ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా చివరి ఉత్తర్వుల్లో అద్భుత ట్విస్ట్ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం ఆస్తులను కేటాయించవచ్చన్న అంచనాలను తలకిందులు చేస్తూ, ఒక ఆశ్చర్యకరమైన వ్యక్తికి భారీగా 500 కోట్ల రూపాయలు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అదనపు లబ్ధిదారుడు మోహిని మోహన్ దత్తా అని తెలుస్తోంది.
మోహిని మోహన్ దత్తా పేరు టాటా గ్రూప్తో పెద్దగా సంబంధం లేకపోయినా, ఆయన రతన్ టాటాకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ట్రావెల్ వ్యాపార రంగానికి చెందిన దత్తా కుటుంబం స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీని నిర్వహించేది. ఇది 2013లో టాజ్ హోటల్స్ లో భాగమైన టాజ్ సర్వీసెస్తో విలీనం అయ్యింది. ఈ విలీనానికి ముందు, స్టాలియన్ కంపెనీలో 80% వాటా దత్తా కుటుంబానికి ఉండగా, మిగతా వాటా టాటా ఇండస్ట్రీస్కు చెందినది.
రతన్ టాటాతో ఆరు దశాబ్దాల అనుబంధం
టాటా గ్రూప్ వర్గాల సమాచారం ప్రకారం, మోహిని మోహన్ దత్తా రతన్ టాటాతో 60 ఏళ్లకు పైగా బంధాన్ని కొనసాగించిన వ్యక్తి. 1960ల్లో జంషెడ్పూర్లో జరిగిన మొదటి పరిచయం తర్వాత, ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. దత్తా గతంలో రతన్ టాటా తనను వ్యక్తిగతంగా ఎలా ఆదుకున్నారో పలు సందర్భాల్లో వెల్లడించినట్లు సమాచారం. 2024 అక్టోబర్లో రతన్ టాటా అంత్యక్రియల సందర్భంగా కూడా ఆయన ఈ బంధాన్ని ప్రస్తావించారు.
ఇదిలా ఉంటే, రతన్ టాటా తన సంపదలో పెద్ద భాగాన్ని ధార్మిక, సేవా కార్యక్రమాలకు కేటాయించారు. ఆయన సోదరీమణులు కూడా తమ వాటాను దానం చేసే అవకాశం ఉందని టాటా కుటుంబ వర్గాలు చెబుతున్నాయి. టాటా ఫౌండేషన్ ద్వారా టాటా ట్రస్ట్లకు భారీగా ఆస్తులు వెళ్లే అవకాశం ఉంది.
ఈ వారసత్వ వ్యవహారం రతన్ టాటా కుటుంబ సభ్యులందరికీ ఆశ్చర్యంగా మారింది. ముఖ్యంగా మోహిని మోహన్ దత్తా పేరు చాలా మందికి అంతగా తెలిసినది కాదు. అయితే, ఆయనకు ఈ భారీ మొత్తం కేటాయించడాన్ని కుటుంబ సభ్యులు ఆత్మీయ బంధంతోనే చూడాల్సి ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం మీద, రతన్ టాటా తన సంపదను ఊహించని విధంగా పునర్వ్యవస్థీకరించడమే కాకుండా, తన నమ్మకస్తుడికి ఊహించని బహుమతిని ఇచ్చినట్లయ్యింది.
This post was last modified on February 7, 2025 4:23 pm
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన సల్మాన్ ఖాన్.. నిఖార్సయిన హిట్టు ఎప్పుడు కొట్టాడో తన వీరాభిమానులు కూడా మరిచిపోయిన పరిస్థితి. దశాబ్దం…
సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనలతో యువతను వలలో వేసుకునే హనీట్రాప్ యాప్స్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి సీ సజ్జనార్…
దురంధర్ ది రివెంజ్ రూట్ క్లియరైపోయింది. సెన్సార్ ఆలస్యమంటూ ఉదయం నుంచి తిరుగుతున్న వార్తలకు చెక్ పడింది. 1 నిమిషం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఇంకో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమాకు రెండు…
ఎల్లుండి విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మీద దర్శకుడు హరీష్ శంకర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో చూస్తున్నాం.…
నిన్న విశ్వనాథ్ అండ్ సన్స్ టీజర్ వచ్చేసింది. దాపరికం లేకుండా స్టోరీ ఏంటో నిమిషంన్నరలోనే చెప్పేశారు. కొన్ని ఎలిమెంట్స్ దాచి…