Trends

ఏపీ కియా కంపెనీలో మిస్టరీ దొంగతనం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ కారు తయారీ సంస్థ కియా మోటార్స్‌లో సంచలనాత్మక దొంగతనం వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న కియా ఫ్యాక్టరీలో దాదాపు 900 కారు ఇంజిన్లు మాయం కావడంతో పెద్ద కలకలం రేగింది. కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కియా కార్ల తయారీలో ఉపయోగించే ఈ ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తుంటాయి. అయితే ఈసారి వచ్చిన లోడ్‌లో చాలా ఇంజిన్లు కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. ఈ ఇంజిన్లు రవాణా సమయంలో మార్గమధ్యంలో ఎక్కడో చోరీకి గురయ్యాయా? లేక కంపెనీకి వచ్చిన తర్వాతే పక్కదారి పట్టాయా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

గత నెల 19న కియా కంపెనీ ప్రతినిధులు పోలీసులను సంప్రదించారు. అయితే, లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేయాలని కోరగా, అలా చేయలేమని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో కంపెనీ అధికార ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ దొంగతనంపై ఇప్పటికే పోలీసులు ఆ లోడ్లు తరలించిన లారీలు, డ్రైవర్లు, గోదాములు తదితర అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అంతేకాకుండా, ఫ్యాక్టరీలో ఉన్న సీసీ కెమెరాలు, లాజిస్టిక్స్ డేటాను కూడా పరిశీలించినట్లు తెలిసింది. బహుశా కొంతమంది కంపెనీ లోపలి వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తొందరలోనే పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ భారీ చోరీపై వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఏం జరిగిందో, ఈ ఇంజిన్లు ఎలా మాయం అయ్యాయో స్పష్టత రానుంది. ఈ మిస్టరీ దొంగతనం ఎట్టకేలకు ఎవరిని తాకుతుందో చూడాలి.

This post was last modified on April 8, 2025 11:43 am

Share
Show comments
Published by
Satya
Tags: Kia Motors

Recent Posts

సీతని మిస్ చేసుకున్న హిట్ 3 భామ

ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇది సినిమా పరిశ్రమకు కూడా…

1 hour ago

ఏప్రిల్ 27… బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్‌?

ఏప్రిల్ 27, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భ‌వించి(టీఆర్ ఎస్‌) 25 సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోరుగ‌ల్లు.. ఓరుగ‌ల్లు వేదిక‌గా..…

2 hours ago

జైలర్ 2….ఫహద్ ఫాసిల్ పాత్ర ఏంటి

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 షూటింగ్ ప్రస్తుతం కేరళలో నాన్…

2 hours ago

రజినీ కోసం రాసిన స్టోరీని మార్చి…

తమిళ స్టార్ హీరో సూర్యకు ఎంతో కీలకమైన సినిమా.. రెట్రో. కొన్నేళ్లుగా అతడికి విజయాలు లేవు. తన చివరి చిత్రం…

3 hours ago

TRP ట్విస్ట్ : షాక్ ఇచ్చిన పుష్ప 2 రేటింగ్స్

ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లతో ఆల్ టైం రికార్డులు సృష్టించిన పుష్ప 2…

3 hours ago

సస్సెన్షన్ పై దువ్వాడ మార్కు రియాక్షన్!

ఏపీ శాసన మండలి సభ్యుడు దువ్వాడ శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది కదా. మంగళవారం రాత్రి ఈ…

4 hours ago