రోడ్ల మీద జనాలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో చూడటానికి సింగపూర్లో రోడ్ల మీద పోలీస్ రోబో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఈ ఉదయం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విట్టర్లో షేర్ చేశాడు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రోబోల సాయం తీసుకుంటున్నాయి.
ఈ సమయంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో కరోనా పేషెంట్ల సేవల కోసం రోబోల్ని ఉపయోగిస్తున్నాయి పలు దేశాయి. ఈ కోవలోనే మన దగ్గరా రోబో సేవలు మొదలయ్యాయి. అది తెలుగు గడ్డ మీదే కావడం విశేషం.
ఆంద్రప్రదేశ్లోని నెల్లూరులో కరోనా పేషెంట్ల సేవలకు గాను రోబోల సాయం తీసుకుంటున్నారు వైద్యులు. కరోనా పేషెంట్లకు చికిత్స చేసే క్రమంలో వైద్యులు, వారికి సేవలందించేటపుడు నర్సులు, ఇతర సహాయ సిబ్బంది ఎంతగా రక్షణ చర్యలు పాటించినప్పటికీ వాళ్లు కూడా వైరస్ బారిన పడుతున్నారు.
వారికి ఈ రకమైన ముప్పు తగ్గించేందుకు గాను నెల్లూరులో రోబో సేవలు ప్రవేశ పెట్టారు. నెల్లూరులోని రీజనల్ కోవిడ్ సెంటర్లో ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మందులు, ఆహార పదార్థాల్ని నెల్వార్ట్ అనే రోబోనే అందజేస్తోంది.
నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను రూపొందించారు. కోవిడ్పై పోరాడుతున్న వైద్యులకు ఈ రోబోను అందజేశారు. ఈ సందర్భంగా రోబో పని తీరుపై డెమో కూడా ఇచ్చారు. ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని కరోనా రోగులకు ఈ రోబో సరఫరా చేస్తుందని తెలిపారు.
త్వరలోనే ఇంకో రెండు రోబోలు తయారు చేసి వాటిని నెల్లూరు జిల్లాలోని మిగతా కోవిడ్ ఆసుపత్రులకు అందజేస్తామని ఈ సంస్థ తెలియజేసింది. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని ఈ రోబో పనితీరును గమనించి తయారీదారుల్ని అభినందించారు. ఆసుపత్రిలో జనాలు ఈ రోబో పనితీరును ఆసక్తిగా గమనిస్తున్నారు.
This post was last modified on April 29, 2020 2:42 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…