ఈసారి ఇండియన్ ప్రిమియర్ లీగ్ గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠభరితంగా సాగుతోందో తెలిసిందే. లీగ్ దశలో చివరి మ్యాచ్ వరకు ప్లేఆఫ్ బెర్తులు ఖరారు కాకపోవడం విశేషమే. లీగ్ దశ చివరి రెండు మ్యాచ్లకు ముందు వరకు కూడా ఖరారైన ప్లేఆఫ్ బెర్తు ఒక్కటే. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్తో ఒకేసారి రెండు బెర్తులు తేలిపోయాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లేఆఫ్కు దూసుకెళ్లింది. లీగ్ దశలో టాప్-2లో నిలిచిన జట్లకు ప్లేఆఫ్లో అదనపు అవకాశం ఉంటుందన్న సంగతి తెలిసిందే. మొదట జరిగే క్వాలిఫయర్లో ఓడినా మళ్లీ ఎలిమినేటర్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇది టాప్-2లో ఉన్న ముంబయి, ఢిల్లీ జట్లకు కలిసొచ్చే అంశం.
ఇక ఢిల్లీ చేతిలో ఓడినప్పటికీ.. నెట్ రన్రేట్లో మెరుగైన స్థితిలోనే ఉండటంతో బెంగళూరు కూడా ప్లేఆఫ్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో లక్ష్యాన్ని ఢిల్లీ 17.3 ఓవర్లలోపు ఛేదించి ఉంటే బెంగళూరు రన్రేట్.. కోల్కతా కంటే కిందికి వెళ్లేది. అప్పుడు కోల్కతా ముందంజ వేసేది. అప్పుడు మంగళవారం ముంబయి చేతిలో సన్రైజర్స్ ఓటమి కోసం బెంగళూరు ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు బెంగళూరుకు ముందుకెళ్లిపోవడంతో కోల్కతా ఆ స్థితిలో ఉంది. మరి సన్రైజర్స్ గెలిచి ముందంజ వేస్తుందా.. లేక ఓడి కోల్కతాకు అవకాశమిస్తుందా అన్నది చూడాలి.
ఇదిలా ఉంటే తాజా ఫలితంతో ఢిల్లీ ఐపీఎల్లో ఒక అరుదైన ఘనతను సాధించింది. ఇప్పటిదాకా ఐపీఎల్లో మొత్తం 13 సీజన్లు జరిగితే 2012లో పది జట్లు పోటీ పడ్డాయి. తర్వాతి రెండు సీజన్లలో తొమ్మిదేసి జట్లు ఆడాయి. మిగతా సీజన్లన్నింటిలో జట్ల సంఖ్య ఎనిమిదే. ఐతే ఢిల్లీ ఇప్పటిదాకా లీగ్ దశలో టాప్-1 నుంచి టాప్-10 వరకు ప్రతి స్థానంలోనూ నిలవడం విశేషం. 2009, 2012 సీజన్లలో ఢిల్లీ అగ్రస్థానంతో లీగ్ దశను ముగించింది. ప్రస్తుత సీజన్లో రెండో స్థానంలో నిలిచింది. 2019, 2008, 2009 సీజన్లలో వరుసగా 3, 4, 5 స్థానాలు సాధించింది. 2016, 17 సీజన్లలో ఆరో స్థానంలో నిలిచింది. 2017లో ఏడో స్థానానికి పరిమితమైంది. 2014, 18 సీజన్లలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. 2013, 2011 సీజన్లలో వరుసగా 9, 10 స్థానాల్లో నిలిచింది. లీగ్లో ఎనిమిది జట్లే కొనసాగితే ఈ రికార్డు మరే జట్టూ అందుకోలేదు.
This post was last modified on November 3, 2020 10:09 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…