Trends

దిగ్గజాల కంటే మెండుగా గిల్ ఘనత

ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో తడబడినా రెండో టెస్టులో టీమిండియా పవర్ఫుల్ విజయాన్ని నమోదు చేసింది. 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘనంగా విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టెస్టు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ మైదానంలో ఆడిన విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ లాంటి దిగ్గజులు గెలుపు నమోదు చేయలేకపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌ పూర్తిగా గిల్ ఆధిపత్యంతో సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇందులో గిల్ 278 బంతుల్లో 269 పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేసి మ్యాచ్‌ను తన నియంత్రణలో ఉంచాడు. అతనికి తోడుగా రిషభ్ పంత్ 91, కేఎల్ రాహుల్ 72 పరుగులు చేసి భారత్‌ను ముందుకు నడిపించారు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిరాజ్ 6/92తో చెలరేగగా, ఆకాశ్ దీప్ 4/69తో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 427/5 వద్ద డిక్లేర్ చేసింది. ఇందులో గిల్ మరోసారి అలరించాడు. 161 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తీసుకెళ్లాడు. పంత్ 64, జడేజా 51 పరుగులతో సహకరించారు.

ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నిలవగా, ఆతిథ్య జట్టు కేవలం 271 పరుగులకే కుప్పకూలింది. ఆకాశ్ దీప్ మరోసారి ఆకాశాన్నంటాడు. 6/66తో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కుప్పకూలేలా చేశాడు. దీంతో అతడు మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఇది అతడి టెస్టు కెరీర్‌లోనే తొలిసారి. ఈ విజయంతో అతను ఆటగాడిగా మాత్రమే కాకుండా భారత్‌కు నూతన బౌలింగ్ నాయ‌కుడిగా నిలిచాడు.

గిల్ సారథ్యంలో భారత జట్టు పూర్తి సమన్వయంతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా అతడు చేసిన స్ట్రాటజీలు, సమయస్పూర్తితో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్‌పై ప్రభావం చూపించాయి. సీనియర్ కెప్టెన్లు సాధించలేని రికార్డును కేవలం రెండో టెస్టుతోనే గిల్ సాధించటం అతడి భవిష్యత్ కెప్టెన్సీకి మైలురాయిగా నిలవనుంది. టీమిండియా మిగతా మూడు టెస్టులను కూడా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

This post was last modified on July 7, 2025 11:55 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

1 hour ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

7 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

7 hours ago