Trends

ఈ ‘పోటీ’ పిచ్చి ఎంతటి దారుణం చేసిందంటే..?

నిజమే… ఈ విషయం విన్నంతనే.. ఈ సోకాల్డ్ ఆదునిక జనం నిత్యం పరితపిస్తున్న పోటీ… ఇద్దరు ముక్కు పచ్చలారని పిల్లల ప్రాణాలను నిలువునా తీసేసింది. అంతేనా.. ఆ పోటీ పిచ్చిలో పడిపోయిన ఆ పిల్లల తండ్రి ప్రాణాన్ని కూడా ఉరికి వేలాడేసింది. ఇదెక్కడో.. ఊహాలోకంలో తేలియాడుతున్న అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో జరగలేదు. మన తెలుగు నేలలో.. పచ్చటి పొలాలు, నిండా సెలయేరులు, మరోవైపు సుందరమైన సముద్ర తీరంతో కళకళలాడుతున్న కాకినాడ తీరంలో చోటుచేసుకుంది. యావత్తు సమాజాన్ని షాక్ కు గురి చేసిన ఈ ఘటనలో 6, 7 ఏళ్ల వయసున్న తన ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులను నీళ్లల్లో ముంచేసి చంపేసిన ఓ తండ్రి… ఆ తర్వాత తాను ఉరేసుకున్నాడు.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే… పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన వానపల్లి చంద్రకిశోర్, భార్య తనూజ, ఇద్దరు కుమారుడు జోషిల్ (7), నిఖిల్ (6)తో కలిసి కాకినాడ జిల్లా వాకలపూడిలోని ఓఎన్జీసీ కార్యాలయంలో అసిస్టెంట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. అప్పటికే ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం కావడంతో చంద్రకిశోర్ కు పెద్దగా సమస్యలేమీ లేవు. పండంటి ఇద్దరు కుమారులు, భార్యతో సంతోషంగా జీవితం సాగిస్తున్న ఆయన… ఒకటో తరగతి, యూకేజీ చదవుతున్న తన ఇద్దరు పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారని గత కొంతకాలంగా తీవ్రంగా ఆందోళన చెందుతున్నాడు. ఈ ఆందోళన ఎక్కడిదాకా వెళ్లిందంటే… భవిష్యత్తులో తమ పిల్లలు ఎక్కడ ఈ పోటీ ప్రపంచంతో పరుగెత్తలేక అవస్థలు పడతారోనన్న దాకా వెళ్లిపోయింది.

అంతే… ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. హోలీ పండుగ వేళ పెళ్లాంపిల్లలను తీసుకుని ఆఫీస్ కు వెళ్లిన చంద్రకిశోర్.. భార్యను అక్కడే ఉండమని చెప్పి… పిల్లలిద్దరికీ టైలర్ వద్ద కొలతలు ఇప్పించి తీసుకువస్తానని నమ్మించాడు. పిల్లలిద్దరితో కలిసి నేరుగా ఇంటికి వెళ్లిపోయిన చంద్రకిశోర్… ఇక ఎంతమాత్రం ఆలోచించలేదు. ముందే అనుకున్నట్లుగా పిల్లలిద్దరి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేశాడు. వారిద్దరినీ నిండా నీళ్లు ఉన్న బకెట్ లో తలలు ముంచేసి వారి ఊపిరి ఆగిపోయేలా చేశాడు. ఆ తర్వాత తానూ ఇంటిలోనే ఉరేసుకున్నాడు. అంతే.. చంద్రకిశోర్ లోని ఆందోళన ఇద్దరు పిల్లల ప్రాణాలతో పాటు అతడి ప్రాణాలను కూడా బలి తీసుకుంది. తమ మరణాలకు దారి తీసిన కారణాలను అతడు సూసైడ్ నోట్ రాసి మరి చనిపోయాడు.

10 నిమిషాల్లో వస్తానని చెప్పిన భర్త… ఎంతకీ రాకపోయేసరికి తనూజ భర్తకు ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో ఆమె ఆందోళనకు గురైంది. ఆఫీసులోని చంద్రకిశోర్ సహోద్యోగులను వెంటబెట్టుకుని ఆమె పరుగు పరుగున ఇంటికి చేరుకుంది. ఇంకేముంది… నిండా నీళ్లు బకెట్ లో కాళ్లు చేతులు కట్టబడి విగత జీవులుగా పడి ఉన్న తన ఇద్దరు బిడ్డలు, ఆ పక్కనే ఉరికి వేలాడుతున్న భర్త శవాన్ని చూసి ఆమె బోరుమంది. ఎలాంటి సమస్యలు లేవు… మంచి ఉద్యోగం ఉంది.. ఆర్థిక ఇబ్బందులన్న మాటే లేదు.. అయినా భర్త ఇంతటి దారుణానికి ఎందుకు ఒడిగట్టాడని ఆమె వాపోయింది. అయితే ఈ మరణాలపై తమకు అనుమానం ఉందంటూ చంద్రకిశోర్ సోదరుడు ఆరోపించారు.

Satya

Recent Posts

‘దారులున్నాయి’ మాటలో అంత అర్థముందా

పెద్ది విజయోత్సవ వేడుకలో చిరంజీవి నేషనల్ అవార్డు గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ కది రావడం రాకపోవడం అసలు సమస్యే…

2 hours ago

హత్యలు చేసే డాక్టర్… చూసినట్టు ఉందే

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మిస్తున్న 'ధర్మన్' ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యింది. దర్శకులు మారుతూ వచ్చిన ఈ…

2 hours ago

సత్యదేవ్ ఆశలన్నీ బహదూర్ మీదే

ఇంకో పది రోజుల్లో రావు బహదూర్ విడుదల కానుంది. సత్యదేవ్ ఎప్పుడూ లేనంత వైవిధ్యంగా వివిధ గెటప్స్ లో ఇందులో…

3 hours ago

గూండా ఎమోషన్ గుర్తు చేసిన మెగాస్టార్

నిన్న పెద్ది సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆకర్షణగా చిరంజీవి నిలిచారు. గతంలో తండ్రి కొడుకుల స్టేజి కలయిక…

3 hours ago

పేరు చెబితే ల‌క్ష… స‌ర్కారు బంప‌ర్ ఆఫ‌ర్‌!

ప్ర‌భుత్వాలు చేప‌ట్టే కీల‌క కార్య‌క్ర‌మాల‌కు పేర్లు సూచించే వారికి బ‌హుమానాలు ఇస్తుంటాయి. అలానే కానుక‌లు కూడా ఇస్తాయి. గ‌తంలో స్వ‌చ్ఛ…

6 hours ago

జ‌గ‌న్ నాన్చారు.. చంద్ర‌బాబు తేల్చారు: ఉద్యోగుల‌కు పండ‌గ‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్‌.. నానుస్తూ వ‌చ్చి.. చివ‌ర‌కు త‌న‌కు సాధ్యంకాద‌ని…

6 hours ago