Trends

ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తోపులాట….

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఉన్నట్టుండి కలకలం రేగింది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల మధ్య తోపులాట జరగగా… 15 మంది దాకా గాయపడ్డారు. వారందరినీ సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

తోపులాటతో అప్రమత్తమైన అధికారులు… క్షణాల్లో రంగంలోకి దిగిపోయారు. పరిస్థితిని చక్కదిద్దే యత్నాలను ప్రారంభించారు. ఫైరింజన్లు అక్కడకి పరుగులు పెట్టాయి. ఎంత వేగంగా తోపులాట జరిగిందో… అధికార యంత్రాంగం అప్రమత్తతో అంతే వేగంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఈ ప్రమాదం గురించిన వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వేదికగా మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో ప్రారంభమైన కుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. కుంభమేళా ముగింపు దగ్గరపడుతున్న క్రమంలో ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాల కోసం జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.

ఫలితంగా అటు ప్రయాగ్ రాజ్ లోనే కాకుండా ప్రయాగ్ రాజ్ కు దారి తీసే రహదారులు, రైల్వే లైన్లు, చివరాఖరుకు ప్రయాగ్ రాజ్ కు వెళుతున్న విమాన సర్వీసులు కూడా రద్దీతో కిటకిటలాడుతున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో శనివారం రాత్రి ప్రయాగ్ రాజ్ వెళ్లేందుకు న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కు భారీ ఎత్తున జనం వచ్చారు. ప్రయాగ్ రాజ్ కు వెళ్లే రైళ్లు ఆగే ఫ్లాట్ ఫామ్ లు 14, 15లపైకి జనం క్రమంగా చేరుకుంటున్నారు. చూస్తుండగానే… రెండు ప్లాట్ ఫారాలు జనంతో నిండిపోయాయి. అదే సమయంలో ప్రయాగ్ రాజ్ వెళ్లే రైళ్లు రద్దయ్యాయన్న వదంతులు వినిపించాయి. ఫలితంగా ఒక్కసారిగా ప్రయాణికుల్లో ఆందోళన పెరిగింది.

ఈ క్రమంలోనే ఒకరిని మరొకరు తోసుకుంటూ… సాగారు. ఈ క్రమంలో తోపులాట చోటుచేసుకోగా…చాలా మంది ప్రయాణికులు కిందపడిపోయారు. వారిలో 15 మంది గాయడపడ్డారు. వీరిలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది క్షణాల్లో స్పందించి పరిస్థితిని చక్కదిద్దారు.

This post was last modified on February 15, 2025 11:59 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

58 minutes ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago