Trends

టీమిండియా.. ఇది ఎంత చెత్త రికార్డ్ అంటే..

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు ఓ అరుదైన చెత్త రికార్డును కూడా టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినా, బౌలర్లు మాత్రం నిరాశపరిచి జట్టుకు పరాభవం మిగిల్చారు.

ఈ మ్యాచ్‌లో మొదట భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 134, గిల్ 147, రాహుల్ 137, జైస్వాల్ 101 పరుగులతో సెంచరీలు చేశారు. పంత్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 118 పరుగులు చేసి మరో సెంచరీ చేశాడు. మొత్తంగా భారత్ 471, 364 పరుగులు చేసింది. కానీ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు.

ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 5 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. ముఖ్యంగా డకెట్ 149 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో జో రూట్, జామీ స్మిత్ ల భాగస్వామ్యం మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పేసింది. దీంతో సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంతకు ముందు 1928-29లో ఆస్ట్రేలియా జట్టు నాలుగు సెంచరీల తర్వాత ఓడిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్ ఐదు సెంచరీల తర్వాత కూడా ఓడిపోవడం క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. 

ఇది భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలిచివేసిన సంఘటనగా మారింది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ అనంతరం గిల్ నాయకత్వంలో ఆడిన ఈ తొలి టేస్ట్ టీమిండియాకు ఒక బిగ్ సవాల్. ఈ పరాజయం తర్వాత భారత్ జట్టు సమీక్ష తప్పనిసరి అయింది. బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా బౌలింగ్ లోపిస్తే విజయాలు సాధ్యం కాదని మరోసారి ఈ మ్యాచ్ రుజువు చేసింది. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయకపోతే ముందు మ్యాచ్‌లలోనూ ఇలాంటివే జరుగవచ్చు.

This post was last modified on June 25, 2025 9:41 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ప్రేమ కావాలంటే డార్లింగ్ జోరు తగ్గాలి

కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…

11 minutes ago

స్టార్లు లేని లోటు… సత్య తీరుస్తాడా?

ఒకప్పుడు వేసవి సీజన్ అంటే పెద్ద హీరోల సినిమాలతో కళకళలాడిపోయేది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముందు పెద్ద…

5 hours ago

హిట్టిస్తే గుడి కట్టేస్తారు

బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్‌బస్టర్ కొట్టి దశాబ్దం…

6 hours ago

వెంకటేష్ బాకీ తమన్ తీర్చాల్సిందే

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…

8 hours ago

ప్రభాస్ వల్ల థియేటర్లకు కళొచ్చింది

మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…

10 hours ago

“తెలంగాణ వద్దురా… ఉమ్మడి ఆంధ్ర ముద్దురా”

తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…

11 hours ago