Trends

హైదరాబాద్ లో 9 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాని పరిస్థితి. ఇంటికి అండగా ఉన్న తల్లి అనూహ్యంగా కాలం చేయటంతో.. దిక్కుతోచని ఇద్దరు కుమార్తెలు ఎవరికి చెప్పకుండా.. ఏం చేయాలో తోచక 9 రోజులుగా ఇంట్లోనే ఉంచేసిన పరిస్థితి. చివరకు శుక్రవారం బయటకు వచ్చిన వారు.. ఇరుగుపొరుగుకు చెప్పటంతో.. వారు స్థానిక ఎమ్మెల్యే వద్దకు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసిన విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పని చేసే రాజుతో లలితకు పెళ్లైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. మనస్పర్థలతో 2020లో రాజు ఎటో వెళ్లిపోయారు. తన తల్లి అండతో లలిత కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. పెద్దమ్మాయి రవళిక (24) ఒక క్లాత్ షాపులో పని చేస్తుండగా.. చిన్నమ్మాయి యశ్విత (22) ఈవెంట్ సంస్థలో పని చేస్తోంది.

ఆర్నెల్ల క్రితం ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్ కు అద్దెకు మారారు. ఇటీవల లలిత తల్లి మరణించింది. ఆమె మరణంతో లలిత మానసికంగా కుంగిపోయింది. మూడు నెలలుగా అద్దె చెల్లించలేకపోవటం.. జనవరి 21న ఇంటిని ఖాళీ చేస్తామని యజమానికి గడువు కోరారు. ఈ క్రమంలో జనవరి 22న రాత్రి వేళ నిద్రలోనే ఆమె కన్నుమూసింది. తల్లి మరణించటంతో కుంగుబాటుకు గురైన వారు.. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవటంతో తీవ్ర ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకోవటానికి పదునైన వస్తువులతో ఇద్దరు గొంతు.. మణికట్టుపై కోసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. స్ప్రహ కోల్పోయిన వారు మూడు రోజులు అలానే ఉండిపోయినట్లుగా చెబుతున్నారు. తిరిగి స్ప్రహలోకి వచ్చిన తర్వాత.. డెడ్ బాడీని ఒక గదిలో ఉంచి.. మరో గదిలో వారు ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి. ఇంటి నుంచి దుర్వాసన రావటంతో.. శుక్రవారం భరించలేని పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు.. తల్లి చనిపోయిందన్న విషయాన్ని తెలియజేశారు.

దీంతో.. ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం వెళ్లటంతో వారు ఇంటికి వచ్చి.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న లలిత డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ రాగా.. కుమార్తెల వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. అయితే.. వారు గొంతు.. చేయి కోసుకోవటంతో రక్తం కిందపడటంతో డాగ్ స్వ్కాడ్ పొరపాటు పడి ఉంటాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శవపరీక్ష తర్వాత.. మరణానికి కారణం తెలుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. లలిత సోదరుడు అంబర్ పేటలో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నారు. అంత్యక్రియలకార్యక్రమాన్ని చూడాల్సిందిగా లలిత సోదరుడికి పోలీసులు సూచించినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మిగిలిన విషయాలు తెలిసే వీలుంది. ఇక.. ఇద్దరు కుమార్తెలు పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లుగా సమాచారం. దీంతో.. అనుమానాస్పద మ్రతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

This post was last modified on February 1, 2025 11:26 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

6 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

7 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

9 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

9 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago