Trends

ఏఐకి బానిసలు కాకండి: ముఖేష్ అంబానీ

చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్‌సీక్’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బిలియన్స్ ఖర్చుతో కూడుకున్న ఏఐ టెక్నాలజీని డీప్ సీక్ పేరుతో చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ 6 మిలియన్స్ డాలర్ల ఖర్చుతో మాత్రమే ప్రపంచం ముందు పెట్టాడు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు చైనా వైపు చూస్తోంది.

ట్రంప్ లాంటి దిగ్గజాలు కూడా ఈ టెక్నాలజీ విషయంలో అలెర్ట్ గా ఉండాలి అంటూ తన అభిప్రాయాన్ని ఓపెన్ గా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మారుతున్న AI టెక్నాలజీపై అంబానీ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం కూడా తన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని, ప్రత్యేకించి యువత దీని వైపు దృష్టి పెట్టాలని అంబానీ అభిప్రాయపడ్డారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోను AI కి మాత్రం బానిసగా మరవద్దు అని సూటిగా వివరణ ఇచ్చారు. గుజరాత్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అయితే, సొంత తెలివితేటలను మరవరాదని చెప్పారు. AI ఆధారంగా ఎదిగే తరం, స్వతంత్ర ఆలోచనలను వదులుకోకుండా ముందుకు సాగాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

అంబానీ మాట్లాడుతూ, “AI సాధనంగా ఉపయోగపడుతుందని అంగీకరిస్తున్నాను. కానీ, మన మేధస్సును ఉపయోగించుకోవడం మరచిపోవద్దు. మీరు కాలేజీ పూర్తి చేసుకున్న తర్వాత నిజమైన జీవిత పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. అక్కడ ఉపాధ్యాయులు ఉండరు, మీరు నేర్చుకునేది మీ స్వంత అనుభవాల ద్వారా మాత్రమే” అని పేర్కొన్నారు. ఆయన ప్రకటనలు ప్రస్తుతం AIపై జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా చర్చలకు సంబంధించి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడిన అంబానీ, 21వ శతాబ్దం ముగిసే నాటికి దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే భారత్‌ను ఏ శక్తి కూడా అడ్డుకోలేదని స్పష్టంగా తెలియజేశారు. AI సహాయంతో భారతదేశ యువత కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని, అందులో భారతదేశం నాయకత్వం వహించాలని తన ఆశయాన్ని తెలియజేశారు.

This post was last modified on January 30, 2025 1:14 pm

Share

Recent Posts

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

51 minutes ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

1 hour ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

2 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

2 hours ago

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

2 hours ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

4 hours ago