రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్ ఎలాంటి బ్రేక్ లేకుండా జరగాలనే భావంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న.. ఇంతకీ ఆకాశం ఏమంటుంది? ఫైనల్ మ్యాచ్ కు వరుణ దేవుడు అడ్డు పడతాడా అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వాతావరణం గురుత్వంగా మారుతోంది. జూన్ 3న జరగాల్సిన ఈ ఫైనల్కు వర్షం రాకుండా ఉండదు. జల్లులు పడే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ చెబుతోంది.
ఇప్పటికే కోల్కతా వేదిక నుండి అహ్మదాబాద్కు ఫైనల్ మ్యాచ్ను మారుస్తూ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వాతావరణం దృష్ట్యా కీలకమైంది. కానీ ఇప్పుడు అదే అహ్మదాబాద్లోనూ వర్షభీతిని ఎదుర్కొనాల్సి వస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం మంగళవారం రోజు మేఘావృతంగా ఉంటుందని, తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెబుతోంది. అభిమానులకు ఇప్పుడు ఒక్కటే ఆశ.. రిజర్వ్ డే ఉపయోగించాల్సిన పరిస్థితి రాకూడదన్నదే.
అయితే, మ్యాచ్కు రిజర్వ్ డే (జూన్ 4) ఏర్పాటు చేశారు. వర్షం వల్ల మ్యాచ్ పూర్తవకపోతే మరుసటి రోజు కొనసాగిస్తారు. ఆ రోజూ వర్షం అవరోధం కలిగిస్తే మాత్రం, లీగ్ స్టేజ్లో అగ్రస్థానంలో ఉన్న (పంజాబ్) జట్టుకు టైటిల్ను ఇస్తారు. దీంతో RCB అభిమానుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కలల కప్ కోసం ఎదురుచూస్తున్న టీమ్ కు వాతావరణం పరీక్షగా మారుతోంది.
గతంలోనూ ఇదే వేదిక వర్షాంతకానికి నిలయంగా మారింది. 2023లో గుజరాత్ vs చెన్నై మధ్య జరిగిన ఫైనల్లో భారీ వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడింది. ఆ రోజు కూడా పలుమార్లు ఆట ఆగడం చూసిన అభిమానులు ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ తపనకు వరుణుడు వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి.
This post was last modified on June 2, 2025 6:41 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…