వ్యాపారం అందరూ చేస్తారు. కొందరు కష్టాన్ని నమ్ముకుంటే.. మరికొందరు తెలివిని నమ్ముకుంటారు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాత్రం ఈ రెండింటిని జోడించి బిజినెస్ చేస్తాడు. రిస్క్ తీసుకునే విషయంలో అతగాడికి మించినోడు మరొకడు ఉండడన్నట్లుగా వ్యవహరిస్తాడు. సాధారణంగా ప్రపంచ కుబేరుడు హోదాలో ఉన్నోడు ఎవరూ కూడా రాజకీయాల్లో వేలు పెట్టేందుకు.. ప్రభుత్వంలో భాగస్వామి కావటానికి అస్సలు ఇష్టపడరు. అందరిలా అలా చేస్తే అతడు మస్క్ ఎందుకు అవుతాడు?మిగిలిన పారిశ్రామికవేత్తలకు తాను భిన్నమన్న విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశాడు మస్క్.
తన చేతిలో ఉన్న సోషల్ మీడియా ఎక్స్ ను తాజాగా అమ్మేసినట్లుగా ప్రకటించాడు. నిజమా? అన్న ఆశ్చర్యానికి గురై.. తేరుకునే లోపు అసలు ట్విస్టును రివీల్ చేసి.. అతగాడి తెలివికి ఫిదా అయ్యేలా చేశాడు. ఎందుకంటే.. ఎక్స్ ను అమ్మింది బయటవారికి కాదు. తనకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీకి అమ్మేశాడు. ఈ మేరకు తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎక్స్ లో వెల్లడించాడు.33 బిలియన్ డాలర్లకు ఎక్స్ ను అమ్మివేసినట్లుగా ప్రకటించిన మస్క్.. దాన్ని కొనుగోలు చేసిన స్టార్టప్ సంస్థ విలువను తాజాగా రూ.80 బిలియన్ డాలర్లుగా నిర్ధారించారు. ఎక్స్ ను తనకు చెందిన ఏఐ స్టార్టప్ సంస్థ ‘ఎక్స్ ఏఐ’ కు అమ్మినట్లుగా ప్రకటించారు.
అధునాత ఏఐ సామర్థ్యాన్ని ఎక్స్ కు అనుసంధానం చేయటం ద్వారా ఉత్తమ ఫలితాల్ని రాబట్టవచ్చని తన తాజా పోస్టులో వెల్లడించారు. చాట్ జీపీటీకి పోటీగా గత ఏడాది ఎక్స్ ఏఐ సంస్థను మస్క్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఎక్స్ ఏఐ.. ఎక్స్ భవిష్యత్ లు ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నట్లుగా చెప్పిన మస్క్.. డేటా మోడల్స్ ను అనుసంధానం చేయటం ద్వారా మరిన్ని ఉత్తమ ఫలితాల్ని రాబట్టేందుకు ముందడుగు వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ రెండు సంస్థలు ఒకటి కావటం ద్వారా కోట్లాది మంది ప్రజలకు అదిరే అనుభూతి అందుతుందని మస్క్ వెల్లడించారు.
ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్ంప్ నకు సలహాదారుగా వ్యవహరిస్తున్న మస్క్.. టెస్లా.. స్పేస్ ఎక్స్ సీఈవోగా కీలక బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే. చివరగా.. 2022లో ఇప్పటి ఎక్స్ అప్పటి ట్విటర్ ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న మస్క్.. రెండేళ్లు తిరిగేసరికి దానిని 33 బిలియన్ డాలర్లకు అమ్మేయటం ఒక ఎత్తు అయితే.. సదరు సంస్థను తన స్టార్టప్ కు అమ్మేయటం ద్వారా దాని విలువను ఏకంగా 80 బిలియన డాలర్ల సంస్థగా మార్చటమే మస్క్ ముదురు తెలివికి నిదర్శనంగా చెప్పొచ్చు.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…