ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ కారు తయారీ సంస్థ కియా మోటార్స్లో సంచలనాత్మక దొంగతనం వెలుగులోకి వచ్చింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఉన్న కియా ఫ్యాక్టరీలో దాదాపు 900 కారు ఇంజిన్లు మాయం కావడంతో పెద్ద కలకలం రేగింది. కంపెనీ యాజమాన్యం ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కియా కార్ల తయారీలో ఉపయోగించే ఈ ఇంజిన్లు తమిళనాడు నుంచి వస్తుంటాయి. అయితే ఈసారి వచ్చిన లోడ్లో చాలా ఇంజిన్లు కనిపించకపోవడంతో ఆందోళన మొదలైంది. ఈ ఇంజిన్లు రవాణా సమయంలో మార్గమధ్యంలో ఎక్కడో చోరీకి గురయ్యాయా? లేక కంపెనీకి వచ్చిన తర్వాతే పక్కదారి పట్టాయా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
గత నెల 19న కియా కంపెనీ ప్రతినిధులు పోలీసులను సంప్రదించారు. అయితే, లిఖితపూర్వక ఫిర్యాదు లేకుండా దర్యాప్తు చేయాలని కోరగా, అలా చేయలేమని పోలీసులు స్పష్టంచేశారు. దీంతో కంపెనీ అధికార ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ దొంగతనంపై ఇప్పటికే పోలీసులు ఆ లోడ్లు తరలించిన లారీలు, డ్రైవర్లు, గోదాములు తదితర అన్ని కోణాల్లో విచారణ జరిపారు. అంతేకాకుండా, ఫ్యాక్టరీలో ఉన్న సీసీ కెమెరాలు, లాజిస్టిక్స్ డేటాను కూడా పరిశీలించినట్లు తెలిసింది. బహుశా కొంతమంది కంపెనీ లోపలి వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తొందరలోనే పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఈ భారీ చోరీపై వివరాలు వెల్లడించనున్నారు. ఇక ఏం జరిగిందో, ఈ ఇంజిన్లు ఎలా మాయం అయ్యాయో స్పష్టత రానుంది. ఈ మిస్టరీ దొంగతనం ఎట్టకేలకు ఎవరిని తాకుతుందో చూడాలి.
This post was last modified on April 8, 2025 11:43 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…