Trends

అంతరిక్షంలో సునీతా విలియమ్స్.. మరింత ఆలస్యం!!

భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గడపాల్సిన సమయం అనూహ్యంగా పెరిగింది. 2025 మార్చి వరకు ఆమె ఐఎస్ఎస్‌లోనే ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఎనిమిది రోజుల ప్రయోగాల కోసం జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సూల్ ద్వారా బచ్ విల్‌మోర్‌తో కలిసి సునీత ఐఎస్ఎస్‌కు వెళ్లారు. ఈ ప్రయాణం అనంతరం జూన్ 14న భూమికి తిరిగి రావాల్సి ఉండగా, క్యాప్సూల్‌లో హీలియం లీకేజీ కారణంగా ఆ ప్రయాణం వాయిదా పడింది.

వ్యోమనౌక మాత్రమే భూమికి తిరిగి వచ్చి, వారు అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి సునీత, విల్‌మోర్ ఐఎస్ఎస్‌లో ఉన్నారు. అయితే, భూమికి తిరిగి రావడానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయం దొరకలేదు. గత నెలలో నాసా స్పేస్ఎక్స్ క్రూ-9 మిషన్‌ను ప్రయోగించింది. ఈ మిషన్‌లో నాలుగు సీట్లతో పాటు, సునీతా, విల్‌మోర్ కోసం ప్రత్యేకంగా రెండు సీట్లు ఖాళీగా ఉంచారు.

అయితే, ఈ మిషన్ ఫిబ్రవరి 2025లో మాత్రమే భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉందని నాసా వెల్లడించింది. ఇది సునీత, విల్‌మోర్ ఎదురుచూపులకు మరో నెల జోడిస్తోంది. మరోవైపు, క్రూ-9 సిబ్బందిని భర్తీ చేయడానికి క్రూ-10 మిషన్‌ను నాసా ప్రణాళికలో ఉంచింది. అయితే ఈ ప్రయోగం వచ్చే మార్చి కంటే ముందుకు జరగబోదని తెలుస్తోంది. దాంతో, సునీత, విల్‌మోర్ భూమికి తిరిగి రావడం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ఐఎస్ఎస్‌లో వీరు తాత్కాలికంగా మరిన్ని ప్రయోగాల్లో భాగస్వామ్యమవుతున్నప్పటికీ, వారి ఆరోగ్య పరిస్థితులపై ఈ ఆలస్య ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సునీతా విలియమ్స్ అంతరిక్షంలో అనేక రికార్డులు సృష్టించిన ప్రముఖ వ్యోమగామిగా ఇప్పటికే మంచి గుర్తింపుని అందుకున్నాడు. కానీ ఈ సాంకేతిక లోపం ఆమె మిషన్‌ను పొడిగించి, ఆందోళనకర పరిస్థితి ఏర్పరచింది. నాసా, స్పేస్ఎక్స్ వంటి సంస్థలు సమస్యను తక్షణమే పరిష్కరించి, వీరిని భూమికి సురక్షితంగా తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.

This post was last modified on December 18, 2024 11:24 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

4 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

6 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

8 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago