Trends

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT – డీప్ సీక్ – మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి అలవాటు పడుతోంది. ముఖ్యంగా చైనా ఏఐ పరిశోధకులు ప్రపంచానికి సాంకేతిక విజ్ఞానంలో ఒక సరికొత్త ట్రెండ్ తీసుకొచ్చే మార్గం వేస్తున్నప్పటికీ, వారి వ్యక్తిగత జీవితం మాత్రం తీవ్ర ఒత్తిడిలో కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత మూడు సంవత్సరాల్లో చైనాకు చెందిన పలువురు ప్రముఖ ఏఐ శాస్త్రవేత్తలు చిన్న వయసులోనే మరణించడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. 

అనారోగ్యంతో చనిపోయారని అధికారికంగా చెబుతున్నా… మానసిక ఒత్తిడే ప్రధాన కారణమా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. డేటా ప్రకారం, 2022 నుండి 2025 మధ్య కాలంలో కనీసం ఆరుగురు ప్రముఖ ఏఐ నిపుణులు మరణించారు. వీరిలో మెగ్వీ టెక్నాలజీకి చీఫ్ సైంటిస్టుగా పనిచేసిన మైక్రోసాఫ్ట్ మాజీ పరిశోధకుడు సన్ జియాన్ (45), చైనా రక్షణ రంగ ఏఐ నిపుణుడు ఫెంగ్ యాంగే (38), సెన్స్‌టైమ్ సంస్థ వ్యవస్థాపకుడు టాంగ్ జియావో (55), హెల్త్‌కేర్ ఏఐ సంస్థలో సీనియర్ ఇన్నోవేటర్ హే జీ (41), టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ క్వాన్ యుహున్ (39) వంటి వారు ఉన్నారు. 

వీరిలో చాలామంది అమెరికాలో విద్యనభ్యసించి, అనుభవం సంపాదించి, స్వదేశానికి తిరిగొచ్చినవారే. ఇక్కడ ప్రశ్నేంటంటే… ప్రపంచస్థాయిలో ప్రతిభావంతులైన ఈ శాస్త్రవేత్తలు చిన్న వయసులోనే ఎందుకు మరణించారన్నది. చైనా లోపలి వర్గాల సమాచారం ప్రకారం, రీసెర్చ్ రంగంలో ఉండే ఒత్తిడికి, నిరంతర స్పర్థకు వారు లోబడి ఉంటారని అంటున్నారు. ఒక ఐడియాతో వచ్చేసరికి, అదే అంశాన్ని ఇంకొకరు మునుపే పూర్తిచేసేస్తే మనోభావాలు దెబ్బతింటాయని, అది తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తుందంటున్నారు నిపుణులు.

అంతేగాక, ఏఐ రంగంలో తలెత్తే నైతిక వివాదాలు, ఆ టెక్నాలజీ వల్ల సమాజంపై పడే ప్రభావాలు కూడా ఈ శాస్త్రవేత్తలపై అణిచివేతలా మారుతున్నాయట. కొన్ని కంపెనీలు మరియు ప్రభుత్వాలు వేగంగా ఫలితాల కోసం ఒత్తిడి తీసుకురావడం, పనిలో సంతృప్తికంటే లక్ష్యాల అమలు మాత్రమే ప్రాధాన్యం కావడం వల్ల జీవితం మీదే ప్రశ్నార్థకం పడుతోందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో, కేవలం టెక్నాలజీ పురోగతిపై కాకుండా… శాస్త్రవేత్తల మానసిక ఆరోగ్యంపై కూడా గమనించాల్సిన అవసరం వుంది.

This post was last modified on April 16, 2025 7:23 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

1 hour ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

4 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

7 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

8 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

8 hours ago

రాజ‌ధానిపై చంద్ర‌బాబు ముందు చూపు… ఇవే కీల‌కం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై సీఎం చంద్ర‌బాబుకు ఉన్న ముందుచూపు, తాజాగా రాజ‌ధాని బిల్లును ఆమోదించిన విధానం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.…

8 hours ago