Trends

సైన్యంలో చేరుతారా? నోటిఫికేష‌న్ ఇచ్చిన ఆర్మీ.. నిజ‌మెంత‌?

అదిగో పులి.. అంటే ఇదిగో తోక‌.. అన్న‌ట్టుగా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ప‌రుగులు పెడుతోంది. ప్ర‌స్తుతం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ కీలక ప్రకటన ఇచ్చిందంటూ.. సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. ప్రాదేశిక(టెర్రిటోరియ‌ల్‌) సైన్యంలో చేరాలంటూ సాధారణ పౌరులకు ఆహ్వానం ప‌లికిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాదు.. దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింద‌ని కూడా పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది.

దీనిలో 18 ఏళ్ల నుంచి 42 ఏళ్లలోపు వారికి అవకాశం ఉంటుంద‌ని…. విద్యార్హత డిగ్రీ..ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఆదాయం కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంద‌ని కూడా పేర్కొన్నారు. కానీ.. ఆర్మీ వెబ్ సైట్‌లో కానీ.. ఆర్మీ అధికారులు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ప్ర‌క‌ట‌నా విడుద‌ల చేయ‌లేదు. ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల మూడ్‌ను త‌మ‌వైపు తిప్పుకొనేందుకు.. భార‌త దేశ ఆర్మీ పాట‌వం స‌రిపోవ‌డం లేద‌న్న ప్రచారం చేసేందుకు జ‌రుగుతున్న కుయుక్తి ప్ర‌చారంగా ప్ర‌భుత్వం పేర్కొంది.

టెర్రిటోరియ‌ల్ ఆర్మీ వ్య‌వ‌హారానికి వ‌స్తే.. సైనిక అధికారుల‌ను ఏటా రెండు సార్లు రిక్రూట్‌మెంట్ చేసు కుంటారు. ఇది సాధార‌ణ ప్ర‌క్రియ‌. దీనికి ప్ర‌త్యేకంగా ఇచ్చే వేత‌న, భ‌త్యాలు ఉండ‌వు. అవ‌స‌ర‌మైనప్పుడు పిలిచి.. భోజ‌నం పెట్టి.. గౌర‌వార్థ‌సేవ‌ల‌ను వినియోగించుకుంటారు. దీని ప్ర‌కారం.. ఈ ఏడాది మార్చి 26నే టెర్రిటోరియ‌ల్ రిక్రూట్‌మెంటు కోసం ఆర్మీ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. అయితే.. దీనిని లేటెస్టు రిక్రూట్‌మెంటు అంటూ.. ప్ర‌చారం చేస్తున్నారు.

ఇదిలావుంటే.. తాజాగా మే 8న ఆర్మీ ప్ర‌క‌ట‌న ఇచ్చిన మాట వాస్త‌వ‌మే. కానీ, అది .. ప‌శువైద్యుల కోసం ఇచ్చింది. దేశ‌వ్యాప్తంగా వివిధ బెటాలియ‌న్ల‌లో ఉన్న గుర్రాలు, కుక్క‌లు, గాడిద‌ల ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం.. ప‌శువైద్యుల‌ను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇవి 20 పోస్టులు ఉన్నాయి. వీటి కోసం అయితే.. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ ద్వారా రిక్రూట్‌మెంటు జ‌రుగుతోంది. కానీ.. దీనినే ప్రాదేశిక నియామ‌కాల కింద చూపిస్తూ.. కొంద‌రు చేస్తున్న ప్ర‌చారం త‌ప్ప‌ని భార‌త ఆర్మీ అధికారులు ప్ర‌క‌టించారు. దీని కింద ఆన్‌లైన్‌లో న‌గ‌దు చెల్లిస్తే.. త‌మ‌కు సంబంధం లేద‌ని చెబుతున్నారు.

Satya

Recent Posts

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

1 hour ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

2 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

2 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

4 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

4 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

5 hours ago