సాధారణంగా భార్యా భర్త అన్నాక.. ఒకరిపై ఒకరికి ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉండాలి. మూడు ముళ్ల బంధానికి, ఏడు అడుగుల అనుబంధానికి కూడా అదేఅర్థం.. పరమార్థంగా పెద్దలు చెబుతారు. 1980లలో దిగ్గజ దర్శకుడు బాపు తీసిన `రాధా కల్యాణం` సినిమాలోనూ ఇదే చూపించారు.
పెళ్లి కానంత వరకు.. ఓ మహిళ.. లేదా పురుషుడు ఎవరినైనా ప్రేమించవచ్చు. వారితో ఒకవేళ పెళ్లికాకపోతే.. పెళ్లి అయిన వారినే ప్రేమించాలని.. జీవితాంతం వారితోనే తోడు-నీడగా గడపాలన్న అద్భుత సందేశం ఇచ్చిన సినిమా అది.
“పెళ్లి కానంత వరకు ఎవరి జీవితమైనా.. అద్దమే. దానిలో ఎన్ని ముఖాలైనా చూసుకోవచ్చు. కానీ, పెళ్లయ్యాక.. అది `పటం`గా మారుతుంది. అందులో ఒకరి ముఖమే కనిపిస్తుంది“ అనే డైలాగ్ అప్పట్లో ఫ్యామస్. అలాంటి అద్భుతమైన పెళ్లి బంధాన్ని చిత్రీకరించిన బాపు సినిమా.. ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో పేరెన్నెకగన్న సినిమా.
అయితే.. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు దీనికి మరో నిర్వచనాన్ని చెప్పుకొచ్చింది. పెళ్లి అయినప్పటికీ.. భర్తతో సంసారం చేస్తున్నప్పటికీ.. భార్య వేరే వ్యక్తిని ప్రేమించవచ్చని, అతనిపై మనసు పడవచ్చని.. ఆప్యాయతా కురిపించవచ్చని తేల్చి చెప్పింది.
అంతేకాదు.. ఈ విషయంలో తప్పుపట్టడానికి కూడా అవకాశం లేదని తెలిపింది. కానీ, సెక్స్ కార్యకలాపా లకు మాత్రం దూరంగా ఉండాలని కోర్టు పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన భార్య వేరే వారిని ప్రేమిస్తోందని.. ఆమె నుంచి విడాకులు కావాలని కోరిన భర్తకు చీవాట్లు పెట్టింది.
ఆమెకు పరిహారం ఇవ్వడంతోపాటు.. నెల నెలా భరణం కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. అంటే.. భార్య వేరే వారిని ప్రేమించినప్పటికీ.. ఆ విషయం భర్తకు తెలిసినప్పటికీ.. కామ్ గా సంసారం చేసుకోవాల్సిందేనన్ని కోర్టు తీర్పు భావం!
This post was last modified on February 15, 2025 1:21 pm
'ఫౌజీ' సినిమా నుంచి ఇప్పటిదాకా వచ్చిన పోస్టర్లు చూస్తుంటే మేకర్స్ ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభాస్ ను సాఫ్ట్…
ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు…
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన ఒక వీడియో ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది.…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అధినేత అభిజిత్ దీప్కే ఇటీవల ప్రకటించిన `పాఠశాలల అభివృద్ధి` కార్యక్రమానికి 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలే…
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశమంతా జాతీయ పతాకాన్ని ఎగరేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి లోని రాయపూడి గ్రౌండ్స్…
గత కొన్ని రోజులుగా మలయాళ కథానాయిక అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.…