మెల్బోర్న్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్ విఫలమై కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
భారత బ్యాటింగ్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులతో నిలబడ్డాడు. అయితే, మిగతా బ్యాటర్లు అతనికి సహకరించలేకపోయారు. జైస్వాల్తో కలిసి రిషభ్ పంత్ కొద్దిసేపు పోరాడాడు. ఈ ఇద్దరూ కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ, పంత్ 30 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ చేరాడు. పంత్ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. తెలుగు కుర్రాడు నితీష్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినప్పటికీ కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.
భారత్ బౌలింగ్లో కూడా ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ విజేతగా నిలిచాడు. కమిన్స్ రెండు ఇన్నింగ్స్లో కలిపి 6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్తో పాటు బొలాండ్ 3 వికెట్లు, నాథన్ లైయన్ 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్ను సమూలంగా దెబ్బతీశారు. ఈ పరాజయంతో టీమిండియా తేలికపాటి ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనీస స్థిరత్వాన్ని ప్రదర్శించకపోవడం భారత్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. ఇక చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసే ఛాన్స్ కోసం టీమిండియా ప్రయత్నించాల్సిన పరిస్థితి నెలకొంది.
This post was last modified on December 30, 2024 12:54 pm
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…