ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం ఆస్తులను కేటాయించవచ్చన్న అంచనాలను తలకిందులు చేస్తూ, ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తికి భారీగా 500 కోట్ల రూపాయలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అదనపు లబ్ధిదారుడు మోహిని మోహన్ దత్తా అని తెలుస్తోంది.
మోహిని మోహన్ దత్తా పేరు టాటా గ్రూప్తో పెద్దగా సంబంధం లేకపోయినా, ఆయన రతన్ టాటాకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ట్రావెల్ వ్యాపార రంగానికి చెందిన దత్తా కుటుంబం స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీని నిర్వహించేది. ఇది 2013లో టాజ్ హోటల్స్ లో భాగమైన టాజ్ సర్వీసెస్తో విలీనం అయ్యింది. ఈ విలీనానికి ముందు, స్టాలియన్ కంపెనీలో 80% వాటా దత్తా కుటుంబానికి ఉండగా, మిగతా వాటా టాటా ఇండస్ట్రీస్కు చెందినది.
రతన్ టాటాతో ఆరు దశాబ్దాల అనుబంధం
టాటా గ్రూప్ వర్గాల సమాచారం ప్రకారం, మోహిని మోహన్ దత్తా రతన్ టాటాతో 60 ఏళ్లకు పైగా బంధాన్ని కొనసాగించిన వ్యక్తి. 1960ల్లో జంషెడ్పూర్లో జరిగిన మొదటి పరిచయం తర్వాత, ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దత్తా గతంలో రతన్ టాటా తనను వ్యక్తిగతంగా ఎలా ఆదుకున్నారో పలు సందర్భాల్లో వెల్లడించినట్లు సమాచారం. 2024 అక్టోబర్లో రతన్ టాటా అంత్యక్రియల సందర్భంగా కూడా ఆయన ఈ బంధాన్ని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే, రతన్ టాటా తన సంపదలో పెద్ద భాగాన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలకు కేటాయించారు. ఆయన సోదరీమణులు కూడా తమ వాటాను దానం చేసే అవకాశం ఉందని టాటా కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఫౌండేషన్ ద్వారా టాటా ట్రస్ట్లకు భారీగా ఆస్తులు వెళ్లే అవకాశం ఉంది.
ఈ వారసత్వ వ్యవహారం రతన్ టాటా కుటుంబ సభ్యులందరికీ ఆశ్చర్యంగా మారింది. ముఖ్యంగా మోహిని మోహన్ దత్తా పేరు చాలా మందికి అంతగా తెలిసినది కాదు. అయితే, ఆయనకు ఈ భారీ మొత్తం కేటాయించడాన్ని కుటుంబ సభ్యులు ఆత్మీయ బంధంతోనే చూడాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద, రతన్ టాటా తన సంపదను ఊహించని విధంగా పునర్వ్యవస్థీకరించడమే కాకుండా, తన నమ్మకస్తుడికి ఊహించని బహుమతిని ఇచ్చినట్లయ్యింది.
This post was last modified on February 7, 2025 4:23 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…