Trends

వేరే ఆఫర్లు వచ్చినా RCBని ఎందుకు వదల్లేదంటే..: కోహ్లీ

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, తన ఆటపై అభిమానుల ప్రేమ మాత్రం ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోహ్లీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకునేందుకు అసలు కారణాలేంటో ఓపెన్‌గా చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తాను అనుభవించిన ఒత్తిడి, ఎప్పటికప్పుడు తాను ఎదుర్కొన్న అంచనాలు, తనపై వచ్చిన విమర్శల నేపథ్యంలో తాను ఆ నిర్ణయం తీసుకున్నానని వివరించాడు.

“అప్పుడు నేను ఆటను ఆస్వాదించలేకపోయాను. కెప్టెన్‌గా విజయాల కోసం శ్రమిస్తూ, ఆటగాడిగా సత్తా చాటాలనే ఒత్తిడిలో నా గేమ్ పై పట్టు తగ్గిపోయింది. నేను మళ్లీ ప్రెషర్ లేకుండా ఆటను ప్రేమించాలనుకున్నా. అందుకే కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పా,” అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. టీమిండియాలో మహేంద్ర సింగ్ ధోనీ తనను ఎలా నమ్మాడో కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశాడు. “నన్ను నంబర్ 3లో బ్యాటింగ్‌కు పంపిన వ్యక్తి ధోనీనే. నన్ను నమ్మిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ స్ఫూర్తినిచ్చారు. వారు చూపిన నమ్మకం నాకు బేస్ అయ్యింది” అని స్పష్టం చేశాడు.

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసిన కోహ్లీ.. “2016–2019 మధ్యకాలంలో కొన్ని ఇతర జట్లు నన్ను సంప్రదించాయి. కానీ నేను వెళ్లలేదు. ఆర్‌సీబీకి నేను కావాల్సిన ఆటగాడినే కాదు.. అభిమానులు నన్ను కుటుంబ సభ్యుల్లా చూసారు. ఆ ప్రేమే నాకు ట్రోఫీల కన్నా ఎక్కువ” అంటూ కోహ్లీ భావోద్వేగంతో చెప్పారు. తాను ఎప్పటికీ విమర్శల కన్నా అభిమానుల ప్రేమను ఎక్కువగా గుర్తుపెట్టుకుంటానని, తాను దూకుడుగా ఆడినా, కిందపడినా.. తన వెనుక నిలిచిన వారే అభిమానులని విరాట్ కోహ్లీ చివరలో ఎమోషనల్ గా క్లారిటీ ఇచ్చాడు. “నా ఆటే నాకు గుర్తింపు. కానీ నా ఆటను గర్వపడేలా చూసింది మీ ప్రేమే” అని ఆయన అన్నారు.

This post was last modified on May 6, 2025 3:29 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

1 hour ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago