ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని కొన్ని అయితే.. ఇప్పటికే ఆ సేవలను అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదిలావుంటే.. నిన్న మొన్నటి వరకు చాట్ జీపీటీ అందరికీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. దీనిని కొన్నాళ్లుగా వినియోగిస్తున్నారు కూడా. అయితే.. దీనికి పోటీగా చైనా తీసుకువచ్చిన డీప్-సీక్ ఇప్పుడు మరింత దుమారం రేపుతోంది.
డీప్ సీక్ను చాలా దేశాలు బ్యాన్ చేశాయి. ప్రభుత్వ, వ్యక్తిగత డేటా వంటివి డీప్ సీక్ ద్వారా చోరీకి గురవు తున్నాయన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. డీప్ సీక్ ద్వారా తమ రహస్యాలు కూడా బహిర్గతం అవు తున్నాయన్న ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలోనే డీప్సీక్పై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. తమ ప్రజలను వాడొద్దని కోరాయి. అదేవిధంగా చాట్ జీపీటీ కూడా ఇలాంటి ఆంక్షలనే ఎదుర్కొంటోంది.
ఇక, తాజాగా భారత ప్రభుత్వం కూడా.. చాట్ జీపీటీ సహా డీక్ సీక్లపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశిం చింది. ముక్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక శాఖ వ్యవహారాల్లో పనిచేసేవారు.. రక్షణ రంగానికి చెంది న సంస్థల్లో పనిచేసేవారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అంతేకాదు.. ఆర్థిక శాఖలో అయి తే.. అసలు చాట్ జీపీటీ, డీప్ సీక్లను కడు దూరంలో ఉంచాలని పేర్కొంది. దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని.. తదుపరి నిర్ణయం వెలువడే వరకు చాట్ జీపీటీ, డీప్ సీక్లకు దూరంగా ఉండాలనిస్పష్టం చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.
గాయని సునీత అంటే తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. చిత్ర, జానకి లాంటి సీనియర్ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న టైంలో…
కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళన దాదాపు ఖరారైన నేపథ్యంలో ఏపీ నుంచి మరో ఇద్దరు ఎంపీలకు మంత్రి యోగం పట్టనుందని టీడీపీ…
కెరీర్లో ఒక దశ వరకు మామూలు మాస్ మసాలా సినిమాలే తీశాడు రాజమౌళి. మగధీర నుంచి ఆయనలోని మరో కోణం…
సోషల్ మీడియాలో హడావిడి తగ్గింది కానీ వీక్ డేస్ లో కూడా మా ఇంటి బంగారంకు మంచి ఆక్యుపెన్సీలు నమోదవుతున్నాయి.…
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒక ఊహించని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఏప్రిల్…
కొన్ని డిజాస్టర్లు ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంటాయి. అందులో పనిచేసిన వాళ్లందరినీ జీవిత కాల చేదు జ్ఞాపకాలుగా మారిపోతుంటాయి. ఆ సినిమాల…