చైనాలో హెచ్ఎంపీవీ (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) వైరస్ కారణంగా ఆసుపత్రుల్లో రద్దీ పెరిగిందన్న వార్తలను చైనా ప్రభుత్వం ఖండించింది. ఈ కథనాలు పూర్తిగా ఆధారరహితమని, ప్రజలను అనవసరంగా భయాందోళనకు గురి చేస్తున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. శీతాకాలంలో సాధారణంగా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని, కానీ గత ఏడాదితో పోలిస్తే పరిస్థితి కొంచెం మెరుగ్గానే ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
చైనాలో ప్రజలు, విదేశీయులు భద్రంగానే ఉండవచ్చని, కొత్త వైరస్ వ్యాప్తి లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ వెల్లడించారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధపెట్టామని, నేషనల్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను పాటిస్తున్నామని తెలిపారు. ఈ వైరస్పై వస్తున్న తప్పుడు కథనాలు, ప్రచారాలు చైనాను దూషించడానికే ఉద్దేశించినవని విమర్శించారు. హెచ్ఎంపీవీ లక్షణాలు ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల మాదిరిగానే ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
దగ్గు, జలుబు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. వైరస్ బారిన పడినవారి దగ్గరికి ఎక్కువగా వెళ్లడం, చేతులు కలపడం ద్వారా ఇది వ్యాపిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, వృద్ధులు ఈ వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ వైరస్కు ప్రత్యేకమైన టీకా లేదా నిర్దిష్టమైన చికిత్స ఇప్పటికీ లేదు. లక్షణాలను అదుపులో ఉంచే విధంగా మాత్రమే చికిత్స ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ప్రజలు అవగాహనతో ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం ప్రజలకు సూచించింది.
This post was last modified on January 4, 2025 10:54 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…