Trends

వేరే ఆఫర్లు వచ్చినా RCBని ఎందుకు వదల్లేదంటే..: కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు అసలు కారణాలేంటో ఓపెన్‌గా చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తాను అనుభవించిన ఒత్తిడి, ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొన్న అంచనాలు, తనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో తాను ఆ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు.

“అప్పుడు నేను ఆటను ఆస్వాదించలేకపోయాను. కెప్టెన్‌గా విజయాల కోసం శ్రమిస్తూ, ఆటగాడిగా సత్తా చాటాలనే ఒత్తిడిలో నా గేమ్ పై పట్టు తగ్గిపోయింది. నేను మళ్లీ ప్రెషర్ లేకుండా ఆటను ప్రేమించాలనుకున్నా. అందుకే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పా,” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ తనను ఎలా నమ్మాడో కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశాడు. “నన్ను నంబర్ 3లో బ్యాటింగ్‌కు పంపిన వ్యక్తి ధోనీనే. నన్ను నమ్మిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ స్ఫూర్తినిచ్చారు. వారు చూపిన నమ్మకం నాకు బేస్ అయ్యింది” అని స్పష్టం చేశాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసిన కోహ్లీ.. “2016–2019 మధ్యకాలంలో కొన్ని ఇతర జట్లు నన్ను సంప్రదించాయి. కానీ నేను వెళ్లలేదు. ఆర్‌సీబీకి నేను కావాల్సిన ఆటగాడినే కాదు.. అభిమానులు నన్ను కుటుంబ సభ్యుల్లా చూసారు. ఆ ప్రేమే నాకు ట్రోఫీల కన్నా ఎక్కువ” అంటూ కోహ్లీ భావోద్వేగంతో చెప్పారు. తాను ఎప్పటికీ విమర్శల కన్నా అభిమానుల ప్రేమను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటానని, తాను దూకుడుగా ఆడినా, కిందపడినా.. తన వెనుక నిలిచిన వారే అభిమానులని విరాట్ కోహ్లీ చివరలో ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చాడు. “నా ఆటే నాకు గుర్తింపు. కానీ నా ఆటను గర్వపడేలా చూసింది మీ ప్రేమే” అని ఆయన అన్నారు.

This post was last modified on May 6, 2025 3:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 minute ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

38 minutes ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

3 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

7 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

8 hours ago