గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ వద్ద క్రాష్ ల్యాండింగ్ అయింది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది.
అహ్మదాబాద్ నుండి లండన్ కు 242 మంది ప్రయాణికులతో ఈ విమానం టేకాఫ్ అయిందని తెలుస్తోంది. కొన్ని బిల్డింగ్ లపై విమానం క్రాష్ లాండ్ అయిందని తెలుస్తోంది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. సమాచారం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక, డిజాస్టర్ మేనేజ్మెంట్, రెస్క్యూ, పోలీసు, వైద్య బృందాలు ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
This post was last modified on June 12, 2025 4:43 pm
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…