అది 1960 ప్రాంతం.. ఓరోజు సాయంత్రం.. “అందరూ తబలా వాయిస్తారు. నువ్వేంటి ప్రత్యేకం”- ఇదీ.. 15 ఏళ్ల వయసులో తన తండ్రి నుంచి వచ్చిన సూటి ప్రశ్న. దీనికి కారణం.. చదువును అశ్రద్ధ చేస్తున్నారని.. తబలాకే సమయం కేటాయిస్తున్నారన్నది ఓ తండ్రిగా ఆయన ఆవేదన. ఇదే.. ఆ యువకుడిలో కసి రేపింది. తబలా వాయిద్యాన్ని త..’భళా’ అని పించేస్థాయిలో ప్రపంచ ప్రసిద్ధం చేశారు. నిజానికి అప్పటికి జంతు చర్మలాలతో చేసిన వాద్య పరికరాలకు ప్రపంచ దేశాల్లో ఆదరణ లేదు. అసలు వాటి గురించి కూడా తెలియదు.
కేవలం డ్రమ్స్ మాత్రమే ప్రపంచ దేశాలకు తెలుసు. అలాంటి ప్రపంచ దేశాలు.. ‘ఈ తబలా వాద్యం మాది’- అని అనేంత స్థాయికి ఉత్తరాది దివ్య సంగీత వాద్య పరికరం.. తబలాకు ప్రపంచ ప్రఖ్యాతి తీసుకువచ్చారు జాకిర్ హుస్సేన్. పుట్టింది.. మైనారిటీ ముస్లిం కుటుంబంలో అయినా.. ఆయన సుస్వరాలకు బానిసయ్యారు. త్యాగరాజ స్వామి కృతులంటే.. చెవి కోసుకుంటారు. చిన్న వయసులో తబలా కొని పెట్టమంటే.. తండ్రి ససేమిరా అన్నారు. అయినా.. ఆయన తన ప్రయత్నం వదులుకోలేదు.
ఇంట్లోని వంట పాత్రలనే చెరో చేతికింద వేసుకుని.. స్వరాలు పలికించిన.. నిత్యసాత్వికుడు.. సంగీత సాధకుడు జాకిర్ హుస్సేన్. ‘వాహ్ తాజ్’ అనే ఏకైక నినాదం.. ప్రకటనగా మారి.. ప్రపంచాన్ని చుట్టేసిన.. విషయం తెలిసిందే. తన తబలా ద్వారా.. అశేష సంఖ్యలో ప్రపంచ వ్యాప్త అభిమానులను సొంతం చేసు కున్న జాకిర్ హుస్సేన్.. ఇక లేరు. సోమవారం ఉదయం 6.45 నిమిషాలకు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో అమరలోకానికి తరలిపోయారు.
1951, మార్చి 9న ముంబైలో జన్మించిన హుస్సేన్.. 12 ఏళ్ల వయసుకే.. తబలాలో అగ్రశ్రేణి బాల వాద్య కారుడిగా గుర్తింపు పొందారు. ఎలాంటి ప్రోత్సాహం లేదు. కుటుంబమా.. సంగీత నేపథ్యానికి కడు దూరం. అయినా.. లక్షిత లక్ష్యాన్ని సాధించడంలో ఆయన అలుపెరుగని కృషి చేశారు. వినయం.. విధేయత.. నేటికీ ఆయన విడిచి పెట్టని.. ఆయనతోపాటే సహజీవనం చేసిన ఆభరణాలు. తనకు ఏదో కావాలని ఆయన కోరుకోలేదు. కానీ, ఆయనను వెతుక్కుంటూ..అనేక పదవులు.. గౌరవాలు గుమ్మం ముందు వేచి ఉన్నాయి.
తీవ్ర అనారోగ్యంతో కొన్నాళ్లుగా బాధపడుతున్న హుస్సేన్.. 40 ఏళ్ల కిందటే అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడే ఓ ఇటాలియన్ అమెరికన్ను వివాహం చేసుకున్నారు. భారతీయ సంప్రదాయాలకు విలువ ఇచ్చే ఆయన.. ఇద్దరు కుమార్తెలను కూడా.. అదే పంథాలో పెంచారు. తాజాగా సోమవారం ఉదయం ఆయన గుండెపోటుతో చికిత్స పొందుతూ.. తుది శ్వాస విడిచారు. ఆయన లేరు.. కానీ, ఆయన తబలా స్వరాలు మాత్రం వినిపిస్తూనే ఉంటాయి. కాగా.. ‘ఉస్తాద్’ అనే గౌరవాన్ని ఆయనకు ఇచ్చింది.. చాలా మందికి తెలియదు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ. ఇది సంగీత రంగంలోనే కాదు.. వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఉత్తరాది ఇచ్చే అత్యద్భుత గౌరవం. షెహనాయి విద్యాంసులు.. బిస్మిల్లా ఖాన్కు కూడా.. ఉస్తాద్ బిరుదు ఉన్న విషయం తెలిసిందే.
This post was last modified on December 16, 2024 10:15 am
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…