Trends

దిగ్గజాల కంటే మెండుగా గిల్ ఘనత

ఇంగ్లండ్‌తో మొదటి టెస్టులో తడబడినా రెండో టెస్టులో టీమిండియా పవర్ఫుల్ విజయాన్ని నమోదు చేసింది. 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘనంగా విజయం సాధించి ఐదు టెస్టుల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ముఖ్యంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా టెస్టు గెలిచిన తొలి ఆసియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ మైదానంలో ఆడిన విరాట్ కోహ్లీ, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ లాంటి దిగ్గజులు గెలుపు నమోదు చేయలేకపోయిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌ పూర్తిగా గిల్ ఆధిపత్యంతో సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇందులో గిల్ 278 బంతుల్లో 269 పరుగులతో డబుల్ సెంచరీ నమోదు చేసి మ్యాచ్‌ను తన నియంత్రణలో ఉంచాడు. అతనికి తోడుగా రిషభ్ పంత్ 91, కేఎల్ రాహుల్ 72 పరుగులు చేసి భారత్‌ను ముందుకు నడిపించారు.

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సిరాజ్ 6/92తో చెలరేగగా, ఆకాశ్ దీప్ 4/69తో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 427/5 వద్ద డిక్లేర్ చేసింది. ఇందులో గిల్ మరోసారి అలరించాడు. 161 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోకి తీసుకెళ్లాడు. పంత్ 64, జడేజా 51 పరుగులతో సహకరించారు.

ఇంగ్లండ్ ముందు 608 పరుగుల భారీ లక్ష్యం నిలవగా, ఆతిథ్య జట్టు కేవలం 271 పరుగులకే కుప్పకూలింది. ఆకాశ్ దీప్ మరోసారి ఆకాశాన్నంటాడు. 6/66తో ఇంగ్లండ్ బ్యాటింగ్‌ను కుప్పకూలేలా చేశాడు. దీంతో అతడు మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టాడు. ఇది అతడి టెస్టు కెరీర్‌లోనే తొలిసారి. ఈ విజయంతో అతను ఆటగాడిగా మాత్రమే కాకుండా భారత్‌కు నూతన బౌలింగ్ నాయ‌కుడిగా నిలిచాడు.

గిల్ సారథ్యంలో భారత జట్టు పూర్తి సమన్వయంతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌గా అతడు చేసిన స్ట్రాటజీలు, సమయస్పూర్తితో తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్‌పై ప్రభావం చూపించాయి. సీనియర్ కెప్టెన్లు సాధించలేని రికార్డును కేవలం రెండో టెస్టుతోనే గిల్ సాధించటం అతడి భవిష్యత్ కెప్టెన్సీకి మైలురాయిగా నిలవనుంది. టీమిండియా మిగతా మూడు టెస్టులను కూడా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

This post was last modified on July 7, 2025 11:55 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

7 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

9 hours ago