అందరు అనుమానిస్తున్నట్లుగానే అగ్రరాజ్యం అమెరికాలో అధికార మార్పిడి అంత ఈజీ కాదని అర్ధమైపోతోంది. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ఆదివారం భారీ ఎత్తున ట్రంప్ మద్దతుదారుల ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఏకంగా అధ్యక్ష భవనం వైట్ హౌన్ ముందే ట్రంప్ మద్దతుదారులు నిరసన ప్రదర్శనలకు దిగారు. ట్రంప్ మద్దతుదారలను వ్యతిరేకిస్తు బైడెన్ మద్దతుదారులు కూడా పోటీ ఆందోళనలు మొదలుపెట్టడంతో ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది.
ఇద్దరు మద్దతుదారులు ఒకేచోట చేరి ఆందోళనలతో హోరెత్తించటంతో వైట్ హౌస్ చుట్టుపక్కలంతా ఒక్కసారిగా టెన్షన్ పెరిగిపోయింది. తమ చేతుల్లోని కర్రలతో ఇద్దరి మద్దతుదారులు కొట్టేసుకున్నారు. వీళ్ళని అదుపు చేయటం కోసం చివరకు పోలీసులు కూడా ఇద్దరి వీపులు మోత మోగించాల్సొచ్చింది. అయినా మద్దతుదారులు వెనక్కు తగ్గకపోవటమే విచిత్రంగా ఉంది. ఓ సందర్భంగా మద్దతుదారుల్లో కొందరు పోలీసులపై తిరగబడ్డారు. ఈ గొడవల్లో 4 మద్దతుదారులకు ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తనపపై జో బైడెన్ గెలిచిన దగ్గర నుండి డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనంతో ఊగిపోతున్న విషయం యావత్ ప్రపంచం చూస్తున్నదే. పైగా తాను ఎన్నికల్లో ఓడిపోతే బైడెన్ కు అధ్యక్ష పగ్గాలు అప్పగించేది కూడా లేదని ఎన్నికలకు మందు ట్రంప్ బహిరంగంగా ప్రకటించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు చెప్పినట్లుగానే ఓడిపోయిన తర్వాత కోర్టులో కేసులు వేయించారు. అమెరికా అంతటా భారీ నిరసనలు చేయిస్తున్నారు.
అధికార మార్పిడి విషయంలో అతిగొప్ప ప్రాజస్వామ్య దేశంగా ప్రచారం చేసుకునే అమెరికాలోనే ఇటువంటి గొడవలు జరగటం, ఎన్నికల ప్రక్రియ అస్తవ్యస్ధంగా ఉండటంతో ప్రపంచం ముందు నవ్వుల పాలవుతోంది. వ్యక్తుల కన్నా వ్యవస్ధలే అమెరికాలో చాలా గొప్పవని యావత్ ప్రపంచం ఇంతవరకు అనుకునేది. ఇలాంటి దేశంలోనే ఎన్నికల సమయంలో కానీ ఆ తర్వాత కానీ ఇటువంటి అనూహ్య ఘటనలు జరగటంతో యావత్ ప్రపంచం విస్తుపోతోంది. ప్రస్తుతం వాషింగ్టన్ కు మాత్రమే పరిమితమైన ఆందోళనలు ముందు ముందు మరిన్ని రాష్ట్రాలకు పాకే ప్రమాదం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ముందు ముందు ఇంకెన్ని గొడవలు జరుగుతాయో చూడాల్సిందే.
This post was last modified on November 16, 2020 3:59 pm
యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు…
మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…
అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…