Trends

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తోపులాట….

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మధ్య తోపులాట జరగగా… 15 మంది దాకా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

తోపులాటతో అప్రమత్తమైన అధికారులు… క్షణాల్లో రంగంలోకి దిగిపోయారు. పరిస్థితిని చక్కదిద్దే యత్నాలను ప్రారంభించారు. ఫైరింజన్లు అక్కడకి పరుగులు పెట్టాయి. ఎంత వేగంగా తోపులాట జరిగిందో… అధికార యంత్రాంగం అప్రమత్తతో అంతే వేగంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఈ ప్రమాదం గురించిన వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళా ముగింపు దగ్గరపడుతున్న క్రమంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాల కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.

ఫలితంగా అటు ప్రయాగ్ రాజ్ లోనే కాకుండా ప్రయాగ్ రాజ్ కు దారి తీసే రహదారులు, రైల్వే లైన్లు, చివరాఖరుకు ప్రయాగ్ రాజ్ కు వెళుతున్న విమాన సర్వీసులు కూడా రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు భారీ ఎత్తున జనం వచ్చారు. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లు ఆగే ఫ్లాట్ ఫామ్ లు 14, 15లపైకి జనం క్రమంగా చేరుకుంటున్నారు. చూస్తుండగానే… రెండు ప్లాట్ ఫారాలు జనంతో నిండిపోయాయి. అదే సమయంలో ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లు రద్దయ్యాయన్న వదంతులు వినిపించాయి. ఫలితంగా ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది.

ఈ క్రమంలోనే ఒకరిని మరొకరు తోసుకుంటూ… సాగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా…చాలా మంది ప్రయాణికులు కిందపడిపోయారు. వారిలో 15 మంది గాయడపడ్డారు. వీరిలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది క్షణాల్లో స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.

This post was last modified on February 15, 2025 11:59 pm

Share

Recent Posts

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

8 minutes ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

20 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

37 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

48 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

48 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 hour ago