Trends

ఏఐకి బానిసలు కాకండి: ముఖేష్ అంబానీ

చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్‌సీక్’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బిలియన్స్ ఖర్చుతో కూడుకున్న ఏఐ టెక్నాలజీని డీప్ సీక్ పేరుతో చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ 6 మిలియన్స్ డాలర్ల ఖర్చుతో మాత్రమే ప్రపంచం ముందు పెట్టాడు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు చైనా వైపు చూస్తోంది.

ట్రంప్ లాంటి దిగ్గజాలు కూడా ఈ టెక్నాలజీ విషయంలో అలెర్ట్ గా ఉండాలి అంటూ తన అభిప్రాయాన్ని ఓపెన్ గా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మారుతున్న AI టెక్నాలజీపై అంబానీ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం కూడా తన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని, ప్రత్యేకించి యువత దీని వైపు దృష్టి పెట్టాలని అంబానీ అభిప్రాయపడ్డారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోను AI కి మాత్రం బానిసగా మరవద్దు అని సూటిగా వివరణ ఇచ్చారు. గుజరాత్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అయితే, సొంత తెలివితేటలను మరవరాదని చెప్పారు. AI ఆధారంగా ఎదిగే తరం, స్వతంత్ర ఆలోచనలను వదులుకోకుండా ముందుకు సాగాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

అంబానీ మాట్లాడుతూ, “AI సాధనంగా ఉపయోగపడుతుందని అంగీకరిస్తున్నాను. కానీ, మన మేధస్సును ఉపయోగించుకోవడం మరచిపోవద్దు. మీరు కాలేజీ పూర్తి చేసుకున్న తర్వాత నిజమైన జీవిత పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. అక్కడ ఉపాధ్యాయులు ఉండరు, మీరు నేర్చుకునేది మీ స్వంత అనుభవాల ద్వారా మాత్రమే” అని పేర్కొన్నారు. ఆయన ప్రకటనలు ప్రస్తుతం AIపై జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా చర్చలకు సంబంధించి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడిన అంబానీ, 21వ శతాబ్దం ముగిసే నాటికి దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే భారత్‌ను ఏ శక్తి కూడా అడ్డుకోలేదని స్పష్టంగా తెలియజేశారు. AI సహాయంతో భారతదేశ యువత కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని, అందులో భారతదేశం నాయకత్వం వహించాలని తన ఆశయాన్ని తెలియజేశారు.

This post was last modified on January 30, 2025 1:14 pm

Share

Recent Posts

బ్రేకప్ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్లేనా?

క‌థానాయిక‌గా మ‌ల‌యాళంలో ప‌రిచ‌యం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవ‌కాశాలు అందుకున్న అమ్మాయి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్. ఆమె కెరీర్లో ఎక్కువ…

4 hours ago

ఎయిర్ పోర్టు లేకపోతే పిల్లనివ్వరా..?

వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…

4 hours ago

శర్వానంద్ రిలీజులకు కొత్త చిక్కుముడి

శర్వానంద్ ఈ ఏడాది నాలుగు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు ఇచ్చాడు. నారి నారి నడుమ మురారి విపరీతమైన…

5 hours ago

ఊర్మిళను పెళ్లాడిన వర్మ?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ పతాక స్థాయిలో ఉన్నపుడు ఆయనకు, కథానాయికలకు మధ్య లింకులు పెడుతూ అనేక వార్తలు వచ్చాయి. అందులో ఎక్కువ చర్చనీయాంశం…

5 hours ago

భోగాపురం క్రెడిట్ కోసం వైసీపీ తంటాలు…

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఏపీ ప్ర‌జ‌లు థ్యాంక్స్ చెబుతున్నారంటూ.. ఆ పార్టీ సోష‌ల్ మీడియా ఊద‌ర గొడుతోంది. అంతేకాదు.. గ‌త…

5 hours ago

స్పైడర్ మ్యాన్ సక్సెస్… ఏ పాఠం నేర్చుకోవాలి

సూపర్ స్టార్ కృష్ణ సోదరులు, సీనియర్ నిర్మాత ఆదిశేషగిరిరావు ఇవాళ జరిగిన శ్రీనివాస మంగాపురం ఈవెంట్ లో ఒక మాట…

6 hours ago