Political News

“వైసీపీ పిల్ల కాల్వ‌.. ఏనాటికైనా..”

వైసీపీని పిల్ల కాల్వ‌తో పోలుస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. కాంగ్రెస్‌లో ఆ పార్టీ కూడా క‌లుస్తుంద‌ని వ్యాఖ్యానించారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకులో శుక్ర‌వారం సాయంత్రం నిర్వ‌హించిన పార్టీ కార్య‌క్ర‌మం లో ష‌ర్మిల మాట్లాడారు. “కాంగ్రెస్ పార్టీ మ‌హా స‌ముద్రం. అనేక పిల్ల‌కాల్వ‌లు.. ఈ స‌ముద్రంలో క‌లిసిపోవాల్సిందే. వైసీపీ కూడా అలాంటిదే. ఏదో ఒక‌రోజు ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌లో క‌లిసి పోవాల్సిందే” అని ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇదేస‌మయంలో జిల్లాలోని పోల‌వ‌రం ప్రాజెక్టుపై కూడా ఆమె స్పందించారు.

పోల‌వ‌రంప్రాజెక్టును దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి క‌ల‌ల ప్రాజెక్టుగా పేర్కొన్న ష‌ర్మిల‌.. ఆయ‌న కుమారుడే ఈ ప్రాజెక్టును ధ్వంసం చేశాడంటూ.. జ‌గ‌న్‌పై నిప్పులు చెరిగారు. వైసీపీ హ‌యాంలో పోల‌వ‌రం పూర్తి చేస్తామ‌ని.. నీటిని ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని.. దీనిపై అసెంబ్లీలోనూ జ‌బ్బ‌లు చ‌రుచుకున్నార‌ని ఆమె ఎద్దేవా చేశారు. కానీ, కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డం.. రివ‌ర్స్‌టెండ‌ర్లు నిర్వ‌హించ‌డంతో పోల‌వ‌రం ప్ర‌గ‌తి ప‌దేళ్ల వెన‌క్కి పోయింద‌ని.. దీనికి ముమ్మాటికీ జ‌గ‌నే కార‌ణ‌మ‌ని వ్యాఖ్యానించారు. ఆయ‌న హ‌యాం లోనే పోల‌వ‌రం ఎత్తును కూడా త‌గ్గించే ప్ర‌తిపాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింద‌ని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు.

అయితే.. కూట‌మి ప్ర‌భుత్వం కూడా పోల‌వ‌రం ఎత్తును త‌గ్గించేందుకు నాట‌కం ఆడుతోంద‌ని ష‌ర్మిల వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న మోడీ స‌ర్కారుతో క‌లిమి, చెలిమి ఉంద‌ని చెబుతున్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు పోల‌వ‌రాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని.. పోల‌వ‌రం ఎత్తును త‌గ్గిస్తే ఎందుకు మౌనంగా ఉంటున్నార‌ని వ్యాఖ్యానించారు. పోల‌వ‌రం ఎత్తును త‌గ్గిస్తే.. కాంగ్రెస్ పార్టీ ఉద్య‌మాలు చేస్తుంద‌ని ష‌ర్మిల తెలిపారు. అంతేకాదు.. పోల‌వ‌రం నిర్వాసితుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు న్యాయం చేయ‌లేద‌ని ష‌ర్మిల దుయ్య‌బ‌ట్టారు. వారిని ఆదుకునే విష‌యంలో అప్పుడు జ‌గ‌న్ , ఇప్పుడు చంద్ర‌బాబు కూడా విఫ‌ల‌మ‌య్యార‌ని అన్నారు.

ఇక‌, కీల‌క‌మైన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై స్పందించిన ష‌ర్మిల‌.. త‌మ‌కు ఏపీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మని వ్యాఖ్యానించారు. “నేను ఏపీ కాంగ్రెస్ పార్టీకి అధ్య‌క్షురాలిని. ఇక్క‌డి ప్ర‌జ‌ల మేలు నాకు ముఖ్యం. ఎవ‌రో ఏదో అనుకుంటార‌ని నేను భ‌య‌ప‌డ‌ను. బ‌న‌క చ‌ర్ల విష‌యంలో రాష్ట్రానికి మేలు జ‌రుగుతుంద‌ని సీమ వాసుల‌కు నీళ్లు వ‌స్తాయ‌ని అనుకుంటే.. స‌హ‌క‌రించేందుకు సిద్ధంగానే ఉంటాను. ఈ విష‌యంలో తెలంగాణ‌కు కూడా అన్యాయం జ‌ర‌గ‌రాద‌నేది మా పార్టీ వాద‌న‌” అని ష‌ర్మిల తేల్చి చెప్పారు.

This post was last modified on June 28, 2025 10:28 am

Share

Recent Posts

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

1 minute ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

42 minutes ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

2 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

2 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

5 hours ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

6 hours ago