హైదరాబాద్ శివార్లలోని పాశమైలారం ప్రాంతంలోని సిగాచీ పరిశ్రమలో ఇటీవల చోటు చేసుకున్న ప్రమాదం ఎంతటి విషాదాన్ని నింపిందో తెలిసిందే. ఈ ఘటనలో పదుల సంఖ్యలో అగ్నికి ఆహుతి అయ్యారు. అందులో ఇప్పటిదాకా 44 మృతదేహాలను అధికారులు గుర్తించారు.
ఆ మృతదేహాలు ఏవీ కూడా ఒక ఆకారంతో ఉన్నవి, గుర్తు పట్టేవి కావు. ఎముకలు కూడా బూడిదైపోయి.. చిన్న చిన్న ఆనవాళ్లు దొరికితే వాటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కడసారి చూసుకోవడానికి ఒక రూపం కూడా లేకపోవడం వారి కుటుంబ సభ్యులకు ఎంత వేదన కలిగిస్తుందో చెప్పాల్సిన పని లేదు.
ఇదే ఘోరం అంటే.. ఇంకొందరి విషయంలో ఆ మాత్రం ఆనవాళ్లు కూడా దొరకని పరిస్థితి. చిన్న చిన్న ఎముక ముక్కలు సైతం దొరక్కుండా చనిపోయిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నట్లు తేలింది. ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారం రోజులుగా తమ వారి ఆచూకీ కోసం పరిశ్రమ చుట్టూ తిరుగుతున్నారు. అధికారులను కలుస్తున్నారు. కానీ వారి ఆనవాళ్లను గుర్తించే అవకకాశమే లేకపోయింది. వారానికి పైగా అన్ని అవశేషాలనూ సేకరించి పరీక్షలు జరిపినా.. కుటుంబ సభ్యుల డీఎన్ఏలతో మ్యాచ్ అయ్యేవి ఏవీ దొరకలేదు.
రాహుల్, శివాజీ, వెంకటేష్, వి.జయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్ అనే ఆ ఎనిమిది మంది ఈ ప్రమాదంలో చనిపోయినట్లే అని నిర్ధరించిన అధికారులు.. వారి అవశేషాలను గుర్తించడానికి మరింత సమయం కావాలని.. మూడు నెలల తర్వాత రావాలని వారి కుటుంబ సభ్యులకు స్పష్టం చేశారు. వీరు చనిపోయినట్లు భావించి అంత్యక్రియలు పూర్తి చేసుకోవాలని చెప్పేశారు. కడసారి చూపుకి నోచుకోకపోవడమే బాధ అంటే.. మృతదేహానికి సంబంధించిన చిన్న అవశేషం లేకుండా ఇప్పుడు అంత్యక్రియలు జరుపుకోవాల్సి రావడం అంటే అంతకంటే విషాదం మరొకటి ఉండదు. వారి బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.
This post was last modified on July 9, 2025 10:48 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…