Trends

‘పద్మ’ పురస్కారాలను అందుకోనున్న తెలుగువారు వీరే…

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయా రంగాల్లో విశేష ప్రతిభ కనబరచిన వారికి పద్మ అవార్డులను కేంద్ర ప్రభత్వం ప్రకటించిది. ఈ మేరకు శనివారం రాత్రి పద్మ అవార్డుల గ్రహీతల పేర్లను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో భారత రత్న తర్వాత అతున్నత పౌర పురస్కారంగా పరిగణిస్తున్న పద్మ విభూషణ్ అవార్డులకు తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు దువ్వూరు నాగేశ్వరరెడ్డితో పాటు మరో ఆరుగురు ఎంపికయ్యారు.

ఇక నందమూరి నటసింహం, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను కేంద్రం పద్మ భూషణ్ అవార్డుతో గౌరవించింది. కళల రంగంలో బాలయ్యకు ఈ అవార్డును ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బాలయ్యతో పాటు తమిళ స్టార్ హీరో అజిత్ కు కూడా కేంద్రం పద్మ భూషణ్ అవాడ్డును ప్రకటించింది. వీరిద్దరితో పాటుగా వివిధ రంగాలకు చెందిన మరో 17 మందికి కేంద్రం పద్మ భూషణ్ అవార్డులను ప్రకటించింది. ఇక పద్మశ్రీ విభాగంలో ఏకంగా 113 మందికి అవార్డులను ప్రకటిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

పద్మ శ్రీ అవార్డుల గ్రహీతల్లో ఏపీకి చెందిన మాడుగుల నాగఫణి శర్మ ఉన్నారు. కళల రంగంలో శర్మ అవార్డుకు ఎంపిక కాగా.. ఇదే విభాగంలో ఏపీకి చెందిన మిరియాల అప్పారావుకూ అవార్డు దక్కింది.. సాహిత్యం, విద్య విభాగంలో ఏపీకి చెందిన కేఎల్ కృష్ణ, వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మ పురస్కారాలు దక్కాయి.

ఇక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగకూ పద్మశ్రీ పురస్కారం దక్కింది. తెలంగాణ కోటాలో ఈయనకు పద్మశ్రీ అవార్డు దక్కింది.

This post was last modified on January 25, 2025 10:07 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

18 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago