Trends

టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్.. కారణం ఇదేనా?

శుక్రవారం రాత్రి కాస్త పొద్దు పోయిన తర్వాత షాకింగ్ ఉదంతం ఒకటి హైదరాబాద్ లో చోటు చేసుకుంది. టీ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) ఆత్మహత్య చేసుకున్నారు. తన నివాసంతో లుంగీతో ఫ్యాన్ కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమెకు కుమార్తె (13) ఉన్నారు. యాంకర్ గా సుపరిచితురాలు కావటమే కాదు.. జర్నలిస్టు సర్కిల్స్ తో ఆమె అందరితోనూ కలుపుగోలుగా ఉంటారు. జర్నలిస్టులకు సంబంధించిన అంశాలపైనా.. తెలంగాణ వాదం మీదా యాక్టివ్ ఉండే ఆమె ధైర్యం ఎక్కువన్న పేరుంది.

అలాంటి స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవటం అందరిని విస్మయానికి గురి చేసింది. భర్తతో విడాకుల అనంతరం మరో వ్యక్తితో కలిసి ఉంటున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లో ఆమె నివాసం ఉంది. కలిసి ఉన్న స్నేహితుడితో వచ్చిన మనస్పర్థలే ఆమె ఆత్మహత్యకు కారణమని భావిస్తున్నారు. ఆమె సూసైడ్ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఆమె ఇంటికి వెళ్లారు.

ఆమె తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయగా. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పని చేస్తున్నారు. ఈ మధ్యన జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్ గా గెలుపొందారు. ఆమె డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాం నగర్ లో ఉంటారు. పద్దెనిమిదేళ్లుగా తెలుగు మీడియాలో ఆమె జర్నలిస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆమె ఇన్ స్టాలో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది. ధాన్యముద్రలో ఉన్న తన ఫోటోను షేర్ చేసి.. “మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుంది” అన్న కోట్ ను యాడ్ చేశారు. ఆమె పరిచయమున్న వారంతా ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

This post was last modified on June 28, 2025 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

6 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

9 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

9 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

10 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

11 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

12 hours ago