Trends

రంజీ ట్రోఫీలో కోహ్లి.. ఫ్రీ ఎంట్రీతో భయానక పరిస్థితి

కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ కనిపించినా కూడా ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు ఎగబడతారు. ఇక కోహ్లీ మ్యాచ్ ఫ్రీగా చూసే అవకాశం వస్తే ఎవరు కూడా వెనక్కి తగ్గరు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంకు కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కేవలం ఆధార్ కార్డు చూపించి స్టేడియంలో మ్యాచ్ చూడవచ్చని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు.

దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీలో తిరిగి అడుగుపెట్టాడు. గురువారం నుంచి రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లిని చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. కోహ్లి రీఎంట్రీతో స్టేడియం సందడి మరింత పెరిగింది. స్టేడియం బయట నుంచే అభిమానుల అరుపులు, రణగొణధ్వనులతో ఒక ఊహించని వాతావరణం ఏర్పడింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నినాదాలు మార్మోగిపోయాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ కోహ్లికి గట్టిగా జైకొట్టారు. కోహ్లిని చూడటానికి అరుణ్ జైట్లీ స్టేడియం ముందు అభిమానులు ఉదయాన్నే క్యూ కట్టారు. మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందే స్టేడియం ముందు రెండు కిలోమీటర్ల మేర జనసందోహం కదిలింది.

క్యూలైన్ పెరిగిపోవడంతో గేట్లు తెరవగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్వల్పంగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వారిని అప్రమత్తంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళంలో ఓ పోలీస్ బైక్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అభిమానుల రద్దీకి ముందుగానే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ భద్రతను పెంచింది. స్టేడియంలో ఎంట్రీకి కేవలం మూడు గేట్లు మాత్రమే తెరిచారు.

గేట్లు తెరవగానే కోహ్లిని చూడాలని అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది కూడా అభిమానులను కంట్రోల్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భద్రత విషయంలో కాస్త పట్టు తప్పినా పెద్ద ప్రమాదమే జరిగేది అని పలువురు అభిమానులు చెబుతున్నారు. ఇక కోహ్లి రీఎంట్రీపై క్రికెట్ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించని కోహ్లి రంజీలో ఎలా ఆడతాడన్నది హాట్ టాపిక్ అయ్యింది.

This post was last modified on January 30, 2025 1:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago