Trends

మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో భారత్‌ ఘోర పరాజయం!

మెల్‌బోర్న్‌ వేదికగా జరిగిన బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా జట్టు అద్భుత విజయాన్ని సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాటింగ్‌ విఫలమై కేవలం 155 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

భారత బ్యాటింగ్‌లో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులతో నిలబడ్డాడు. అయితే, మిగతా బ్యాటర్లు అతనికి సహకరించలేకపోయారు. జైస్వాల్‌తో కలిసి రిషభ్‌ పంత్‌ కొద్దిసేపు పోరాడాడు. ఈ ఇద్దరూ కలిసి 88 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినప్పటికీ, పంత్‌ 30 పరుగుల వ్యక్తిగత స్కోరుతో పెవిలియన్ చేరాడు. పంత్ ఔటైన తర్వాత భారత బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. తెలుగు కుర్రాడు నితీష్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో సెంచరీ చేసినప్పటికీ కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్ లో ఒక పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.

భారత్ బౌలింగ్‌లో కూడా ఆసీస్‌ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. ఆసీస్ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ తన అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ విజేతగా నిలిచాడు. కమిన్స్ రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 6 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌తో పాటు బొలాండ్‌ 3 వికెట్లు, నాథన్‌ లైయన్‌ 2 వికెట్లు తీసి భారత బ్యాటింగ్‌ను సమూలంగా దెబ్బతీశారు. ఈ పరాజయంతో టీమిండియా తేలికపాటి ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కీలక సమయంలో టాప్ ఆర్డర్ బ్యాటర్లు కనీస స్థిరత్వాన్ని ప్రదర్శించకపోవడం భారత్‌ ఓటమికి ప్రధాన కారణంగా మారింది. ఇక చివరి టెస్టులో గెలిచి సిరీస్ సమం చేసే ఛాన్స్ కోసం టీమిండియా ప్రయత్నించాల్సిన పరిస్థితి నెలకొంది.

This post was last modified on December 30, 2024 12:54 pm

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

2 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

3 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

3 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

3 hours ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

4 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

5 hours ago