Trends

వారానికి 70 గంటలు పనా.. పెళ్లాం పారిపోతుంది

వారానికి 70 గంటల పనిపై గౌతమ్ అదానీ అదిరే మాటతరచూ వార్తల్లో నిలుస్తూ.. ఏదో ఒక సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ.. దేశీయ కార్పొరేట్ లో వివాదాల చుట్టూ వినిపించే పేరు ఏదైనా ఉందంటే.. అది గౌతమ్ అదానీనే. ప్రపంచం సంగతి పక్కన పెడితే.. మన దేశంలో అత్యంత వేగంగా దూసుకెళ్లిన పారిశ్రామకవేత్త ఎవరైనా ఉన్నారంటే.. గౌతమ్ అదానీ పేరే వినిపిస్తుంటుంది.

ఇప్పటివరకు ఆయన నోటి నుంచి వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన మాటలే విని ఉంటాం. తాజాగా ఆయన వర్కు – లైఫ్ బ్యాలెన్స్ కు సంబంధించి ఆయన నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు వింటే ఫిదా కాకుండా ఉండలేం. దేశ ఉత్పాదకతను పెంచేందుకు మరింతగా పని చేయాలని.. వారానికి 70 గంటలు పని చేయాలంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలకు తనదైన శైలిలో అదానీ బదులిచ్చారు.

అలా చేస్తే.. పెళ్లాం పారిపోతుందన్న ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయిఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా గౌతమ్ అదానీ మాట్లాడుతూ.. ‘‘వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ విసయంలో మీరు అనుసరిస్తోన్న విధానాలను ఇతరులపై రుద్దొద్దు. కొందరు నాలుగు గంటలు కుటుంబానికి వెచ్చించి ఆనందాన్ని పొందుతారు. మరొకరి ఆలోచన వేరేలా ఉంటుంది. అది వారి బ్యాలెన్స్. చేస్తున్న పనిలోనే నిమగ్నమైతే భార్య పారిపోతుంది.

మీకు నచ్చిన పనులు చేస్తే.. మీ జీవితంలో సమతుల్యత ఉంటుంది’’ అని పేర్కొన్నారు. అదే సమయంలో మరిన్ని వ్యాఖ్యలు చేశారు కుటుంబం.. ఉద్యోగం ఇవే ప్రపంచమన్న ఆయన పిల్లలు కూడా మన నుంచి ఇవే విషయాల్ని గమనించి ఆచరిస్తుంటారు. ఇక్కడ ఎవరు శాశ్వితంగా ఉండిపోవటానికి రాలేదన్న గౌతమ్ అదానీ.. ‘‘ఈ విషయం అర్థమైనప్పుడు మన జీవితం సరళంగా మారుతుంది’’ అంటూ ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి గతంలో వెలుబుచ్చిన వ్యాఖ్యలను తప్పు పడుతూ.. వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఒక పాడ్ కాస్ట్ లో మాట్లాడిన నారాయణమూర్తి.. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో ఉత్పాదకత తక్కువన్న ఆయన.. దీనికి బదులుగా దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలని చెప్పటం తెలిసిందే. రెండో ప్రపంచ యుద్దం తర్వాత జపాన.. జర్మనీ దేశాలు ఎలా అయితే.. కష్టపడ్డాయో.. మనమూ అలానే కష్టపడాలన్నారు.

ఇందుకు యువత వారానికి 70 గంటలు పని చేయాలని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. నారాయణ మూర్తి ఆలోచన తీరును పలువురు వ్యతిరేకించారు. తప్పు పట్టారు. ఆ జాబితాలో ఇప్పుడు గౌతమ్ అదానీ కూడా చేరారు.

This post was last modified on January 1, 2025 11:14 am

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

3 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

3 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

6 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

6 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

6 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

7 hours ago