రెండు అంటే రెండు పిజ్జాల కోసం ఎంత ఖర్చు చేస్తారు? వెయ్యి రూపాయిలు. కాదంటే రెండు వేలు. అదీ కూడా కాదంటే రూ.3వేలకు మించి ఖర్చు పెట్టాల్సి రావటం ఉండదు. ఒకవేళ వైరటీ కోసం బంగారం పౌడర్ ను కాస్త మేళవించినా రూ.లక్ష అవుతుందేమో. అంతకు మించి కాదు. కానీ.. రెండు పిజ్జాల కోసం రూ.8వేల కోట్లు ఖర్చు చేశారంటే.. షాక్ తినాల్సిందే. ఇలా కూడా చేస్తారా? అని అనుకోవచ్చు.
కాకుంటే.. అవగాహన లేని వేళలో ఇలాంటి తప్పులే చేస్తారన్న భావన తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది.ఈ మొత్తం ఇష్యూ గురించి తెలిసిన తర్వాత ప్రపంచంలో ఇంతకు మించిన దురదృష్టవంతుడు మరొకరు ఉండరనిపిస్తుంది. అసలేం జరిగిందంటే.. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన లాస్లో హనిఎజ్ అనే వ్యక్తి 2010లో తన దగ్గర ఉన్న 10వేల బిట్ కాయిన్లను డాలర్లతో మార్చుకున్నాడు. దాంతో.. రెండు డామినోస్ పిజ్జాలను ఆర్డర్ చేసుకొని తిన్నాడు.
కట్ చేస్తే.. ఇప్పుడు ఒక్కో బిట్ కాయిన్ విలువ ఎంతో తెలుసా? రూ.80 లక్షల కంటే ఎక్కువ. అంటే.. అతను మార్చుకున్న పది వేల బిట్ కాయిన్ల విలువ అక్షరాల రూ.8వేల కోట్లకు పైనే. అయితే.. బిట్ కాయిన్లు మొదట ప్రవేశ పెట్టినప్పుడు ఎవరూ వాటిని తీసుకోవటానికి ఆసక్తి చూపలేదు. దీంతో.. వాటి విలువ చాలా తక్కువగా ఉండేది. కాల క్రమంలో సంపన్నులు బిట్ కాయిన్ లో మదుపు చేయటం.. వాటికున్న ప్రత్యేక లక్షణాలతో వాటి విలువ ఇటీవల కాలంలో భారీగా పెరిగిపోయింది.
ప్రపంచంలో మరే చోట మదుపు చేసినా రాని రిటర్న్స్ బిట్ కాయిన్ లో మదుపు చేసిన వారి సొంతమైంది. తాజాగా లాస్లో హనిఎజ్ ఉదంతం తెలిసిన తర్వాత విస్మయానికి గురవుతున్నారు. ఐటీ ప్రోగ్రామర్ గా వ్యవహరించే అతను చేసిన పొరపాటు.. జీవితంలో సరిదిద్దుకోలేనంత భారీగా మారిందన్న వ్యాఖ్య వినిపిస్తోంది. బిట్ కాయిన్ విషయానికి వస్తే 2010లో ఒక బిట్ కాయిన్ విలువ కేవలం 0.05 డాలర్లు మాత్రమే. మన రూపాయిల్లో చూస్తే కేవలం 2.29 రూపాయిలు మాత్రమే.
ఈ రోజున అదే ఒక బిట్ కాయిన్ విలువ రూ.80 లక్షలకు పైనే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత బిట్ కాయిన్ విలువ మరింత భారీగా పెరిగింది. కొంతకాలం క్రితం తక్కువ ధరకు అందుబాటులో ఉన్న బిట్ కాయిన్ విలువ ఒక దశలో లక్ష డాలర్ల మార్కు దాటింది. ఇటీవల కాలంలో బిట్ కాయిన్ కొంత తగ్గుముఖం పట్టింది. ట్రంప్ విజయం సాధించిన తర్వాత బిట్ కాయిన్ విలువ తగ్గటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.
This post was last modified on December 25, 2024 11:31 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…