వచ్చే ఏడాది పాకిస్తాన్ ఆతిథ్యంలో జరగాల్సిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును పాకిస్తాన్కు పంపించబోమని స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ పరిస్థితుల్లో టోర్నమెంట్ నిర్వహణపై ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో చర్చలు కొనసాగిస్తున్నాయి. కానీ పాకిస్థాన్ తన వైఖరిని పూర్తి స్థాయిలో వెల్లడించకపోవడంతో సమస్యలు సద్దుమణగడంలేదు.
ఐసీసీ హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదనను పీసీబీకి సమర్పించినప్పటికీ, దీనిపై ఇంకా నిర్ణయం వెలువడలేదు. టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య జరుగుతుందని ఊహిస్తున్నప్పటికీ, షెడ్యూల్ ఖరారు ఆలస్యం అవుతుండడం టోర్నమెంట్ నిర్వహణపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. బ్రాడ్కాస్టర్లు, స్పాన్సర్లు ఈ అస్పష్టత వల్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే, టోర్నీ ఫార్మాట్పై కీలక మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. వన్డే ఫార్మాట్లో కాకుండా, టీ20 ఫార్మాట్లో టోర్నమెంట్ నిర్వహించడంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 50 ఓవర్ ఫార్మాట్కు ఆదరణ తగ్గుతూ ఉండటం, టీ20 ఫార్మాట్లో మార్కెటింగ్ సులభతరం అవుతుందని భావిస్తున్న బ్రాడ్కాస్టర్లు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. దీనిపై ఐసీసీ కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు ఐసీసీకి పెద్ద సవాలుగా మారాయి. వేగంగా నిర్ణయం తీసుకోకపోతే టోర్నమెంట్ నిర్వహణలో మరింత అనిశ్చితి నెలకొనే అవకాశం ఉంది.
This post was last modified on December 12, 2024 4:22 pm
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో దురంధర్ 2కి విపరీతమైన మద్దతు ఇస్తూ తెగ హల్చల్ చేస్తున్నారు. అటెన్షన్…
ఈ మధ్య వెబ్ సిరీస్ లకు పెద్దగా ఆదరణ ఉండటం లేదు. ఏదైనా యునానిమస్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అతి పెద్ద బడ్జెట్ తో రూపొందుతున్న ది ప్యారడైజ్ మొదటి ఆడియో సింగల్…
తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…