భారత క్రికెట్ అభిమానుల హృదయాలను దడదడలాడించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్, వ్యూస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్ను జియో హాట్స్టార్లో ఏకంగా 60.2 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ఇది క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని రీతిలో సాధించిన రికార్డ్ కావడం గమనార్హం. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో 6.8 కోట్లుగా ఉన్న వ్యూస్, ఆ జట్టు చివరి ఓవర్ ఆడుతున్నప్పుడు 32.1 కోట్లకు పెరగడం విశ్లేషకులను ఆశ్చర్యపరచింది.
ఇండియా బ్యాటింగ్ ప్రారంభించిన సమయంలో 33.8 కోట్ల వ్యూస్ ఉండగా, విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసే సమయానికి 60.2 కోట్లకు చేరుకుంది. ముఖ్యంగా కోహ్లీ చివర్లో ఆడిన షాట్లు, విజయానికి మరింత దగ్గరగా తీసుకువచ్చిన ప్రతి బంతి, ప్రేక్షకుల ఉత్కంఠను పెంచడంతో వీక్షకుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. ఈ స్థాయిలో వ్యూస్ రావడం కేవలం క్రికెట్ ప్రేమ మాత్రమే కాదు, భారత్ పాక్ మ్యాచ్కు ఉన్న ప్రత్యేకతనూ చాటుతుంది.
గతంలో ఇలాంటి రికార్డు 2023 వన్డే ప్రపంచ కప్లోనే నమోదైంది. అప్పుడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ 3.5 కోట్ల వ్యూస్ సాధించింది. అంతకుముందు ఆసియా కప్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు గరిష్ఠంగా 2.8 కోట్ల మంది వీక్షకులే ఉన్నారు. కానీ ఈ సారి జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్, అన్ని రికార్డులను అధిగమించి క్రికెట్ అభిమానుల్లో అనూహ్యమైన ఉత్సాహాన్ని నింపింది.
విరాట్ కోహ్లీ తన శతకంతో ఈ మ్యాచ్ను మరింత హైలైట్ చేశాడు. 100 పరుగులు పూర్తి చేసిన తర్వాత, అతడి ప్రతి షాట్ మ్యాచ్ను భారత్ వైపుకు తిప్పింది. కోహ్లీ ఇన్నింగ్స్ మాత్రమే కాదు, హాట్స్టార్ రికార్డు కూడా అతని బ్యాటింగ్తో పుంజుకుంది. అభిమానులు కేవలం టీమిండియాకే కాదు, కోహ్లీ ఇన్నింగ్స్కు ప్రత్యేకంగా ట్యూన్ అయ్యారు. మొత్తానికి, ఈ మ్యాచ్ కేవలం ఒక విజయం మాత్రమే కాదు. 60 కోట్ల వ్యూస్ తో క్రికెట్ చరిత్రలోనే మరొక మైలురాయిగా నిలిచింది. భవిష్యత్తులో భారత్ vs పాకిస్థాన్ పోరుకు మరింత మంది వీక్షకులు ఉంటారనడంలో సందేహం లేదు.
This post was last modified on February 24, 2025 11:10 am
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…