రోడ్ల మీద జనాలు లాక్ డౌన్ నిబంధనలు సరిగ్గా పాటిస్తున్నారో లేదో చూడటానికి సింగపూర్లో రోడ్ల మీద పోలీస్ రోబో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఈ ఉదయం దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ట్విట్టర్లో షేర్ చేశాడు. కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు రోబోల సాయం తీసుకుంటున్నాయి.
ఈ సమయంలో మనుషుల మధ్య సంబంధాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదన్న ఉద్దేశంతో కరోనా పేషెంట్ల సేవల కోసం రోబోల్ని ఉపయోగిస్తున్నాయి పలు దేశాయి. ఈ కోవలోనే మన దగ్గరా రోబో సేవలు మొదలయ్యాయి. అది తెలుగు గడ్డ మీదే కావడం విశేషం.
ఆంద్రప్రదేశ్లోని నెల్లూరులో కరోనా పేషెంట్ల సేవలకు గాను రోబోల సాయం తీసుకుంటున్నారు వైద్యులు. కరోనా పేషెంట్లకు చికిత్స చేసే క్రమంలో వైద్యులు, వారికి సేవలందించేటపుడు నర్సులు, ఇతర సహాయ సిబ్బంది ఎంతగా రక్షణ చర్యలు పాటించినప్పటికీ వాళ్లు కూడా వైరస్ బారిన పడుతున్నారు.
వారికి ఈ రకమైన ముప్పు తగ్గించేందుకు గాను నెల్లూరులో రోబో సేవలు ప్రవేశ పెట్టారు. నెల్లూరులోని రీజనల్ కోవిడ్ సెంటర్లో ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స పొందుతున్న కరోనా రోగులకు మందులు, ఆహార పదార్థాల్ని నెల్వార్ట్ అనే రోబోనే అందజేస్తోంది.
నెల్లూరుకు చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అనే సేవా సంస్థ నిర్వాహకులు ఈ రోబోను రూపొందించారు. కోవిడ్పై పోరాడుతున్న వైద్యులకు ఈ రోబోను అందజేశారు. ఈ సందర్భంగా రోబో పని తీరుపై డెమో కూడా ఇచ్చారు. ఒకేసారి దాదాపు 40 కేజీల వరకు మందులు, ఆహారాన్ని కరోనా రోగులకు ఈ రోబో సరఫరా చేస్తుందని తెలిపారు.
త్వరలోనే ఇంకో రెండు రోబోలు తయారు చేసి వాటిని నెల్లూరు జిల్లాలోని మిగతా కోవిడ్ ఆసుపత్రులకు అందజేస్తామని ఈ సంస్థ తెలియజేసింది. జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు ఆసుపత్రికి చేరుకుని ఈ రోబో పనితీరును గమనించి తయారీదారుల్ని అభినందించారు. ఆసుపత్రిలో జనాలు ఈ రోబో పనితీరును ఆసక్తిగా గమనిస్తున్నారు.
This post was last modified on April 29, 2020 2:42 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…