Trends

మహిళను హత్య చేసిన పూజారి, కోర్టు సంచలన తీర్పు

2023లో సంచలనం సృష్టించిన సరూర్‌నగర్‌ అప్సర హత్యకేసులో నిందితుడైన పూజారి సాయికృష్ణకు రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సాయికృష్ణ వృత్తిరీత్యా ఓ ఆలయంలో పూజారి. అదే ఆలయానికి తరుచూ వెళ్లే అప్సరతో పరిచయం ప్రేమగా మారింది. శారీరకంగా దగ్గరవడంతో ఆమె పెళ్లి కోరిక వ్యక్తం చేయడం ప్రారంభించింది. కానీ అప్పటికే వివాహితుడిగా, పిల్లల తండ్రిగా ఉన్న సాయికృష్ణ… అప్సర ఒత్తిడికి సిద్ధంగా లేకపోయాడు.

ఆమెను దూరం చేసుకోవాలని దురాలోచనకు పాల్పడి, కోయంబత్తూర్‌కు తీసుకెళ్దామని చెప్పి కారులో మొదట తిప్పాడు. శంషాబాద్ మండలంలోని సుల్తాన్‌పల్లి సమీపంలోని ఓ గోశాల వద్ద, సీసీ కెమెరాలు లేని ప్రాంతంలో కారులో నిద్రిస్తున్న అప్సరపై అతను దాడి చేశాడు. మొదట ఆమెను ఊపిరాడకుండా చేసి చంపాలనుకున్నా, ఆమె ప్రతిఘటించడంతో తలపై రాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని సరూర్‌నగర్‌లోని ఎమ్మార్వో కార్యాలయం వెనుక డ్రైనేజ్ మాన్‌హోల్‌లో పడేశాడు.

బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు, అనుమానాస్పదంగా ఉన్న సాయికృష్ణను విచారించగా అతను హత్యను అంగీకరించాడు. ఈ కేసును తీవ్రంగా పరిశీలించిన రంగారెడ్డి కోర్టు, నిందితుడు ఏకపక్షంగా బాధితురాలిని మోసం చేసి, పథకం ప్రకారం హత్యచేశాడని అభిప్రాయపడింది. దీంతో అతనికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబానికి కొంత న్యాయం జరిగినట్టయినా భావించవచ్చు. ప్రేమ పేరుతో మోసం చేసి ప్రాణాలు తీసిన వారికి శిక్ష తప్పదన్న సందేశం ఈ కేసు ద్వారా వెలువడింది.

Kumar

Recent Posts

లాక్కుపోతున్న మ‌లయాళం సినిమా

సినిమాల స‌క్సెస్ రేట్ ప‌డిపోతోందని.. ఒక‌ప్ప‌ట్లా జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌ని ఈ మ‌ధ్య మ‌న ఇండ‌స్ట్రీలో త‌ర‌చుగా ఆవేద‌న స్వ‌రం…

30 minutes ago

OG 2 అనుమానాలు తీరిపోయాయి

గత వారం రోజులుగా ఓజి 2 గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. ఈ ఏడాదే షూటింగ్ ప్రారంభమవుతుందని,…

47 minutes ago

బండ్ల గణేశ్… నిజంగా పవన్ భక్తుడే

టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్… తనను తాను జనసేన అధినేత,…

1 hour ago

తెలంగాణలో ప‌వ‌న్‌… కిక్కిరిసిన అభిమానులు

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. తెలంగాణ‌లోని హ‌నుమకొండ‌లో ప‌ర్య‌టించారు. ఢిల్లీ నుంచి నేరుగా హైద‌రాబాద్‌కు…

1 hour ago

హన్మకొండలో పవన్… చోటా గబ్బర్ సింగ్ కు పరామర్శ

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…

3 hours ago

సింగీతం మెచ్చిన పుష్ప

వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…

3 hours ago