మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతంగా రాణించాడు. టెస్టు కెరీర్లో తన తొలి శతకాన్ని నమోదు చేసిన నితీశ్, ఆస్ట్రేలియా గడ్డపై 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా నిలిచాడు. 171 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన నితీశ్ తన అద్భుత ప్రదర్శనతో జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు.
మొదట హాఫ్ సెంచరీ మార్క్ దగ్గర ‘తగ్గేదేలే’ అనే మేనరిజంతో మరింతగా ఆకట్టుకున్నాడు. నితీశ్ ఆడిన ఇన్నింగ్స్ జట్టుకు విశేషంగా ఉపయోగపడింది. అతను ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్కు తలొగ్గకుండా నిలకడైన ఆటతీరు కనబరిచాడు. ముఖ్యంగా చివరి దశలో బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ను ఎదుర్కొని తన శతకాన్ని సాధించాడు. 99 పరుగుల వద్ద నాన్స్ట్రైక్ ఎండ్లో ఉండగా, సిరాజ్ సమర్థవంతంగా డిఫెన్స్ ఆడి నితీశ్కు స్ట్రైక్ ఇచ్చాడు.
చివరకు బౌలర్ బోలాండ్ బౌలింగ్లో బౌండరీతో నితీశ్ సెంచరీ పూర్తి చేసి, ప్రేక్షకులను ఉత్సాహభరితంగా ఉంచాడు. తండ్రి ముత్యాల రెడ్డి ఆటను ప్రత్యక్షంగా వీక్షించడం మరింత సంతోషకరమైన విషయం. కొడుకు సెంచరీతో ఆయన ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. ఇక వాషింగ్టన్ సుందర్తో కలిసి ఎనిమిదో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించిన నితీశ్ జట్టు ఇన్నింగ్స్కు స్థిరత్వాన్ని తీసుకొచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కూడా తన అర్ధశతకంతో అద్భుతంగా రాణించాడు. ఈ జత జట్టును ఫాలో ఆన్ ముప్పు నుంచి గట్టెక్కించడంలో కీలక పాత్ర పోషించింది.
నితీశ్ సెంచరీ అనంతరం ఆట బ్యాడ్ లైటింగ్ కారణంగా నిలిచిపోయింది. నితీశ్ ప్రదర్శన భారత క్రికెట్ అభిమానులను గర్వపడేలా చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు 8 సిక్సర్లు బాదిన నితీశ్, ఒకే సిరీస్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారతీయ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ విజయంతో నితీశ్ ఆస్ట్రేలియా పర్యటనలో మైఖేల్ వాన్, క్రిస్ గేల్ వంటి దిగ్గజ ఆటగాళ్ల సరసన చేరాడు. ఈ యువ ఆటగాడు చూపిన ప్రదర్శన భారత జట్టుకు మరింత బలాన్ని ఇచ్చింది. బడా బ్యాటర్లు విఫలమైన చోట నితీశ్ ఆటతీరుతో మెల్బోర్న్ వేదికగా భారత యువ క్రికెటర్ల సత్తాను చాటిచెప్పాడు.
This post was last modified on December 28, 2024 12:59 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…