మెల్బోర్న్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ విఫలమై కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత బ్యాటింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులతో నిలబడ్డాడు. అయితే, మిగతా బ్యాటర్లు అతనికి సహకరించలేకపోయారు. జైస్వాల్తో కలిసి రిషభ్ పంత్ కొద్దిసేపు పోరాడాడు. ఈ ఇద్దరూ కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ, పంత్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ చేరాడు. పంత్ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. తెలుగు కుర్రాడు నితీష్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినప్పటికీ కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
భారత్ బౌలింగ్లో కూడా ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. కమిన్స్ రెండు ఇన్నింగ్స్లో కలిపి 6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్తో పాటు బొలాండ్ 3 వికెట్లు, నాథన్ లైయన్ 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను సమూలంగా దెబ్బతీశారు. ఈ పరాజయంతో టీమిండియా తేలికపాటి ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనీస స్థిరత్వాన్ని ప్రదర్శించకపోవడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. ఇక చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసే ఛాన్స్ కోసం టీమిండియా ప్రయత్నించాల్సిన పరిస్థితి నెలకొంది.
This post was last modified on December 30, 2024 12:54 pm
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…