అబుదాబిలో గడుపుతున్న ఓ హైదరాబాదీకి అదృష్టం వరించింది. నాంపల్లి ప్రాంతానికి చెందిన రాజమల్లయ్య (60) ఇటీవల బిగ్ టికెట్ మిలియన్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఏకంగా మిలియన్ దిర్హమ్స్ (రూ. 2.32 కోట్లు) గెలుచుకున్నారు. దుబాయిలో వాచ్మెన్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మల్లయ్యకు ఈ విజయంతో జీవితం కొత్త మలుపు తిరిగింది.
రాజమల్లయ్య గత 30 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నారు. భార్య, పిల్లలు హైదరాబాదులో ఉంటుండగా, ఒంటరిగా ఉంటూ కుటుంబానికి అవసరమైన ఆదాయం అందించేందుకు కష్టపడ్డారు. నాలుగేళ్ల క్రితం స్నేహితుల ద్వారా బిగ్ టికెట్ లాటరీ గురించి తెలుసుకున్న ఆయన అప్పటి నుంచి స్నేహితులతో కలిసి లాటరీ టికెట్ కొనడం ప్రారంభించారు. ఇదివరకు టికెట్లు కొనుగోలు చేసినప్పటికీ అదృష్టం వారి చేయి జోడించలేదు. కానీ ఈసారి మాత్రం రాజమల్లయ్యకు బంపర్ లాటరీ తగిలింది.
రాజమల్లయ్య మాట్లాడుతూ, “మొదట లాటరీ నిర్వాహకుల నుంచి ఫోన్ రాగానే నమ్మలేకపోయాను. ఇది నా జీవితంలో నాకు కలిగిన అద్భుతమైన అనుభవం. ఈ విజయం నాకు ఒక ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. నా కుటుంబం కోసం ఈ నిధిని ఉపయోగిస్తాను. అదనంగా స్నేహితులతో పంచుకుంటాను” అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే “ఇది నా జీవితంలో మొదటి గెలుపు. ఇకపై కూడా లాటరీ టికెట్ కొనుగోలు చేయడం కొనసాగిస్తాను.” అంటూ వివరణ ఇచ్చాడు.
ఇప్పటివరకు వాచ్మెన్గా పని చేసిన రాజమల్లయ్య ఇప్పుడు తన జీవితాన్ని సవరించుకునే అవకాశం పొందారు. 2 కోట్ల రూపాయలు అంటే రాజమల్లయ్యకు మాత్రమే కాదు, ఆయన కుటుంబానికి కూడా అద్భుతమైన ఆర్థిక భద్రతను కలిగిస్తుంది. ఈ విజయంతో బిగ్ టికెట్ లాటరీ ఆయన జీవితంలో ఒక గర్వించదగిన మలుపు తీసుకొచ్చింది.
This post was last modified on December 28, 2024 12:45 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…