Trends

హెచ్ఎంపీవీ వైరస్‌పై చైనా వివరణ

చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా ఆధారరహితమని, ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, కానీ గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చైనాలో ప్రజలు, విదేశీయులు భద్రంగానే ఉండవచ్చని, కొత్త వైరస్ వ్యాప్తి లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. ఈ వైరస్‌పై వస్తున్న తప్పుడు కథనాలు, ప్రచారాలు చైనాను దూషించడానికే ఉద్దేశించినవని విమర్శించారు. హెచ్ఎంపీవీ లక్షణాలు ఇతర శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వైరస్ బారిన పడినవారి దగ్గరికి ఎక్కువగా వెళ్లడం, చేతులు కలపడం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ వైరస్‌కు ప్రత్యేకమైన టీకా లేదా నిర్దిష్టమైన చికిత్స ఇప్పటికీ లేదు. లక్షణాలను అదుపులో ఉంచే విధంగా మాత్రమే చికిత్స ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రజలు అవగాహనతో ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలకు సూచించింది.

This post was last modified on January 4, 2025 10:54 am

Share

Recent Posts

అసెంబ్లీలో మంత్రుల పక్కన సీఎం కూర్చోవడం ఎప్పుడైనా చూసారా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…

18 minutes ago

ఇంట్రెస్టింగ్… ఫ్లాప్ దర్శకుల కలయికలో సినిమా?

సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…

2 hours ago

ఇరుముడి కొట్టుడు మళ్లీ మొదలు

‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…

2 hours ago

సుబ్బులక్ష్మి బయోపిక్… సాయిపల్లవి స్థానంలో రష్మిక

సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…

3 hours ago

తెలుగు రామాయణ మీద 100 కోట్లు సేఫేనా

నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…

4 hours ago

ఓజి 2 సౌండ్ చెయ్యడం లేదేంటి

సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…

4 hours ago