శుక్రవారం రాత్రి కాస్త పొద్దు పోయిన తర్వాత షాకింగ్ ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంతో లుంగీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకు కుమార్తె (13) ఉన్నారు. యాంకర్ గా సుపరిచితురాలు కావటమే కాదు.. జర్నలిస్టు సర్కిల్స్ తో ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపైనా.. తెలంగాణ వాదం మీదా యాక్టివ్ ఉండే ఆమె ధైర్యం ఎక్కువన్న పేరుంది.
అలాంటి స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవటం అందరిని విస్మయానికి గురి చేసింది. భర్తతో విడాకుల అనంతరం మరో వ్యక్తితో కలిసి ఉంటున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఆమె నివాసం ఉంది. కలిసి ఉన్న స్నేహితుడితో వచ్చిన మనస్పర్థలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. ఆమె సూసైడ్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లారు.
ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయగా. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పని చేస్తున్నారు. ఈ మధ్యన జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్ గా గెలుపొందారు. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాం నగర్ లో ఉంటారు. పద్దెనిమిదేళ్లుగా తెలుగు మీడియాలో ఆమె జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ధాన్యముద్రలో ఉన్న తన ఫోటోను షేర్ చేసి.. “మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అన్న కోట్ ను యాడ్ చేశారు. ఆమె పరిచయమున్న వారంతా ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
This post was last modified on June 28, 2025 10:34 am
భారత్, పాకిస్థాన్ మధ్య చాలా ఏళ్లుగా సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. గత ఏడాది పహల్గాం దాడితో అవి మరింత క్షీణించాయి.…
నాలుగేళ్ల ముందు వరకు రిషబ్ శెట్టి అంటే ఎవరో కర్ణాటక అవతల సినీ ప్రేక్షకులకు తెలియదు. దర్శకుడిగా, నటుడిగా అప్పటికే కొన్ని…
వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు పరామర్శ యాత్ర సిద్ధమవుతున్నారు. బుధవారం గుంటూరులో, శుక్రవారం ఇబ్రహీంపట్నంలో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు,…
తెలుగు టీవీ చరిత్రలోనే ట్రెండ్ సెట్టింగ్ షోల్లో ఆట ఒకటి. అప్పటికే వేరే ఛానెళ్లలో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు ఉన్నప్పటికీ.…
బాలీవుడ్ హీరోయిన్లలో ప్రేమకథలు, బ్రేకప్లు లేని వాళ్లు అరుదుగా కనిపిస్తారు. అక్కడ పెద్దగా దాపరికాలు కూడా ఏమీ ఉండవు. ఎక్కువగా…
వైసీపీ నేతలపైనా.. ఆ పార్టీ అధినేత జగన్పైనా సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. అధికారంలో ఉన్నప్పుడు.. అధికారం కోల్పోయినప్పుడు కూడా…