Trends

రంజీ ట్రోఫీలో కోహ్లి.. ఫ్రీ ఎంట్రీతో భయానక పరిస్థితి

కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ కనిపించినా కూడా ఫ్యాన్స్ అతన్ని చూసేందుకు ఎగబడతారు. ఇక కోహ్లీ మ్యాచ్ ఫ్రీగా చూసే అవకాశం వస్తే ఎవరు కూడా వెనక్కి తగ్గరు. ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంకు కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడేందుకు రావడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పడింది. కేవలం ఆధార్ కార్డు చూపించి స్టేడియంలో మ్యాచ్ చూడవచ్చని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఆఫర్ ఇచ్చింది. దీంతో జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు.

దాదాపు పన్నెండేళ్ల గ్యాప్ అనంతరం విరాట్ కోహ్లి రంజీ ట్రోఫీలో తిరిగి అడుగుపెట్టాడు. గురువారం నుంచి రైల్వేస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున బరిలోకి దిగిన కోహ్లిని చూడటానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. కోహ్లి రీఎంట్రీతో స్టేడియం సందడి మరింత పెరిగింది. స్టేడియం బయట నుంచే అభిమానుల అరుపులు, రణగొణధ్వనులతో ఒక ఊహించని వాతావరణం ఏర్పడింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నినాదాలు మార్మోగిపోయాయి. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ కోహ్లికి గట్టిగా జైకొట్టారు. కోహ్లిని చూడటానికి అరుణ్ జైట్లీ స్టేడియం ముందు అభిమానులు ఉదయాన్నే క్యూ కట్టారు. మ్యాచ్ ప్రారంభానికి గంటల ముందే స్టేడియం ముందు రెండు కిలోమీటర్ల మేర జనసందోహం కదిలింది.

క్యూలైన్ పెరిగిపోవడంతో గేట్లు తెరవగానే ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులు స్వల్పంగా గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వారిని అప్రమత్తంగా బయటకు తీసుకెళ్లారు. ఈ గందరగోళంలో ఓ పోలీస్ బైక్ ధ్వంసమైనట్లు తెలుస్తోంది. అభిమానుల రద్దీకి ముందుగానే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ భద్రతను పెంచింది. స్టేడియంలో ఎంట్రీకి కేవలం మూడు గేట్లు మాత్రమే తెరిచారు.

గేట్లు తెరవగానే కోహ్లిని చూడాలని అభిమానులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది కూడా అభిమానులను కంట్రోల్ చేయడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. భద్రత విషయంలో కాస్త పట్టు తప్పినా పెద్ద ప్రమాదమే జరిగేది అని పలువురు అభిమానులు చెబుతున్నారు. ఇక కోహ్లి రీఎంట్రీపై క్రికెట్ ప్రేమికుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇటీవల అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించని కోహ్లి రంజీలో ఎలా ఆడతాడన్నది హాట్ టాపిక్ అయ్యింది.

This post was last modified on January 30, 2025 1:45 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

32 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

41 minutes ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

5 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

5 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

6 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

6 hours ago