Trends

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో భారత్‌ ఘోర పరాజయం!

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్‌ విఫలమై కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

భారత బ్యాటింగ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులతో నిలబడ్డాడు. అయితే, మిగతా బ్యాటర్లు అతనికి సహకరించలేకపోయారు. జైస్వాల్‌తో కలిసి రిషభ్‌ పంత్‌ కొద్దిసేపు పోరాడాడు. ఈ ఇద్దరూ కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ, పంత్‌ 30 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ చేరాడు. పంత్ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. తెలుగు కుర్రాడు నితీష్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినప్పటికీ కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.

భారత్ బౌలింగ్‌లో కూడా ఆసీస్‌ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఆసీస్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తన అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ విజేతగా నిలిచాడు. కమిన్స్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌తో పాటు బొలాండ్‌ 3 వికెట్లు, నాథన్‌ లైయన్‌ 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను సమూలంగా దెబ్బతీశారు. ఈ పరాజయంతో టీమిండియా తేలికపాటి ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనీస స్థిరత్వాన్ని ప్రదర్శించకపోవడం భారత్‌ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. ఇక చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసే ఛాన్స్ కోసం టీమిండియా ప్రయత్నించాల్సిన పరిస్థితి నెలకొంది.

This post was last modified on December 30, 2024 12:54 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

తిరస్కరించిన సినిమాకు హడావిడి ఎందుకయ్యా

ఒకప్పటి డిజాస్టర్లు ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ లో బాగా ఆడటం గమనిస్తున్నాం. ఆరెంజ్ మూడుసార్లు వచ్చినా కలెక్షన్లు కుమ్మరించింది.…

1 hour ago

అప్పులు కట్టుకుంటున్న మంచు లక్ష్మీ

టాలీవుడ్లో ఘ‌న చ‌రిత్ర ఉన్న బేన‌ర్లో ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్ ఒక‌టి. ఈ బేన‌ర్ మీద ప‌దుల సంఖ్య‌లో సినిమాలు తీశారు…

2 hours ago

రెండో పెళ్లి మీద హీరోయిన్ ఆసక్తి

‘యమదొంగ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది మలయాళ భామ మమతా మోహన్ దాస్. ఆ చిత్రంలో చలాకీ పాత్ర…

5 hours ago

మరోసారి కన్నీరు పెట్టిన ఎర్రబెల్లి

ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకుల్లో చాలామంది పెద్దగా భావోద్వేగాలకు లోను కారు. మిన్ను విరిగి మీద పడ్డా…ఎన్నికల…

6 hours ago

మెరుగైన ఛాయిస్ కోసం రావిపూడి వేట

మన శంకరవరప్రసాద్ గారు రూపంలో చిరంజీవికి బ్లాక్ బస్టర్ కానుక ఇచ్చి రెమ్యునరేషన్ తో పాటు రేంజ్ రోవర్ కారు…

6 hours ago

సుప్రీం కోర్టు తీర్పుపై నటి తల్లి ఏమన్నారు?

24 ఏళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిన నటి ప్రత్యూష మృతి వ్యవహారంలో సుప్రీం కోర్టు…

7 hours ago