ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37 బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్లో మొత్తం 54 బంతుల్లో 135 పరుగులు చేసి, 13 సిక్సర్లు, 10 బౌండరీలు బాదాడు. తొలి అర్ధశతకాన్ని 17 బంతుల్లో పూర్తి చేసిన అభిషేక్, ఆపై మరింత వేగాన్ని పెంచి మరో 50 పరుగులకు కేవలం 20 బంతులే తీసుకున్నాడు. అతని అద్భుత బ్యాటింగ్ను చూసి స్టేడియం ఉర్రూతలూగిపోయింది.
మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను ఆస్వాదిస్తూ, అతడు అర్ధశతకాన్ని పూర్తిచేసిన క్షణంలో నిల్చుని చప్పట్లు కొట్టారు. అంబానీ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిషేక్ ప్రదర్శనపై క్రికెట్ అభిమానులు సైతం అద్భుతమైన రిప్లైలు ఇస్తూ, అతని దూకుడు భారత్కు కొత్త మ్యాచ్ విన్నర్ ను అందించిందని ప్రశంసిస్తున్నారు.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లండ్కు 248 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో ఇంగ్లండ్ పూర్తిగా తేలిపోయింది. టీమిండియా బౌలర్ల దెబ్బకు 97 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది.
అభిషేక్ శర్మ ఇన్నింగ్స్, ముకేశ్ అంబానీ స్పందన కలిపి మ్యాచ్ను మరింత ప్రత్యేకంగా మార్చాయి. అభిమానులు ఇప్పుడు అభిషేక్ శర్మను భారత క్రికెట్ భవిష్యత్తుగా చూస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఈ యువ క్రికెటర్ ఏ రేంజ్ లో రికార్డులను బ్రేక్ చేస్తాడో చూడాలి.
This post was last modified on February 3, 2025 12:13 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…