Trends

హైదరాబాద్ లో 9 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాని పరిస్థితి. ఇంటికి అండగా ఉన్న తల్లి అనూహ్యంగా కాలం చేయటంతో.. దిక్కుతోచని ఇద్దరు కుమార్తెలు ఎవరికి చెప్పకుండా.. ఏం చేయాలో తోచక 9 రోజులుగా ఇంట్లోనే ఉంచేసిన పరిస్థితి. చివరకు శుక్రవారం బయటకు వచ్చిన వారు.. ఇరుగుపొరుగుకు చెప్పటంతో.. వారు స్థానిక ఎమ్మెల్యే వద్దకు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది.

హైదరాబాద్ లోని సికింద్రాబాద్ బౌద్ధ నగర్ లో ఆలస్యంగా వెలుగు చూసిన విషాద ఉదంతంగా దీన్ని చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పని చేసే రాజుతో లలితకు పెళ్లైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. మనస్పర్థలతో 2020లో రాజు ఎటో వెళ్లిపోయారు. తన తల్లి అండతో లలిత కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. పెద్దమ్మాయి రవళిక (24) ఒక క్లాత్ షాపులో పని చేస్తుండగా.. చిన్నమ్మాయి యశ్విత (22) ఈవెంట్ సంస్థలో పని చేస్తోంది.

ఆర్నెల్ల క్రితం ఓయూ ప్రాంతం నుంచి బౌద్ధనగర్ కు అద్దెకు మారారు. ఇటీవల లలిత తల్లి మరణించింది. ఆమె మరణంతో లలిత మానసికంగా కుంగిపోయింది. మూడు నెలలుగా అద్దె చెల్లించలేకపోవటం.. జనవరి 21న ఇంటిని ఖాళీ చేస్తామని యజమానికి గడువు కోరారు. ఈ క్రమంలో జనవరి 22న రాత్రి వేళ నిద్రలోనే ఆమె కన్నుమూసింది. తల్లి మరణించటంతో కుంగుబాటుకు గురైన వారు.. అంత్యక్రియలకు డబ్బుల్లేకపోవటంతో తీవ్ర ఆవేదన చెందినట్లుగా తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకోవటానికి పదునైన వస్తువులతో ఇద్దరు గొంతు.. మణికట్టుపై కోసుకున్నట్లుగా తెలుస్తోంది. దీంతో.. స్ప్రహ కోల్పోయిన వారు మూడు రోజులు అలానే ఉండిపోయినట్లుగా చెబుతున్నారు. తిరిగి స్ప్రహలోకి వచ్చిన తర్వాత.. డెడ్ బాడీని ఒక గదిలో ఉంచి.. మరో గదిలో వారు ఉంటున్నారు. ఇంట్లో నుంచి బయటకు రాని పరిస్థితి. ఇంటి నుంచి దుర్వాసన రావటంతో.. శుక్రవారం భరించలేని పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చిన వారు.. తల్లి చనిపోయిందన్న విషయాన్ని తెలియజేశారు.

దీంతో.. ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి పోలీసులకు సమాచారం వెళ్లటంతో వారు ఇంటికి వచ్చి.. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న లలిత డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్ రాగా.. కుమార్తెల వద్దకు వచ్చి ఆగినట్లుగా తెలుస్తోంది. అయితే.. వారు గొంతు.. చేయి కోసుకోవటంతో రక్తం కిందపడటంతో డాగ్ స్వ్కాడ్ పొరపాటు పడి ఉంటాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

శవపరీక్ష తర్వాత.. మరణానికి కారణం తెలుస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. లలిత సోదరుడు అంబర్ పేటలో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నారు. అంత్యక్రియలకార్యక్రమాన్ని చూడాల్సిందిగా లలిత సోదరుడికి పోలీసులు సూచించినట్లుగా తెలుస్తోంది. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మిగిలిన విషయాలు తెలిసే వీలుంది. ఇక.. ఇద్దరు కుమార్తెలు పోలీసులు అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లుగా సమాచారం. దీంతో.. అనుమానాస్పద మ్రతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

This post was last modified on February 1, 2025 11:26 am

Share

Recent Posts

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

51 minutes ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

55 minutes ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

2 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

2 hours ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

3 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

4 hours ago