రోడ్ల మీద జనాలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో చూడటానికి సింగపూర్లో రోడ్ల మీద పోలీస్ రోబో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఈ ఉదయం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విట్టర్లో షేర్ చేశాడు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రోబోల సాయం తీసుకుంటున్నాయి.
ఈ సమయంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో కరోనా పేషెంట్ల సేవల కోసం రోబోల్ని ఉపయోగిస్తున్నాయి పలు దేశాయి. ఈ కోవలోనే మన దగ్గరా రోబో సేవలు మొదలయ్యాయి. అది తెలుగు గడ్డ మీదే కావడం విశేషం.
ఆంద్రప్రదేశ్లోని నెల్లూరులో కరోనా పేషెంట్ల సేవలకు గాను రోబోల సాయం తీసుకుంటున్నారు వైద్యులు. కరోనా పేషెంట్లకు చికిత్స చేసే క్రమంలో వైద్యులు, వారికి సేవలందించేటపుడు నర్సులు, ఇతర సహాయ సిబ్బంది ఎంతగా రక్షణ చర్యలు పాటించినప్పటికీ వాళ్లు కూడా వైరస్ బారిన పడుతున్నారు.
వారికి ఈ రకమైన ముప్పు తగ్గించేందుకు గాను నెల్లూరులో రోబో సేవలు ప్రవేశ పెట్టారు. నెల్లూరులోని రీజనల్ కోవిడ్ సెంటర్లో ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మందులు, ఆహార పదార్థాల్ని నెల్వార్ట్ అనే రోబోనే అందజేస్తోంది.
నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను రూపొందించారు. కోవిడ్పై పోరాడుతున్న వైద్యులకు ఈ రోబోను అందజేశారు. ఈ సందర్భంగా రోబో పని తీరుపై డెమో కూడా ఇచ్చారు. ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని కరోనా రోగులకు ఈ రోబో సరఫరా చేస్తుందని తెలిపారు.
త్వరలోనే ఇంకో రెండు రోబోలు తయారు చేసి వాటిని నెల్లూరు జిల్లాలోని మిగతా కోవిడ్ ఆసుపత్రులకు అందజేస్తామని ఈ సంస్థ తెలియజేసింది. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని ఈ రోబో పనితీరును గమనించి తయారీదారుల్ని అభినందించారు. ఆసుపత్రిలో జనాలు ఈ రోబో పనితీరును ఆసక్తిగా గమనిస్తున్నారు.
This post was last modified on April 29, 2020 2:42 pm
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…
బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…
సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం(రేపు)తో ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో చివరి రెండో రోజైన గురువారం రాజకీయ వేడి లోక్సభను కుదిపేసింది.…
రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…