Trends

టీమిండియా.. ఇది ఎంత చెత్త రికార్డ్ అంటే..

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఈ ఓటమితో పాటు ఓ అరుదైన చెత్త రికార్డును కూడా టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో బ్యాటర్లు ఒకే మ్యాచ్‌లో ఐదు సెంచరీలు చేసిన జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. భారత బ్యాటర్లు అద్భుతంగా రాణించినా, బౌలర్లు మాత్రం నిరాశపరిచి జట్టుకు పరాభవం మిగిల్చారు.

ఈ మ్యాచ్‌లో మొదట భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 134, గిల్ 147, రాహుల్ 137, జైస్వాల్ 101 పరుగులతో సెంచరీలు చేశారు. పంత్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా 118 పరుగులు చేసి మరో సెంచరీ చేశాడు. మొత్తంగా భారత్ 471, 364 పరుగులు చేసింది. కానీ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లను అడ్డుకోలేకపోయారు.

ఇంగ్లాండ్ జట్టు 371 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి 5 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. ముఖ్యంగా డకెట్ 149 పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివర్లో జో రూట్, జామీ స్మిత్ ల భాగస్వామ్యం మ్యాచ్‌ను ఇంగ్లాండ్ వైపు తిప్పేసింది. దీంతో సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇంతకు ముందు 1928-29లో ఆస్ట్రేలియా జట్టు నాలుగు సెంచరీల తర్వాత ఓడిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు భారత్ ఐదు సెంచరీల తర్వాత కూడా ఓడిపోవడం క్రికెట్ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది. 

ఇది భారత క్రికెట్ అభిమానులను తీవ్రంగా కలిచివేసిన సంఘటనగా మారింది. రోహిత్, విరాట్ రిటైర్మెంట్ అనంతరం గిల్ నాయకత్వంలో ఆడిన ఈ తొలి టేస్ట్ టీమిండియాకు ఒక బిగ్ సవాల్. ఈ పరాజయం తర్వాత భారత్ జట్టు సమీక్ష తప్పనిసరి అయింది. బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నా బౌలింగ్ లోపిస్తే విజయాలు సాధ్యం కాదని మరోసారి ఈ మ్యాచ్ రుజువు చేసింది. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేయకపోతే ముందు మ్యాచ్‌లలోనూ ఇలాంటివే జరుగవచ్చు.

Kumar

Recent Posts

ఇక కొడాలి నాని వంతు

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఫైర్‌బ్రాండ్ కొడాలి నానిపై 2021లో న‌మోదైన కేసు విచార‌ణ‌కు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది.…

3 hours ago

అత్తెసరు వసూళ్లతో ముంచేసేలా ఉంది

హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…

4 hours ago

‘చంద్రబాబు భరోసానిచ్చారు… మాకు అది చాలు’

ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…

5 hours ago

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

7 hours ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

8 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

8 hours ago