Trends

‘పద్మ’ పురస్కారాలను అందుకోనున్న తెలుగువారు వీరే…

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి పద్మ అవార్డులను కేంద్ర ప్రభత్వం ప్రకటించిది. ఈ మేరకు శనివారం రాత్రి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో భారత రత్న తర్వాత అతున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తున్న పద్మ విభూషణ్ అవార్డులకు తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరు నాగేశ్వరరెడ్డితో పాటు మరో ఆరుగురు ఎంపికయ్యారు.

ఇక నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించింది. కళల రంగంలో బాలయ్యకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బాలయ్యతో పాటు తమిళ స్టార్ హీరో అజిత్ కు కూడా కేంద్రం పద్మ భూషణ్ అవాడ్డును ప్రకటించింది. వీరిద్దరితో పాటుగా వివిధ రంగాలకు చెందిన మరో 17 మందికి కేంద్రం పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. ఇక పద్మశ్రీ విభాగంలో ఏకంగా 113 మందికి అవార్డులను ప్రకటిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

పద్మ శ్రీ అవార్డుల గ్రహీతల్లో ఏపీకి చెందిన మాడుగుల నాగఫణి శర్మ ఉన్నారు. కళల రంగంలో శర్మ అవార్డుకు ఎంపిక కాగా.. ఇదే విభాగంలో ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకూ అవార్డు దక్కింది.. సాహిత్యం, విద్య విభాగంలో ఏపీకి చెందిన కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మ పురస్కారాలు దక్కాయి.

ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకూ పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణ కోటాలో ఈయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

This post was last modified on January 25, 2025 10:07 pm

Share

Recent Posts

హాలీవుడ్ సినిమాలకు మళ్ళీ మంచి రోజులు

ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…

2 hours ago

గండాన్ని దాటిన చెన్నై లవ్ స్టోరీ

గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…

2 hours ago

మోదీ కాళ్లు కడిగి ఆ నీళ్లు తాగాలని ఉంది: నటుడు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…

3 hours ago

కనకరాజు సీమలో కొరియన్ దెయ్యం

బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…

3 hours ago

“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…

4 hours ago

దేశం కోసం కష్టపడే ప్రధాని మోదీపై విమర్శలా

జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…

4 hours ago