Trends

హెచ్ఎంపీవీ వైరస్‌పై చైనా వివరణ

చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా ఆధారరహితమని, ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, కానీ గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చైనాలో ప్రజలు, విదేశీయులు భద్రంగానే ఉండవచ్చని, కొత్త వైరస్ వ్యాప్తి లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. ఈ వైరస్‌పై వస్తున్న తప్పుడు కథనాలు, ప్రచారాలు చైనాను దూషించడానికే ఉద్దేశించినవని విమర్శించారు. హెచ్ఎంపీవీ లక్షణాలు ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వైరస్ బారిన పడినవారి దగ్గరికి ఎక్కువగా వెళ్లడం, చేతులు కలపడం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ వైరస్‌కు ప్రత్యేకమైన టీకా లేదా నిర్దిష్టమైన చికిత్స ఇప్పటికీ లేదు. లక్షణాలను అదుపులో ఉంచే విధంగా మాత్రమే చికిత్స ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రజలు అవగాహనతో ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

This post was last modified on January 4, 2025 10:54 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago