చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా ఆధారరహితమని, ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, కానీ గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చైనాలో ప్రజలు, విదేశీయులు భద్రంగానే ఉండవచ్చని, కొత్త వైరస్ వ్యాప్తి లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. ఈ వైరస్పై వస్తున్న తప్పుడు కథనాలు, ప్రచారాలు చైనాను దూషించడానికే ఉద్దేశించినవని విమర్శించారు. హెచ్ఎంపీవీ లక్షణాలు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వైరస్ బారిన పడినవారి దగ్గరికి ఎక్కువగా వెళ్లడం, చేతులు కలపడం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ వైరస్కు ప్రత్యేకమైన టీకా లేదా నిర్దిష్టమైన చికిత్స ఇప్పటికీ లేదు. లక్షణాలను అదుపులో ఉంచే విధంగా మాత్రమే చికిత్స ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రజలు అవగాహనతో ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…