్ శివార్లలోని పాశమైలారం ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతి అయ్యారు. అందులో ఇప్పటిదాకా 44 మృతదేహాలను అధికారులు గుర్తించారు.

ఆ మృతదేహాలు ఏవీ కూడా ఒక ఆకారంతో ఉన్నవి, గుర్తు పట్టేవి కావు. ఎముకలు కూడా బూడిదైపోయి.. చిన్న చిన్న ఆనవాళ్లు దొరికితే వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కడసారి చూసుకోవడానికి ఒక రూపం కూడా లేకపోవడం వారి కుటుంబ సభ్యులకు ఎంత వేదన కలిగిస్తుందో చెప్పాల్సిన పని లేదు.

ఇదే ఘోరం అంటే.. ఇంకొందరి విషయంలో ఆ మాత్రం ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. చిన్న చిన్న ఎముక ముక్కలు సైతం దొరక్కుండా చనిపోయిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నట్లు తేలింది. ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారం రోజులుగా తమ వారి ఆచూకీ కోసం పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నారు. అధికారులను కలుస్తున్నారు. కానీ వారి ఆనవాళ్లను గుర్తించే అవకకాశమే లేకపోయింది. వారానికి పైగా అన్ని అవశేషాలనూ సేకరించి పరీక్షలు జరిపినా.. కుటుంబ సభ్యుల డీఎన్ఏలతో మ్యాచ్ అయ్యేవి ఏవీ దొరకలేదు.

రాహుల్, శివాజీ, వెంకటేష్, వి.జయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ అనే ఆ ఎనిమిది మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్లే అని నిర్ధరించిన అధికారులు.. వారి అవశేషాలను గుర్తించడానికి మరింత సమయం కావాలని.. మూడు నెలల తర్వాత రావాలని వారి కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. వీరు చనిపోయినట్లు భావించి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలని చెప్పేశారు. కడసారి చూపుకి నోచుకోకపోవడమే బాధ అంటే.. మృతదేహానికి సంబంధించిన చిన్న అవశేషం లేకుండా ఇప్పుడు అంత్యక్రియలు జరుపుకోవాల్సి రావడం అంటే అంతకంటే విషాదం మరొకటి ఉండదు. వారి బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.

This post was last modified on July 9, 2025 10:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

3 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

10 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago