Trends

ఐపీఎల్ ఫైనల్.. ఆకాశం ఏమంటోంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్‌ ఎలాంటి బ్రేక్ లేకుండా జరగాలనే భావంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న.. ఇంతకీ ఆకాశం ఏమంటుంది? ఫైనల్ మ్యాచ్ కు వరుణ దేవుడు అడ్డు పడతాడా అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వాతావరణం గురుత్వంగా మారుతోంది. జూన్ 3న జరగాల్సిన ఈ ఫైనల్‌కు వర్షం రాకుండా ఉండదు. జల్లులు పడే అవకాశం ఉన్నట్లు స్థానిక వాతావరణ శాఖ చెబుతోంది.

ఇప్పటికే కోల్‌కతా వేదిక నుండి అహ్మదాబాద్‌కు ఫైనల్ మ్యాచ్‌ను మారుస్తూ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం వాతావరణం దృష్ట్యా కీలకమైంది. కానీ ఇప్పుడు అదే అహ్మదాబాద్‌లోనూ వర్షభీతిని ఎదుర్కొనాల్సి వస్తోంది. వాతావరణ శాఖ ప్రకారం మంగళవారం రోజు మేఘావృతంగా ఉంటుందని, తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని చెబుతోంది. అభిమానులకు ఇప్పుడు ఒక్కటే ఆశ.. రిజర్వ్ డే ఉపయోగించాల్సిన పరిస్థితి రాకూడదన్నదే.

అయితే, మ్యాచ్‌కు రిజర్వ్ డే (జూన్ 4) ఏర్పాటు చేశారు. వర్షం వల్ల మ్యాచ్ పూర్తవకపోతే మరుసటి రోజు కొనసాగిస్తారు. ఆ రోజూ వర్షం అవరోధం కలిగిస్తే మాత్రం, లీగ్ స్టేజ్‌లో అగ్రస్థానంలో ఉన్న (పంజాబ్) జట్టుకు టైటిల్‌ను ఇస్తారు. దీంతో RCB అభిమానుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కలల కప్ కోసం ఎదురుచూస్తున్న టీమ్ కు వాతావరణం పరీక్షగా మారుతోంది.

గతంలోనూ ఇదే వేదిక వర్షాంతకానికి నిలయంగా మారింది. 2023లో గుజరాత్ vs చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో భారీ వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డేకు వాయిదా పడింది. ఆ రోజు కూడా పలుమార్లు ఆట ఆగడం చూసిన అభిమానులు ఈసారి ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ పూర్తవ్వాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఆ తపనకు వరుణుడు వెనక్కి తగ్గుతాడో లేదో చూడాలి.

This post was last modified on June 2, 2025 6:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జ‌న‌నాయ‌గ‌న్ సంక్షోభం… నోరు విప్పిన విజ‌య్

త‌మిళంలో కొన్నేళ్లుగా నంబ‌ర్ వ‌న్ హీరోగా కొన‌సాగుతున్న విజ‌య్.. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే…

1 hour ago

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…

2 hours ago

ఆఖరి పోరులో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా!

న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…

2 hours ago

అంబటికి సినిమా చూపిస్తామన్న పెమ్మసాని

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…

3 hours ago

సిట్ నోటీసులను లాజిక్ తో కొట్టిన కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్‌ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…

4 hours ago

ఆంధ్రా యువత ఎదురుచూపు… ఉగాదికి ముహూర్తం?

ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మ‌ధ్య జ‌రిగే తెలుగు సంవ‌త్స‌రాది ఉగాది ప‌ర్వ‌దినానికి భారీ ప్ర‌క‌ట‌న చేసేందుకు ఏపీ మంత్రి నారా…

5 hours ago