Trends

ఏఐకి బానిసలు కాకండి: ముఖేష్ అంబానీ

చైనా రూపొందించిన కొత్త AI మోడల్ ‘డీప్‌సీక్’ పెనుగుండంగా మారిన సమయంలో ప్రముఖులు చేస్తున్న కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. బిలియన్స్ ఖర్చుతో కూడుకున్న ఏఐ టెక్నాలజీని డీప్ సీక్ పేరుతో చైనాకు చెందిన లియాంగ్ వెన్ఫెంగ్ 6 మిలియన్స్ డాలర్ల ఖర్చుతో మాత్రమే ప్రపంచం ముందు పెట్టాడు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, AI విభాగంలో చైనా ముందుకు దూసుకెళ్లడం గమనార్హం. దీంతో వరల్డ్ మొత్తం కూడా ఇప్పుడు చైనా వైపు చూస్తోంది.

ట్రంప్ లాంటి దిగ్గజాలు కూడా ఈ టెక్నాలజీ విషయంలో అలెర్ట్ గా ఉండాలి అంటూ తన అభిప్రాయాన్ని ఓపెన్ గా వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మారుతున్న AI టెక్నాలజీపై అంబానీ కూడా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం కూడా తన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలని, ప్రత్యేకించి యువత దీని వైపు దృష్టి పెట్టాలని అంబానీ అభిప్రాయపడ్డారు.

అయితే ఎట్టి పరిస్థితుల్లోను AI కి మాత్రం బానిసగా మరవద్దు అని సూటిగా వివరణ ఇచ్చారు. గుజరాత్‌లోని పండిట్ దీన్ దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ (PDEU) స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అయితే, సొంత తెలివితేటలను మరవరాదని చెప్పారు. AI ఆధారంగా ఎదిగే తరం, స్వతంత్ర ఆలోచనలను వదులుకోకుండా ముందుకు సాగాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.

అంబానీ మాట్లాడుతూ, “AI సాధనంగా ఉపయోగపడుతుందని అంగీకరిస్తున్నాను. కానీ, మన మేధస్సును ఉపయోగించుకోవడం మరచిపోవద్దు. మీరు కాలేజీ పూర్తి చేసుకున్న తర్వాత నిజమైన జీవిత పాఠశాలలో అడుగు పెట్టనున్నారు. అక్కడ ఉపాధ్యాయులు ఉండరు, మీరు నేర్చుకునేది మీ స్వంత అనుభవాల ద్వారా మాత్రమే” అని పేర్కొన్నారు. ఆయన ప్రకటనలు ప్రస్తుతం AIపై జరుగుతున్న ప్రపంచవ్యాప్తంగా చర్చలకు సంబంధించి మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

భారతదేశ భవిష్యత్తు గురించి మాట్లాడిన అంబానీ, 21వ శతాబ్దం ముగిసే నాటికి దేశం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే భారత్‌ను ఏ శక్తి కూడా అడ్డుకోలేదని స్పష్టంగా తెలియజేశారు. AI సహాయంతో భారతదేశ యువత కొత్త అవకాశాలను సృష్టించుకోవాలని, అందులో భారతదేశం నాయకత్వం వహించాలని తన ఆశయాన్ని తెలియజేశారు.

This post was last modified on January 30, 2025 1:14 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ధనుష్‌కు మాత్రం ఎలా సాధ్యం?

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…

1 hour ago

ఆవిడ వల్లే ఎన్టీఆర్‌కు భారత రత్న రావట్లేదా?

టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…

3 hours ago

పిఠాపురం ఫ్లెక్సీల రగడ… వర్మదే తప్పన్న బాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…

3 hours ago

సినిమా చేయనందుకు హీరో 10 కోట్ల పరిహారం

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడైనా హీరోల ఆధిపత్యమే నడుస్తుంటుంది. దర్శక నిర్మాతలు వాళ్ల మాటను అనుసరించే నడుచుకోవాల్సి ఉంటుంది. హీరోలు మాట తప్పినా..…

4 hours ago

IPL: ఛాన్స్ మిస్ చేసుకుంటున్న పెద్ది

ఒక పాట థియేటర్లలో కంటే బయట ఎంతలా వినిపిస్తుందనే దానిపైనే ఆ సినిమా క్రేజ్ ఆధారపడి ఉంటుంది. తాజాగా ఉప్పల్…

4 hours ago

ఈ నలుగురు కొడితే 10 వేల కోట్లా?

తెలుగు సినిమా మార్కెట్ ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా విస్తరించింది. ఒకప్పుడు వందల కోట్లతో ముగిసిపోయే లెక్కలు, ఇప్పుడు వేల…

5 hours ago